ఎమ్మిగనూరులో ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో బివిజేనేశ్వర్ రెడ్డి గారు పాల్గొన్నారు

0
127

ఎమ్మిగనూరు ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర @2047 – బడ్జెట్ 2026-27 అవుట్‌రీచ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎమ్మిగనూరు నియోజకవర్గ అభివృద్ధిని వేగవంతం చేయడానికి రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం మరియు మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రజల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రతి అర్హులైన లబ్ధిదారులకు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో ఎమ్మిగనూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం అవసరమైన నిధులను సమకూర్చేందుకు ప్రభుత్వం దృష్టి సారించిందని, అభివృద్ధి పనులకు ప్రాధాన్యత కల్పిస్తూ మరిన్ని ప్రాజెక్టులను తీసుకురావడానికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. స్వర్ణ ఆంధ్ర లక్ష్య సాధనలో ఎమ్మిగనూరు నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి (PD), మూడు మండలాల ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్, టీడీపీ మండల మరియు పట్టణ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
2027 గద్దర్ అవార్డు లక్ష్యం గా నా "బతుకమ్మ " చిత్రం శ్రీను రావు పొన్నాల
తెలంగాణ ఆడ బిడ్డలు గర్వంగా  తలెత్తుకుని చూసే సినిమా ఈ సెప్టెంబర్‌లో వస్తుంది , తెలంగాణ...
By Ponnala Srinivasrao 2026-03-19 03:03:51 0 158
Andhra Pradesh
APK ఫైల్స్ లింకును ఎవరు కూడా క్లిక్ చేయకండి : కర్నూలు జిల్లా పోలీసులు
కర్నూలు : కర్నూలు జిల్లాAPK ఫైల్స్ లింకులను ఎవరూ కూడా క్లిక్ చేయకూడదు.... మీ ఫోన్ లు హ్యాక్...
By Hari Krishna 2026-01-19 14:58:37 0 117
Andhra Pradesh
గుంటూరు శ్రీ హజరత్ కాలే మస్తాన్‌ షా వలీ దర్గా గంధ మహోత్సవ 134వ ఉరుసు ఆహ్వాన పత్రికను అందజేసి ఆహ్వానించిన దర్గా ధర్మకర్త రావి రామ్మోహన.
వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ...
By John Baji 2026-01-06 13:03:16 0 151
Telangana
చేనేత కార్మిక పారిశ్రామిక సమస్యలు వెంటనే పరిష్కరించాలి రాష్ట్ర అధ్యక్షుడు వనం శాంతి కుమార్ డిమాండ్.
    *చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మార్చి 25వ తేదీన ఇందిరాపార్క్ హైదరాబాద్...
By Thalakokkula Sadanandam 2026-03-20 09:06:04 0 214
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com