విశ్వబ్రాహ్మణ సంఘం చెక్క కార్మికుల దినోత్సవం సందర్భంగా ఆవు దూడ గుర్తు పై ఓటు వేయాలని అభ్యర్థన

0
157

*విశ్వబ్రాహ్మణ సంఘం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న కత్తురోజు రామకృష్ణ*

 

*ఆవుదుడ గుర్తుపై ఓటు వేయాలని విజ్ఞప్తి చేసిన రామకృష్ణ*

 

*జాతీయ కార్పెంటర్స్ డే సందర్భంగా కొండపల్లిలో మజ్జిగ పంపిణీ*

 

దారు(చెక్క పని) శిల్పకళా కళాకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు కత్తురోజు రామకృష్ణ. త్వరలో జరగనున్న విశ్వబ్రాహ్మణ సంఘం ఎన్నికలలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న తనను ఆవు దూడ గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా పోటీ చేస్తున్న పొట్లూరు చిరంజీవి ఆచార్య ను కూడా ఆవుదుడా గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. జాతీయ కార్పెంటర్స్ డే సందర్భంగా కొండపల్లి కిల్లా రోడ్డు బొమ్మల కాలనీలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు రామకృష్ణ. అనంతరం ఆయన మాట్లాడుతూ చెక్క పని చేసే దారుసిల్పులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా కొండపల్లిలో తెల్లపునికి చెట్లు లభించకపోవడం, ఆర్థికంగా అవకాశాలు లేకపోవడంతో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విశ్వబ్రాహ్మణులకు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అవకాశాలు కల్పించేందుకు స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తామని చెప్పారు. పోరాడేందుకు తనకు అందరి సహకారం కావాలని ఏప్రిల్ 12న జరిగే ఎన్నికలలో ఆవుదుడ గుర్తుపై వేసి అఖండ మెజార్టీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
చంద్రబాబుకు వెన్నుపోటు పొడవడం వెన్నతో పెట్టిన విద్య: రోజా
ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని మాజీ మంత్రి రోజా ఆరోపించారు. రాయలసీమ లిఫ్ట్...
By Pagadala Venkateswar 2026-01-06 07:35:25 0 193
Andhra Pradesh
శ్మశాన భూమిని కాపాడాలి !!
కర్నూలు : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ శ్మశాన భూమి కబ్జా – సీఐడీ విచారణ కోరుతూ...
By Hari Krishna 2025-12-24 00:16:32 0 210
Telangana
తెలంగాణ పాలిసెట్ వెబ్ సైట్ లో గందరగోళం
  తెలంగాణ పాలిటిక్ సెట్ వెబ్ సైట్ లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. చెరిగిపోయిన సీట్ల...
By Sidhu Maroju 2025-07-07 15:09:42 0 1K
Andhra Pradesh
రైస్ మిల్లులపై విజిలెన్స్ దాడులు-రేషన్ బియ్యం పట్టివేత.
శుక్రవారం, మదనపల్లె సీటీఎం రోడ్డులోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ రైస్ మిల్లులపై కడప విజిలెన్స్ ఎస్పీ...
By Pagadala Venkateswar 2026-03-06 07:46:57 0 113
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com