జన్ ఔషధి కేంద్రాల బలోపేతానికి కీలక సూచనలు.. ఎంపీ ఈటెల.|

0
185

హైదరాబాద్ :పార్లమెంట్‌లో రూల్ 377 కింద ఫార్మాస్యూటికల్స్ & మెడికల్ డివైసెస్ బ్యూరో ఆఫ్ ఇండియా (PMBI)లో సీఈఓ పోస్టు నెలలుగా ఖాళీగా ఉండటం పట్ల ఆందోళన వ్యక్తమైంది. వెంటనే శాశ్వత సీఈఓను నియమించాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్  కోరారు.

అలాగే Pradhan Mantri Jan Aushadhi Yojana కేంద్రాల్లో మందుల కొరత లేకుండా ఉండేందుకు PMBIకి స్వంత తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని, లేదంటే ప్రముఖ కంపెనీలతో దీర్ఘకాల సరఫరా ఒప్పందాలు చేయాలని సూచించారు.

జన్ ఔషధి కేంద్రాల నిర్వహకులకు ఇన్సెంటివ్‌లు పెంచడంతో పాటు స్పష్టమైన ట్రాన్స్‌ఫర్/టేకోవర్ పాలసీ తీసుకురావాలని కోరారు. అన్ని కేంద్రాల్లో లైఫ్ సేవింగ్, క్యాన్సర్ మరియు అత్యవసర మందులు తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

దేశంలోని డాక్టర్లు జనరిక్ మందులు రాయడం తప్పనిసరి చేసే చట్టం తీసుకురావాలని, అలాగే కేంద్ర, పీఎస్‌యూ, రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులన్నింటిలో జన్ ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎం.పి డిమాండ్ చేశారు.

దేశవ్యాప్తంగా జన్ ఔషధి కేంద్రాలను 50,000 వరకు విస్తరించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు మరియు సరఫరా వ్యవస్థను బలోపేతం చేయాలని అయన సూచించారు.

#sidhumaroju 

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగునూరు: చోరీ కేసులో ముగ్గురి అరెస్ట్ కొత్తూరు మురళి
రూరల్ సిఐ సాయి ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం, జనవరి 2న సోమల మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయం వద్ద...
By Kothuru Murali 2026-04-25 03:06:55 0 102
Maharashtra
Maharashtra Strengthens Environment and Forest Conservation
Maharashtra is reinforcing its commitment to environmental sustainability and forest conservation...
By Fathima Safa 2026-06-30 09:12:00 0 62
Andhra Pradesh
Chandrababu Naidu: ఇది మహాపచారం... గత ప్రభుత్వ పెద్దలు బాధ్యత తీసుకోకపోవడం దుర్మార్గం: కల్తీ నెయ్యిపై సీఎం చంద్రబాబు.
  Chandrababu Naidu: ఇది మహాపచారం... గత ప్రభుత్వ పెద్దలు బాధ్యత తీసుకోకపోవడం దుర్మార్గం:...
By Pagadala Venkateswar 2026-02-24 09:56:31 0 294
Andhra Pradesh
పూర్వ విద్యార్థుల సమ్మేళనం
పెద్దపంజాణి మండలం రాయల్‌పేట జెడ్పిహెచ్‌ఎస్ ప్రభుత్వ పాఠశాలలో 2003-2004 విద్యా...
By Kothuru Murali 2026-05-04 13:18:29 0 106
Andhra Pradesh
పుంగనూరులో ఎంవీఐ సుప్రియ ఆకస్మిక తనిఖీలు: వాహనదారులకు హెచ్చరిక
పుంగనూరు పట్టణంలోని మినీ బైపాస్ రోడ్డులో మంగళవారం ఎంవీఐ సుప్రియ ఆకస్మికంగా వాహనాల తనిఖీలు...
By Kothuru Murali 2026-06-24 16:31:54 0 38
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com