జన్ ఔషధి కేంద్రాల బలోపేతానికి కీలక సూచనలు.. ఎంపీ ఈటెల.|

0
146

హైదరాబాద్ :పార్లమెంట్‌లో రూల్ 377 కింద ఫార్మాస్యూటికల్స్ & మెడికల్ డివైసెస్ బ్యూరో ఆఫ్ ఇండియా (PMBI)లో సీఈఓ పోస్టు నెలలుగా ఖాళీగా ఉండటం పట్ల ఆందోళన వ్యక్తమైంది. వెంటనే శాశ్వత సీఈఓను నియమించాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్  కోరారు.

అలాగే Pradhan Mantri Jan Aushadhi Yojana కేంద్రాల్లో మందుల కొరత లేకుండా ఉండేందుకు PMBIకి స్వంత తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని, లేదంటే ప్రముఖ కంపెనీలతో దీర్ఘకాల సరఫరా ఒప్పందాలు చేయాలని సూచించారు.

జన్ ఔషధి కేంద్రాల నిర్వహకులకు ఇన్సెంటివ్‌లు పెంచడంతో పాటు స్పష్టమైన ట్రాన్స్‌ఫర్/టేకోవర్ పాలసీ తీసుకురావాలని కోరారు. అన్ని కేంద్రాల్లో లైఫ్ సేవింగ్, క్యాన్సర్ మరియు అత్యవసర మందులు తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

దేశంలోని డాక్టర్లు జనరిక్ మందులు రాయడం తప్పనిసరి చేసే చట్టం తీసుకురావాలని, అలాగే కేంద్ర, పీఎస్‌యూ, రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులన్నింటిలో జన్ ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎం.పి డిమాండ్ చేశారు.

దేశవ్యాప్తంగా జన్ ఔషధి కేంద్రాలను 50,000 వరకు విస్తరించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు మరియు సరఫరా వ్యవస్థను బలోపేతం చేయాలని అయన సూచించారు.

#sidhumaroju 

Alwal

Search
Categories
Read More
Telangana
రామగుండం : ఏడేళ్ల చిన్నారిపై హత్యాచార యత్నం..!
అంతర్గం మండలం పరిధి రామగుండం పట్టణంలోని ఓ కాలనీకి చెందిన ఏడేళ్ల చిన్నారిపై 45 వయసు గల ఓ సమీప...
By Sunka Santhosh 2026-04-13 12:28:37 0 168
Andhra Pradesh
పుంగనూరు: ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పోలీస్ స్టేషన్ లో బక్రీద్ పండుగ సందర్భంగా ఆదివారం శాంతి కమిటీ సమావేశం...
By Kothuru Murali 2026-05-24 17:33:19 0 14
Telangana
నిజామాబాద్. కామదహనంలో పలుగొన్న ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనాయన
నగరంలోని ఆర్య వైశ్యసంఘం లో నిర్వహించిన కమధన కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్త...
By Sadaq Sadaq 2026-03-02 15:17:40 0 135
Andhra Pradesh
రఘురామకృష్ణం రాజు కస్టడీయల్ టార్చర్ కేసులో సునీల్ నాయక్ అరెస్ట్
🚨*Big Breaking News * 🚨   *రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం..!*...
By Rajini Kumari 2026-02-23 10:38:32 0 115
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com