గోహత్యల నివారణ ధ్యేయంగా ఏప్రిల్ 27న గో సన్మాన ఆహ్వానం అభియాన్ కార్యక్రమం

0
125

*గోహత్యల నివారణే ధ్యేయం గా ఏప్రిల్ 27న ‘గో సమ్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం*

 

*విజయవాడ:* దేశంలో గోహత్యలను పూర్తిగా అరికట్టి, గోమాతకు తగిన గౌరవాన్ని, స్థానాన్ని తిరిగి కల్పించడమే లక్ష్యంగా,గో సమ్మాన్ ఆహ్వాన్ అభియాన్, (గో గౌరవ ఆహ్వాన ఉద్యమం) పేరుతో భారీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఉద్యమ ప్రతినిధులు వెల్లడించారు. శనివారం విజయవాడ గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో గోవత్ కిరణ్ కృష్ణ, సభ్యులు హరిసింగ్, కృష్ణ, పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఉద్యమానికి ఏ వ్యక్తి లేదా సాధువులు నాయకత్వం వహించడం లేదని స్వయంగా గోమాత ప్రధాన సంరక్షకుడు నంది బాబా అధ్యక్షతన వారి మార్గదర్శకత్వంలోనే ఈ ఉద్యమం కొనసాగుతోందని తెలిపారు. నిర్దాక్షిణ్యంగా కోతకు గురవుతున్న సుమారు 80 వేల గోవుల ప్రాణాలను రక్షించాలని, గోహత్యలపై భారత ప్రభుత్వం కఠినమైన చట్టాన్ని తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. ఏప్రిల్ 27, 2026న ఈ అభియాన్ లో భాగంగా ఒక 

సంతకాల సేకరణ (సిగ్నేచర్ కాంపెయిన్) నిర్వహిస్తున్నామని, ప్రజలందరూ తమ కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి సంతకాలు చేసి ఆ పత్రాలను ప్రభుత్వ అధికారులకు అందజేయాలని కోరారు.

గోమాత హోదా గోవును కేవలం జంతువుగా కాకుండా మన సంస్కృతికి మూలమైన 

రాష్ట్ర మాత రాష్ట్ర దేవిగా 

గుర్తించాలని ఈ అభియాన్ డిమాండ్ చేస్తోంది అన్నారు.

 

సభ్యులు హరిసింగ్ మాట్లాడుతూ సనాతన ధర్మంలో పుట్టినప్పటి నుండి మరణం వరకు గోవుకు విడదీయలేని సంబంధం ఉందని గుర్తుచేశారు. ఒకప్పుడు ప్రతి 15-18 మందికి ఒక ఆవు ఉండేదని, నేడు ఆ పరిస్థితి మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జెర్సీ ఆవు పాల వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, భారతీయ దేశీ ఆవు పాల విశిష్టతను గుర్తించాలని,శాంతియుత మార్గంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి గోహత్యలను నిరోధించడమే ఈ ఉద్యమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు...

Search
Categories
Read More
Telangana
ప్రభుత్వ కస్తూరిబా, వసతి గృహాలు క్లీన్ అండ్ ఆక్టివిటీ సమర్థవంతంగా నిర్వహించాలి.... జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
మెదక్ జిల్లా కుల్చారం మండలం కస్తూరిబా గాంధీ విద్యాలయాన్ని సందర్శించి బాలికలకు అమలవుతున్న...
By Gangaram Rangagowni 2026-01-09 10:07:26 0 143
Andhra Pradesh
Ycp పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్
శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు  తాడేపల్లి లోని సెంటర్ ysrcp పార్టీ ఆఫీసు దగ్గర ప్రెస్...
By Kola Kirankumar 2026-03-31 18:28:44 0 96
Bihar
तेजस्वी यादव की १६ जिलों में यात्रा कानून-व्यवस्था पर सवाल
बिहार विधानसभा के नेता प्रतिपक्ष #तेजस्वीयादव ने १६ जिलों में अपनी यात्रा की घोषणा की है। इस...
By Pooja Patil 2025-09-13 06:15:03 0 162
Andhra Pradesh
ఆయి శెట్టి సీతారామయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
గుంటూరు నగరంలోని నెహ్రు నగర్56వ డివిజన్ కార్పొరేటర్ ఆయి శెట్టి కనకదుర్గ శ్రీనివాస్ మార్కెట్...
By John Baji 2025-12-31 01:40:03 0 111
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com