Golden Fish: పశ్చిమగోదావరి జాలర్ల వలలో అరుదైన 'గోల్డెన్ ఫిష్'.. ఒకే వేటతో లక్షాధికారులైన మత్స్యకారులు.

0
96

పశ్చిమగోదావరి జిల్లా మత్స్యకారులను అదృష్టం వరించింది. అత్యంత అరుదుగా లభించే 'కచ్చిడి' చేపలు వారి వలకు చిక్కడంతో ఒకే రోజులో లక్షాధికారులయ్యారు. వేటలో భాగంగా దొరికిన రెండు చేపలను కోనసీమ జిల్లా అంతర్వేది మినీ ఫిషింగ్ హార్బర్‌కు తీసుకురాగా, వాటిని దక్కించుకునేందుకు వ్యాపారులు పోటాపోటీగా వేలం పాడారు.

 

వివరాల్లోకి వెళితే... పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లగా వారి వలకు రెండు భారీ కచ్చిడి చేపలు చిక్కాయి. వాటిని వెంటనే అంతర్వేది హార్బర్‌కు తరలించి వేలం వేశారు. ఇందులో 35 కిలోల బరువున్న ఒక చేప రికార్డు స్థాయిలో రూ.1.20 లక్షల ధర పలికింది. అలాగే, 30 కిలోల బరువున్న మరో చేపను వ్యాపారులు రూ.74 వేలకు కొనుగోలు చేశారు. ఈ రెండు చేపలు ఆడవి కావడంతో ఈ ధర వచ్చిందని, అదే మగ చేపలు దొరికితే ఒక్కోటి రూ.4 లక్షల వరకు పలికేదని మత్స్యకారులు తెలిపారు.

 

కచ్చిడికి ఎందుకంత ధర..?

'ప్రొటోనిబియా డయాకాంథస్' అనే శాస్త్రీయ నామం కలిగిన ఈ చేపను 'గోల్డెన్ ఫిష్' అని కూడా పిలుస్తారు. దీనికి అంతర్జాతీయ మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉండటానికి దాని ఔషధ గుణాలే ప్రధాన కారణం. ఈ చేప పొట్టలోని గాల్ బ్లాడర్ (స్థానికంగా 'పొట్ట' అంటారు) నుంచి శస్త్రచికిత్సల అనంతరం గాయాలకు వేసే కుట్ల దారాన్ని తయారు చేస్తారు. ఇది సులభంగా శరీరంలో కలిసిపోతుంది. దీంతో పాటు కొన్ని రకాల మందులు, వైన్ల తయారీలోనూ దీని భాగాలను వినియోగిస్తారు.

 

ఈ చేపలు హిందూ, దక్షిణ పసిఫిక్ మహాసముద్రాల్లో నదులు సముద్రంలో కలిసే ముఖద్వారాల వద్ద ఎక్కువగా జీవిస్తాయి. మే నుంచి అక్టోబర్ మధ్య గుడ్లు పెట్టేందుకు తీరానికి వస్తుంటాయి. ఇక్కడి వ్యాపారులు ఈ చేపలను కొనుగోలు చేసి పశ్చిమ బెంగాల్‌తో పాటు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. విదేశాల్లో మంచి గిరాకీ ఉండటంతోనే వ్యాపారులు ఎంత ధర వెచ్చించైనా కొనేందుకు ఆసక్తి చూపుతారు.

Search
Categories
Read More
Andhra Pradesh
చక్రధర పెరుమాళ్ దేవస్థానానికి మ్యూజిక్ సిస్టమ్ వితరణ
కవిటి మండలం బెజ్జి పుట్టుగ గ్రామంలో గల శ్రీ చక్రధర పెరుమాళ్ల స్వామి వారి దేవస్థానంకు కవిటి...
By Jeeru Kumar 2026-03-01 06:25:52 0 322
Andhra Pradesh
రంజాన్ పర్వదినం సందర్భంగా ఈద్గా ప్రార్థన లో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి కుమారుడు నిశ్చల్ నాగిరెడ్డి
అన్నమయ్య జిల్లా రాయచోటి రంజాన్ పర్వదిన సందర్భంగా ఈద్గా ప్రాంతంలో పాల్గొన్నారు రాష్ట్ర యువజన శాఖ...
By Benguluri Madhubabu 2026-03-21 07:18:16 0 124
Andhra Pradesh
Ycp పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్
శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు  తాడేపల్లి లోని సెంటర్ ysrcp పార్టీ ఆఫీసు దగ్గర ప్రెస్...
By Kola Kirankumar 2026-03-31 18:28:44 0 99
Karnataka
Implementation of On-Street Parking Fees in Bengaluru
The Directorate of Urban Land Transport (DULT) and the Bruhat Bengaluru Mahanagara Palike (BBMP)...
By Venugopal Gopal 2026-01-04 17:20:00 0 465
Telangana
ఉస్తాద్ భగత్ సింగ్’ఉగాది పండగ సందర్భంగా 19న
సినీ ప్రియులంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' ఉగాది పండగ సందర్భంగా...
By Ponnala Srinivasrao 2026-03-16 10:47:22 0 189
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com