యువత కోసం ఆధునిక స్నూకర్ సిండికేట్.. ఆల్వాల్‌లో ఈటెల ఘన ప్రారంభం.|

0
202

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్  నిన్న రాత్రి ముఖ్య అతిథిగా హాజరై స్నూకర్ సిండికేట్ ఇండోర్ ఆట స్థలాన్ని ఘనంగా ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. క్రీడలు యువతలో శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థిరత్వాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. స్నూకర్ వంటి ఆటలు ఏకాగ్రత, సహనం, వ్యూహాత్మక ఆలోచనలను అభివృద్ధి చేస్తాయని అన్నారు. నేటి యువత క్రీడలను అలవాటు చేసుకోవడం ద్వారా చెడు అలవాట్లకు దూరంగా ఉండి, తమ భవిష్యత్తును మెరుగుపరుచుకోవచ్చని సూచించారు.

అలాగే, ఇలాంటి ఆధునిక క్రీడా వేదికలు ప్రాంతీయ యువతకు మంచి అవకాశాలను అందిస్తాయని, భవిష్యత్తులో ఇక్కడి నుంచే ప్రతిభావంతులు వెలుగులోకి రావాలని అయన ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల మాణిక్య రెడ్డి, శ్రీనివాస్ వర్మతో పాటు సీనియర్ నాయకులు మల్లికార్జున్ గౌడ్, ఉదయ్ ప్రకాశ్, సూర్య, అశోక్, ప్రణయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

స్నూకర్ సిండికేట్ యజమానులు చందు రావు మరియు నిర్వాహకులు అతిథులను ఆత్మీయంగా ఆహ్వానించి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

#sidhumaroju 

Alwal 

Search
Categories
Read More
Telangana
కొడంగల్ నియోజకవర్గం మద్దూర్ లో మిన్నంటిన 'పసుపు' పండగ
కొడంగల్రి నియోజకవర్గం మద్దూర్ మండల రిపోర్టర్    సూర్యమోహన్    మద్దూరులో...
By Vanmoj Suryamohan 2026-03-30 03:40:14 0 208
Andhra Pradesh
మదనపల్లె ఘటన.. ఘోరంగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు.
మదనపల్లెలోని రాగిమానిదిన్నెపల్లెలో కుమార్తె రిషిక ప్రియా మృతదేహాన్ని చూసి తల్లి తీవ్ర దుఃఖంలో...
By Pagadala Venkateswar 2026-02-18 07:07:05 0 130
Telangana
భద్రాచలంలో కొనసాగుతున్న బంద్: బస్టాండ్ వద్ద నిలిచిపోయిన రాకపోకలు
భద్రాచలం: రాష్ట్రవ్యాప్త బంద్ పిలుపులో భాగంగా ఈరోజు భద్రాచలం పట్టణంలో బంద్ ప్రశాంతంగా, అయితే...
By Lakavath Kiran 2026-04-22 01:42:19 0 228
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com