హోరీజోన్ పబ్లిక్ స్కూల్ ఘనంగా మొదటి వార్షికోత్సవం వేడుకలు

0
221

వేటపాలెం గ్రామంలో హోరిజోన్ పబ్లిక్ స్కూల్ ఘనంగా మొదటి వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు.

 ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య,పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ చదువులో క్రమశిక్షణ ఎంతో అవసరమని,అది జీవితములో చక్కటి మార్గాన్ని చూపిస్తుందని తెలిపారు.తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను గౌరవించిన నాడే ఆదర్శ విద్యార్థిగా పేరు తెచ్చుకుంటాడని తెలిపారు. చదువుతోపాటు వివిధ పోటీలలోనూ, క్రీడారంగములోనూ రాణించాలని,తల్లిదండ్రులు కూడా విద్యార్థుల పట్ల ప్రేమానురాగాలతో పాటు వారి చదువుల పట్ల కూడా ప్రోత్సహించాల్సిన బాధ్యత ఎంతో ఉందని తెలిపారు. చదువు అనేది దొంగతనం చేయని వస్తువు లాంటిదని,చదువుకు వయస్సు నిమిత్తం లేదని, పేదరికంతో జీవించేవారు కూడా చక్కటి చదువును అనుభవించిన దాఖలాలు కలవని తెలిపారు. గురు శిష్యుల అనుబంధంతోనే మంచి మార్గంతో కూడిన చదువు లభిస్తుందని,చదువులో బాగా రాణించాలంటే క్రమశిక్షణ, పట్టుదల, జీవితంలో సాధించాలన్న తపన ఉండాలని తెలిపారు. తదుపరి విద్యార్థుల యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కరస్పాండెంట్ పొగడదండ రవి కుమార్,పాఠశాల ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు, విద్యార్థులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయ్యప్ప స్వామి కిప్రత్యేక పూజలు
పుంగనూరు: శ్ ర ీ కోటమల ై అయ్యప్ ప స్వామి ఆలయంల ో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే పెద్దిరెడ...
By Kothuru Murali 2025-12-27 17:31:46 0 195
Andhra Pradesh
మహాశివరాత్రిని పురస్కరించుకొని దేవాలయాల వద్ద తీసుకోవలసిన భద్రత చర్యల....
బాపట్ల జిల్లా: మహాశివరాత్రిని పురస్కరించుకొని దేవాలయాల వద్ద తీసుకోవలసిన భద్రత చర్యల గురించి...
By Gadiyapudi Narendra 2026-02-05 16:50:40 0 190
Andhra Pradesh
ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా పొందిన మఠం రాజశేఖర్ స్వామి
నందవరం మండలం పులచింత గ్రామం నుండి మఠం రాజశేఖర్ స్వామి పట్టా పొందడం చాలా సంతోషదగ్గ విషయం వారు...
By Boya Dasthagiri 2026-04-28 13:19:36 0 161
SURAKSHA
AP పోలీసులు నేడు: రక్తదాన వీరులుగా జీవాలు కాపాడారు
నేడు AP పోలీసులు “రక్తదానం జీవనదానం” శిబిరాలు 15 జిల్లాల్లో నిర్వహించారు. 24 గంటల్లో...
By Kalaga Sailaja 2026-07-04 09:21:03 0 32
Andhra Pradesh
ఏపీ కేబినెట్‌లో పొదుపు విప్లవం.. ఎస్కార్ట్ లేకుండా ఒకే వాహనంలో మంత్రులు.
ఆర్భాటాలను పక్కన పెట్టిన ఏపీ మంత్రులు లోకేశ్ ఏర్పాటు చేసిన విందుకు కాన్వాయ్ లేకుండా ఒకే వాహనంలో...
By Pagadala Venkateswar 2026-05-14 06:01:31 0 95
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com