యువత కోసం ఆధునిక స్నూకర్ సిండికేట్.. ఆల్వాల్‌లో ఈటెల ఘన ప్రారంభం.|

0
89

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్  నిన్న రాత్రి ముఖ్య అతిథిగా హాజరై స్నూకర్ సిండికేట్ ఇండోర్ ఆట స్థలాన్ని ఘనంగా ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. క్రీడలు యువతలో శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థిరత్వాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. స్నూకర్ వంటి ఆటలు ఏకాగ్రత, సహనం, వ్యూహాత్మక ఆలోచనలను అభివృద్ధి చేస్తాయని అన్నారు. నేటి యువత క్రీడలను అలవాటు చేసుకోవడం ద్వారా చెడు అలవాట్లకు దూరంగా ఉండి, తమ భవిష్యత్తును మెరుగుపరుచుకోవచ్చని సూచించారు.

అలాగే, ఇలాంటి ఆధునిక క్రీడా వేదికలు ప్రాంతీయ యువతకు మంచి అవకాశాలను అందిస్తాయని, భవిష్యత్తులో ఇక్కడి నుంచే ప్రతిభావంతులు వెలుగులోకి రావాలని అయన ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల మాణిక్య రెడ్డి, శ్రీనివాస్ వర్మతో పాటు సీనియర్ నాయకులు మల్లికార్జున్ గౌడ్, ఉదయ్ ప్రకాశ్, సూర్య, అశోక్, ప్రణయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

స్నూకర్ సిండికేట్ యజమానులు చందు రావు మరియు నిర్వాహకులు అతిథులను ఆత్మీయంగా ఆహ్వానించి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

#sidhumaroju 

Alwal 

Search
Categories
Read More
Andhra Pradesh
గంజాయి ధ్వంసం : కర్నూలు అడ్మిన్ ఎస్పీ
కర్నూలు : కర్నూలుజిల్లా...10  లక్షల  33 వేల  విలువ గల గంజాయి ధ్వంసం...
By Hari Krishna 2025-12-30 16:28:39 0 184
Telangana
కాలనీ పర్యటనలో కార్పొరేటర్ పాదయాత్ర.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని బృందావన్ కాలనీలోని బంగారు మైసమ్మ కాలనీ...
By Sidhu Maroju 2025-12-20 11:33:51 0 163
Andhra Pradesh
సీఎం చంద్రబాబు నాయుడు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం
*ప్ర‌చుర‌ణార్థం* *30-12-2025*   సీఎం చంద్ర‌బాబు జీవిత‌మే ఒక...
By Rajini Kumari 2025-12-30 12:29:18 0 127
Telangana
చెన్నారావుపేట(మం) అక్కల్ చెడ క్రాస్ రోడ్డు వద్ద గంజాయి పట్టివేత.
*వరంగల్ జిల్లా :*   చెన్నారావుపేట(మం) అక్కల్ చెడ క్రాస్ రోడ్డు వద్ద గంజాయి పట్టివేత. ...
By Ellandula Sandeep 2026-01-12 17:44:18 0 275
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com