బుట్ట ఫౌండేషన్ ఆధ్వర్యంలో తాగునీటి ట్యాంకర్లు నీరు అందించడం.
_బుట్టా ఫౌండేషన్ చొరవతో బి. అగ్రహారం, పరమాన్ దొడ్డి గ్రామాలకు మంచినీటి ట్యాంకర్లు – తాగునీటి సమస్యకు తాత్కాలిక ఉపశమనం_
_ఎమ్మిగనూరు, గోనెగండ్ల మండలాల పరిధిలోని పరమాన్ దొడ్డి, బి. అగ్రహారం గ్రామాలలో తీవ్ర తాగునీటి కొరత నెలకొనడంతో గ్రామ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజువారీ అవసరాలకు కూడా సరిపడా నీరు అందకపోవడంతో పరిస్థితి విషమంగా మారింది._
_ఈ సమస్యను గమనించిన పరమాన్ దొడ్డి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హనుమప్ప గారు, చిరంజీవి గారు బి. అగ్రహారం గ్రామ సర్పంచ్ శ్రీ అగ్రహారం రంగారెడ్డి గారు మరియు నూకల వెంకటేష్ గారు, ఉపేంద్ర గారు, శేఖర్ గారు ,ముని గారితో కలిసి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త మరియు మాజీ ఎంపీ శ్రీమతి బుట్టా రేణుక గారి దృష్టికి తీసుకెళ్లారు. గ్రామ ప్రజల పరిస్థితిని వివరంగా తెలియజేస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు._
_ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన శ్రీమతి బుట్టా రేణుక గారు, సమస్య అత్యవసరతను గుర్తించి, బుట్టా ఫౌండేషన్ అధినేత మరియు పార్టీ సీనియర్ నాయకులు శ్రీ బుట్టా శివనీలకంఠ గారికి సమాచారం అందించారు. ప్రజల సమస్యల పట్ల ఎప్పటికప్పుడు స్పందిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆయన వెంటనే చర్యలు చేపట్టి, బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామాలకు మంచినీటి ట్యాంకర్లను ఏర్పాటు చేయించారు._
_ఈ ట్యాంకర్ల ద్వారా గ్రామ ప్రజలకు తక్షణమే స్వచ్ఛమైన తాగునీరు అందించడంతో, కొంతవరకు నీటి సమస్యకు ఉపశమనం లభించింది. నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఈ సహాయం ఎంతో ఉపయోగకరంగా మారింది._
_ఈ సేవా కార్యక్రమంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ, తమ సమస్యలను అర్థం చేసుకుని వెంటనే స్పందించిన శ్రీమతి బుట్టా రేణుక గారు, అలాగే శ్రీ బుట్టా శివనీలకంఠ గారికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని వారు ఆకాంక్షించారు._
_ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ, ప్రజల అవసరాలను గుర్తించి తక్షణ స్పందనతో సహాయం అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ చర్య గ్రామంలో తాత్కాలికంగా అయినా తాగునీటి సమస్యను తగ్గించడంలో కీలక పాత్ర పోషించిందని తెలిపారు._
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz