"తాడ్‌బండ్‌లో భక్తి వెల్లువ… హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా!"

0
185

సికింద్రాబాద్ : తాడ్‌బండ్‌లోని ప్రసిద్ధ హనుమాన్ దేవాలయం హనుమాన్ జయంతి సందర్భంగా ఆధ్యాత్మిక కాంతులతో మెరిసిపోయింది.

దేవాలయ కార్యనిర్వాహణాధికారి నరేందర్ ఆధ్వర్యంలో స్వామివారికి ఉదయం నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు.

తెల్లవారుజామున నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి తాడ్‌బండ్ వీరాంజనేయ స్వామిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. హనుమాన్ చాలీసా పారాయణాలు, ప్రత్యేక పూజలు, అభిషేకాలతో ఆలయం మొత్తం భక్తి పరవశంతో నిండిపోయింది.

ఈ సందర్భంగా పండ్లు, పుష్పాలతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి క్యూలైన్ల ద్వారా దర్శనాన్ని సక్రమంగా నిర్వహిస్తున్నారు.

హనుమాన్ జయంతి సందర్భంగా తాడ్‌బండ్ ప్రాంతమంతా “జై శ్రీరామ్” నినాదాలతో మార్మోగిపోగా, ఆలయ పరిసరాల్లో రామలక్ష్మణుల సమేత హనుమంతుడి ప్రత్యేక అలంకరణ, రంగురంగుల విద్యుత్ దీపాల కాంతులు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వివిధ థీమ్‌లతో ఏర్పాటు చేసిన లైటింగ్ సెట్టింగులు ఆలయ ప్రాంగణానికి మరింత శోభను చేకూర్చాయి.

ఈ పవిత్ర సందర్భంగా మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కుటుంబ సమేతంగా ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

భక్తి, భవ్యం, వైభవం కలగలిపిన తాడ్‌బండ్ హనుమాన్ జయంతి వేడుకలు భక్తులను ఆధ్యాత్మిక లోకానికి తీసుకెళ్లాయి.

#sidhumaroju

Alwal 

 

 

 

#హనుమాన్_జయంతి #తాడ్‌బండ్ #సికింద్రాబాద్ #వీరాంజనేయస్వామి #ప్రత్యేకపూజలు #అభిషేకం #హనుమాన్_చాలీసా #జైశ్రీరామ్ #ఆధ్యాత్మికవాతావరణం #భక్తులరద్దీ #మల్లారెడ్డి #మర్రిరాజశేఖర్‌రెడ్డి #దేవాలయవేడుకలు #తెలంగాణవార్తలు

Search
Categories
Read More
Telangana
మంచిర్యాల రోడ్డు ప్రమాదాల నివారణ పై ప్రత్యేక దృష్టి
మంచిర్యాల రోడ్డు ప్రమాదాల నివారణ పై ప్రత్యేక దృష్టి మంచిర్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు...
By Pinnehasan Odela 2026-04-09 13:52:32 0 142
Telangana
ప్రతి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటా : కుత్బుల్లాపూర్ అభివృద్ధి ప్రదాత, బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్.
 కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే  నివాస కార్యాలయం వద్ద కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి...
By Sidhu Maroju 2025-06-12 12:09:14 0 1K
Telangana
తెలంగాణ : విద్యార్థులకు ప్రభుత్వం వారి శుభవార్త
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న తెలంగాణ క్యాబినెట్ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయం...
By Sunka Santhosh 2026-05-23 18:34:55 0 27
Telangana
₹5000 కోట్లతో మూసీ నది ఒడ్డున భారీ గాంధీ విగ్రహం పెట్టనున్న రేవంత్ ప్రభుత్వం .|
    హైదరాబాద్ :  ప్రజల నుండి , ప్రజా సంఘాల నుండి, పర్యావరణవేత్తల నుండి, రాజకీయ...
By Sidhu Maroju 2026-02-19 18:54:00 0 179
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com