కూల్చివేతల సెగ తగలకుండా ఆధ్యాత్మిక కార్డు.. సీఎం.ది మాస్టర్ ప్లానా? లేక ముందస్తు డైవర్షనా?".|

0
158

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు ఇప్పుడు అనేక మలుపులు తిరుగుతోంది.

క్షేత్రస్థాయిలో వస్తున్న తీవ్ర వ్యతిరేకత దృష్ట్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వ్యూహాలను మార్చుకుంటున్నట్లు కనిపిస్తోంది.

వారం రోజుల క్రితం వరకు 'ప్రపంచంలోనే ఎత్తైన గాంధీ విగ్రహం' అన్న నినాదం వినిపించగా, ఇప్పుడు సడన్‌గా 'అతి ఎత్తైన శివలింగం - ఓంకారేశ్వర ఆలయం' తెరపైకి రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ప్రణాళికా లోపమా? లేక డైవర్షన్ ప్లానా?

మూసీ ప్రాజెక్టు ప్రారంభం నుండి ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రణాళిక లేకుండా కంగాళీగా వ్యవహరిస్తోందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.

కూల్చివేతల కలకలం: 2025 ఫిబ్రవరిలో మలక్‌పేట్, మూసారాంబాగ్ ప్రాంతాల్లో నివాస గృహాల కూల్చివేతతో మొదలైన ఈ ప్రస్థానం, బాధితుల ఆందోళనలతో మొదటికే మోసం తెచ్చింది.

గాంధీ విగ్రహంపై దుమారం: ఫిబ్రవరి 2026లో బాపు ఘాట్ వద్ద ₹5000 కోట్లతో గాంధీ సరోవరం కడతామని, ఇందుకు మధు పార్క్ రిడ్జ్ వంటి అపార్ట్‌మెంట్లు ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వడం అగ్నికి ఆజ్యం పోసింది. సామాన్య ప్రజలే కాకుండా, గాంధీ వారసులు సైతం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది.

సడన్ 'ఆధ్యాత్మిక' కార్డు!

లంగర్‌హౌజ్ వద్ద నిరసనలు ఉధృతం కావడంతో, ఆ వివాదాన్ని పక్కదారి పట్టించే (Diversion) ప్లాన్‌లో భాగంగానే ప్రభుత్వం మంచిరేవుల వైపు మళ్ళినట్లు కనిపిస్తోంది. 

రెండు వారాల క్రితం అసెంబ్లీలో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో కనీసం ప్రస్తావన లేని శ్రీ ఓంకారేశ్వర స్వామి దేవాలయ శంకుస్థాపనను ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు.

శివాలయ నిర్మాణం పేరుతో ఆధ్యాత్మిక సెంటిమెంట్‌ను తెరపైకి తెచ్చి, విగ్రహాల చుట్టూ జరుగుతున్న విమర్శల నుండి ప్రజల దృష్టిని మళ్లించడమే రేవంత్ రెడ్డి అసలు ఉద్దేశమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రజల ప్రశ్న: "చిత్తశుద్ధి లేని శివపూజలేల?

"మూసీ నదిని శుద్ధి చేయడం, మురుగు నీరు చేరకుండా అడ్డుకోవడం వంటి మౌలిక పనులను వదిలేసి.. కేవలం విగ్రహాలు, గుడుల చుట్టూ హడావిడి చేయడంపై సామాన్యులు మండిపడుతున్నారు.

"అభివృద్ధి పేరుతో మా ఇళ్లను కూల్చి, విగ్రహాలు కట్టడం ఏ రకమైన న్యాయం?" అని బాధితులు ప్రశ్నిస్తున్నారు.

మొత్తానికి, రేపు (శనివారం) మంచిరేవుల వద్ద జరగబోయే ఈ శంకుస్థాపన మూసీ ప్రాజెక్టుపై ఉన్న వ్యతిరేకతను తగ్గిస్తుందా లేక రేవంత్ రెడ్డి మార్క్ 'డైవర్షన్ పాలిటిక్స్'గా మిగిలిపోతుందో చూడాలి.

 #sidhumaroju ✍️

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
ముగిసిన సి ఆర్ డి ఏ 65వ అధారిటీ సీఎం చంద్రబాబు సమావేశం
అమరావతి...   *సీఎం చంద్రబాబు వద్ద ముగిసిన సీఆర్డీయే 65 వ అధారిటీ సమావేశం*  ...
By Rajini Kumari 2025-12-22 11:26:41 0 208
Telangana
కార్మికుల వేతనం పెంచాలని కార్మికుల నిరసన
రామంతాపూర్ పరిధిలోని కెసిఆర్ నగర్ లో కార్మికుల వేతనం పెంచాలని.. ఇప్పుడు ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం...
By Mahankali Ravi 2026-06-12 06:32:30 0 141
Sports
రగ్బీ (RPL) ముగింపు కార్యక్రమం లో పాల్గొన్న ముఖ్యమంత్రి : రేవంత్ రెడ్డి
హైదరాబాద్‌లో నిర్వహించిన రగ్బీ ప్రీమియర్ లీగ్ (RPL) ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా...
By Avunoori Mahesh 2026-06-29 00:39:47 0 166
Business & Finance
Winding Up a Company Through the Legal Process
Winding up a company is the legal process of closing its operations, settling outstanding debts,...
By Navya Sree 2026-07-20 05:44:48 0 27
Business & Finance
Collateral-Free Loans for Fast Business Financing
Collateral-free loans help businesses and entrepreneurs access funds without pledging assets as...
By Navya Sree 2026-07-23 05:47:20 0 13
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com