స్టేడియాలు ఓపెన్ పబ్‌లా?.. కాన్సర్ట్‌ల తర్వాత చెత్త రాజ్యం.|

0
113

హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో క్రీడా మైదానాల వినియోగంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ముఖ్యంగా ఇటీవల నిర్వహించిన మ్యూజిక్ కాన్సర్ట్‌ల తర్వాత స్టేడియాల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. క్రీడాకారుల సాధనకు ఉద్దేశించిన మైదానాలు ఇప్పుడు ఓపెన్ పబ్‌లుగా మారిపోతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గత ఏడాది సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ కాన్సర్ట్‌తో ప్రారంభమైన ఈ ట్రెండ్, ఇటీవల అనిరుద్ రవిచందర్ లైవ్ షో, మూడు రోజుల క్రితం ఇలయరాజా సంగీత విభావరి వరకు కొనసాగింది. ఈ కార్యక్రమాలన్నీ గచ్చిబౌలి స్టేడియం ను వినోద కార్యక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చాయి.

ఈ భారీ ఈవెంట్ల తర్వాత స్టేడియంలో కనిపించిన దృశ్యాలు మాత్రం తీవ్ర నిరాశ కలిగిస్తున్నాయి. బీరు సీసాలు, మద్యం బాటిళ్లు, ప్లాస్టిక్ వ్యర్థాలు మైదానమంతా పేరుకుపోవడంతో పరిశుభ్రత పూర్తిగా దెబ్బతింది. క్రీడలకు అనువైన వాతావరణం లేకుండా పోతుందని క్రీడాకారులు వాపోతున్నారు.

ఇదే పరిస్థితి ఎల్.బి. స్టేడియం లోనూ కనిపిస్తోంది. ఒకప్పుడు క్రీడా పోటీలకు ప్రసిద్ధి చెందిన ఈ స్టేడియం ప్రస్తుతం సినిమా షూటింగ్లు, మ్యూజిక్ కాన్సర్ట్‌లు, క్రిస్మస్ వేడుకలు, ఇఫ్తార్ విందులు, రాజకీయ సభలు, కుల సమావేశాలకు వేదికగా మారింది.

ప్రత్యేకంగా మద్యం వినియోగం నియంత్రణ లేకుండా సాగుతుండటంతో స్టేడియాలు ఓపెన్ పబ్‌లుగా మారుతున్నాయనే విమర్శలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితి వల్ల మైదానాలు చెత్తాచెదారంతో నిండిపోతూ, క్రీడాకారుల సాధనకు పెద్ద అడ్డంకిగా మారుతున్నాయి.

క్రీడాభివృద్ధి కోసం నిర్మించిన ఈ వేదికలు వినోద కార్యక్రమాలకు మాత్రమే పరిమితమవుతాయా?  లేక క్రీడాకారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
లోక్ భవన్లో అట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి
ఈరోజు లోక్ భవన్ లో జరిగిన అటు హోమ్ కార్యక్రమంలో పాల్గొన్న రాయచోటి ఎమ్మెల్యే రవాణా శాఖ మంత్రి...
By Benguluri Madhubabu 2026-01-26 14:11:07 0 211
Andhra Pradesh
రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. వారికి రూ.లక్ష.. పూర్తి వివరాలు ఇవే..
ఏపీ ప్రభుత్వం కౌలు రైతులకు అండగా నిలుస్తోంది. వడ్డీ వ్యాపారుల బారి నుండి రక్షించేందుకు అర్హులైన...
By SivaNagendra Annapareddy 2025-12-15 05:28:12 0 214
Andhra Pradesh
ఎంపీ కేసినేని శివనాద్ సారధ్యంలో ఎస్ హెచ్ జి మహిళలకు హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో శిక్షణ అభివృద్ధి కార్యక్రమం
*విజ‌య‌వాడ* *27-01-2026*   *స్క్రోలింగ్ పాయింట్స్*   *ఎంపీ కేశినేని...
By Rajini Kumari 2026-01-27 11:49:44 0 119
Andhra Pradesh
ఇంద్రకీలాద్రిపై వైభవంగా వసంత నవరాత్రులు
ప్రకటన ఇంద్రకీలాద్రిపై వైభవంగా వసంత నవరాత్రులు: కనకాంబరాలు, గులాబీలతో జగన్మాతకు ప్రత్యేక...
By Rajini Kumari 2026-03-20 16:19:51 0 127
Telangana
చెప్పారంటే చేస్తారంతే - మాట నిలబెట్టుకున్న శాంతి శ్రీనివాస్ రెడ్డి .|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ సర్కిల్ పరిధిలోని యాదమ్మ నగర్ ప్రజల చిరకాలవాంఛ నెరవేరింది....
By Sidhu Maroju 2026-02-02 10:44:31 0 116
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com