రెవెన్యూ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు-2026

0
110

రెవెన్యూ ఉద్యోగులు క్రీడల పోటీల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఎపిఆర్ఎస్ఏ అధ్యక్షులు కె. శ్రీరాములు గురువారం పిలుపునిచ్చారు. ఐకమత్యమే మహాబలం - రెవెన్యూ ఉద్యోగుల ఐక్యత ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసుల సంఘం, శ్రీకాకుళం జిల్లా శాఖ, జిల్లాలోని అందరు రెవెన్యూ ఉద్యోగులకు ఆఫీస్ సబోర్డినేట్ నుండి డెప్యూటీ కలెక్టర్ వరకు,అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు, సర్వే ఉద్యోగులు, గణాంకాధికారులు, గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ రెవెన్యూ సహాయకులు ఈ నెల 27, 28, 29 తేదీలలో మూడు రోజుల పాటు జరిగే శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలులో పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరారు.

 

దాదాపు ఎనిమిది సంవత్సరాల (2018 నుండి ఇప్పటి వరకు) తరువాత, ఈ సంవత్సరం 2026లో ఈ కార్యక్రమం, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్,, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సహాయ సహకారాలతో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రోజువారి విధుల్లో రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సవాళ్లు, ఒత్తిడి నుండి కొంత మేర ఉపశమనం కలిగించేందుకు దోహద పడతాయనే సదుద్దేశంతో ఉద్యోగుల్లో నైతిక స్థైర్యం, ఆత్మస్థైర్యం, మానసిక ఉల్లాసం, ఉద్యోగుల ఐక్యత పెంపొందించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.

 

శుక్రవారం ఉదయం 7 గంటలకు స్థానిక కోడిరామ్మూర్తి స్టేడియం వద్దకు చేరుకోవాలని కోరుతూ, జిల్లా రెవిన్యూ క్రీడాకారుల మార్చ్ ఫాస్ట్ ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని, ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలియజేస్తూ, ఉద్యోగులందరికీ ఈ మూడు దినములలో భోజన సదుపాయాలు కల్పించడం జరిగినదని తెలుపుతూ, ఆఖరి రోజు ఆదివారం సాయంత్రం 4 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయని చెప్పారు. రెవిన్యూ ఉద్యోగులు పెద్ద ఎత్తున హాజరై ఈ రెవెన్యూ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలను పండగలా జరుపుకోవాలని ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ సర్వీసుల సంఘం తెలిపింది.

Search
Categories
Read More
Andhra Pradesh
NTR జిల్లా పల్స్ పోలియో కార్యక్రమంలో డాక్టర్ జి లక్ష్మీశ
*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌* *ఎన్‌టీఆర్ జిల్లా, డిసెంబ‌ర్ 21, 2025*...
By Rajini Kumari 2025-12-21 08:14:55 0 127
Andhra Pradesh
తిరుపతి లడ్డు కల్తీ విషయంలో శిక్ష తప్పదు మంత్రి సవిత హెచ్చరిక
*తిరుపతి లడ్డూ కల్తీలో శిక్ష తప్పదు*   * జగన్ కు మంత్రి సవిత హెచ్చరిక * కల్తీ నెయ్యి...
By Rajini Kumari 2026-02-06 09:40:13 0 89
Andhra Pradesh
సీఎం సహాయ నిధి ద్వారా లబ్ధిదారులకు 56,25929 లక్షల రూపాయల అందించిన యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు గారు
సీఎం సహాయ నిధి ద్వారా లబ్ధిదారులకు 56,25,929 లక్షల రూపాయలు అందించిన యర్రగొండపాలెం నియోజకవర్గ...
By Chennaiah Kati 2026-02-03 02:28:57 0 196
Andhra Pradesh
APSRTC: మహిళలకు ఏపీ ఆర్టీసీ శివరాత్రి కానుక.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జ‌ర్నీ!
    APSRTC: మహిళలకు ఏపీ ఆర్టీసీ శివరాత్రి కానుక.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జ‌ర్నీ!...
By Pagadala Venkateswar 2026-02-10 04:35:19 0 81
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com