చేనేత సహకార సంఘం YWCS విలీనాన్ని వ్యతిరేకిస్తున్న ఎర్రకోట రాజీవ్ రెడ్డి

0
286

చేనేత సహకార సంఘ (YWCS) విలీనన్ని వ్యతిరేకస్తున్నాము.ఎర్రకోట రాజీవ్ రెడ్డి.

ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘాన్ని ఆప్కోలో విలీనం చేయాలన్న ప్రభుత్వ కుట్రను ఖండిస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ రాజీవ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేనేతల సర్వసభ్య సమావేశం ఎదుట భారీ స్థాయిలో నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి.ఈ సందర్భంగా రాజీవ్ రెడ్డి గారు మాట్లాడుతూ, రాష్ట్రానికి గర్వకారణమైన ఎమ్మిగనూరు చేనేత సంఘాన్ని బలహీనపరచే ఈ నిర్ణయం చేనేత కార్మికుల కడుపుపై కొట్టినట్టేనని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అదేవిధంగా, ఎమ్మిగనూరు చేనేత పితామహుడు పద్మశ్రీ మాచాని సోమప్ప గారు నిర్మించిన ఈ గొప్ప వ్యవస్థను కాపాడటం తమ బాధ్యతగా భావిస్తున్నామని, ఆయన ఆశయ సాధనకు తాము ఎప్పుడూ కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.

చేనేతను కాపాడాలి – విలీనాన్ని రద్దు చేయాలి.

మాచాని సోమప్ప గారి ఆశయాలు నిలబెట్టాలి.

కార్మికుల హక్కులు మా హక్కులు.

ప్రభుత్వ నిర్లక్ష్యం ఇక సహించము.అంటూ నినాదాలతో ప్రాంతం మారుమోగింది.ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోకపోతే, ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి రాష్ట్రవ్యాప్తంగా విస్తరింపజేస్తామని ప్రభుత్వం మీద గట్టిగా హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా, నియోజకవర్గ నాయకులు, జడ్పిటిసిలు,ఎంపీపీలు ఎంపీటీసీలు,సర్పంచులు వార్డు మెంబర్లు, మాజీ కౌన్సిలర్లు, ఎర్రకోట కుటుంబ అభిమానాలు, పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
West Bengal
Citizens Voice Grievances at CM's Second Janata Darbar
West Bengal Chief Minister Suvendu Adhikari held his second Janata Darbar today at the state BJP...
By Dunna Jessicaruth 2026-05-25 11:16:30 0 419
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : షేర్ ఆటో బోల్తా పడి ఇద్దరి పరిస్థితి విషమం
శనివారం పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, గడ్డం వారిపల్లి సమీపంలో ఫోన్ మాట్లాడుతూ ఆటో...
By Kothuru Murali 2026-01-31 16:03:17 0 171
Telangana
రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే పద్మారావు
సికింద్రాబాద్/ కంటోన్మెంట్. రాజకీయాలకు అతీతంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని రవాణా...
By Sidhu Maroju 2025-08-02 15:23:28 0 799
Telangana
"నేరానికి ముందే చెక్.. పిస్టల్స్‌తో పట్టుబడ్డారు!
"మైలార్‌దేవ్‌పల్లిలో ప్రత్యేక ఆపరేషన్ విజయవంతం: డీసీపీ వైభవ్ గైక్వాడ్" సికింద్రాబాద్ :...
By Sidhu Maroju 2026-06-25 09:11:50 0 113
Andhra Pradesh
మదనపల్లి: అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి అవసరం: జేసీ.
మదనపల్లి కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది....
By Pagadala Venkateswar 2026-03-31 03:34:26 0 149
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com