చేనేత సహకార సంఘం YWCS విలీనాన్ని వ్యతిరేకిస్తున్న ఎర్రకోట రాజీవ్ రెడ్డి

0
211

చేనేత సహకార సంఘ (YWCS) విలీనన్ని వ్యతిరేకస్తున్నాము.ఎర్రకోట రాజీవ్ రెడ్డి.

ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘాన్ని ఆప్కోలో విలీనం చేయాలన్న ప్రభుత్వ కుట్రను ఖండిస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ రాజీవ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేనేతల సర్వసభ్య సమావేశం ఎదుట భారీ స్థాయిలో నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి.ఈ సందర్భంగా రాజీవ్ రెడ్డి గారు మాట్లాడుతూ, రాష్ట్రానికి గర్వకారణమైన ఎమ్మిగనూరు చేనేత సంఘాన్ని బలహీనపరచే ఈ నిర్ణయం చేనేత కార్మికుల కడుపుపై కొట్టినట్టేనని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అదేవిధంగా, ఎమ్మిగనూరు చేనేత పితామహుడు పద్మశ్రీ మాచాని సోమప్ప గారు నిర్మించిన ఈ గొప్ప వ్యవస్థను కాపాడటం తమ బాధ్యతగా భావిస్తున్నామని, ఆయన ఆశయ సాధనకు తాము ఎప్పుడూ కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.

చేనేతను కాపాడాలి – విలీనాన్ని రద్దు చేయాలి.

మాచాని సోమప్ప గారి ఆశయాలు నిలబెట్టాలి.

కార్మికుల హక్కులు మా హక్కులు.

ప్రభుత్వ నిర్లక్ష్యం ఇక సహించము.అంటూ నినాదాలతో ప్రాంతం మారుమోగింది.ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోకపోతే, ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి రాష్ట్రవ్యాప్తంగా విస్తరింపజేస్తామని ప్రభుత్వం మీద గట్టిగా హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా, నియోజకవర్గ నాయకులు, జడ్పిటిసిలు,ఎంపీపీలు ఎంపీటీసీలు,సర్పంచులు వార్డు మెంబర్లు, మాజీ కౌన్సిలర్లు, ఎర్రకోట కుటుంబ అభిమానాలు, పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Karnataka
తుంగభద్ర డ్యాం సమస్యలు: నీటి నష్టం, సిల్టేషన్, మరియు పరిష్కారాల ఆలస్యం
సమస్య: తుంగభద్ర డ్యాం క్రెస్ట్ గేట్ దెబ్బతినడంతో భారీగా నీరు వృథా అవుతోంది.సామర్థ్యం తగ్గింపు:...
By Triveni Yarragadda 2025-08-11 06:20:45 0 634
Sports
నిత్యన్యా సిరి అరుదైన గౌరవం గోల్డ్ గోల్డ్ మెడల్ ఛాంపియన్షిప్ ప్రశంసించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్ పట్టణానికి చెందిన విద్యార్థిని నీతన్యసిరి నేత పాల్గొని కటాస్ విభాగంలోగోల్డ్, వేపన్ నన్ చాక్...
By Gangaram Rangagowni 2025-12-24 03:26:22 0 211
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com