Golden Fish: పశ్చిమగోదావరి జాలర్ల వలలో అరుదైన 'గోల్డెన్ ఫిష్'.. ఒకే వేటతో లక్షాధికారులైన మత్స్యకారులు.

0
161

పశ్చిమగోదావరి జిల్లా మత్స్యకారులను అదృష్టం వరించింది. అత్యంత అరుదుగా లభించే 'కచ్చిడి' చేపలు వారి వలకు చిక్కడంతో ఒకే రోజులో లక్షాధికారులయ్యారు. వేటలో భాగంగా దొరికిన రెండు చేపలను కోనసీమ జిల్లా అంతర్వేది మినీ ఫిషింగ్ హార్బర్‌కు తీసుకురాగా, వాటిని దక్కించుకునేందుకు వ్యాపారులు పోటాపోటీగా వేలం పాడారు.

 

వివరాల్లోకి వెళితే... పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లగా వారి వలకు రెండు భారీ కచ్చిడి చేపలు చిక్కాయి. వాటిని వెంటనే అంతర్వేది హార్బర్‌కు తరలించి వేలం వేశారు. ఇందులో 35 కిలోల బరువున్న ఒక చేప రికార్డు స్థాయిలో రూ.1.20 లక్షల ధర పలికింది. అలాగే, 30 కిలోల బరువున్న మరో చేపను వ్యాపారులు రూ.74 వేలకు కొనుగోలు చేశారు. ఈ రెండు చేపలు ఆడవి కావడంతో ఈ ధర వచ్చిందని, అదే మగ చేపలు దొరికితే ఒక్కోటి రూ.4 లక్షల వరకు పలికేదని మత్స్యకారులు తెలిపారు.

 

కచ్చిడికి ఎందుకంత ధర..?

'ప్రొటోనిబియా డయాకాంథస్' అనే శాస్త్రీయ నామం కలిగిన ఈ చేపను 'గోల్డెన్ ఫిష్' అని కూడా పిలుస్తారు. దీనికి అంతర్జాతీయ మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉండటానికి దాని ఔషధ గుణాలే ప్రధాన కారణం. ఈ చేప పొట్టలోని గాల్ బ్లాడర్ (స్థానికంగా 'పొట్ట' అంటారు) నుంచి శస్త్రచికిత్సల అనంతరం గాయాలకు వేసే కుట్ల దారాన్ని తయారు చేస్తారు. ఇది సులభంగా శరీరంలో కలిసిపోతుంది. దీంతో పాటు కొన్ని రకాల మందులు, వైన్ల తయారీలోనూ దీని భాగాలను వినియోగిస్తారు.

 

ఈ చేపలు హిందూ, దక్షిణ పసిఫిక్ మహాసముద్రాల్లో నదులు సముద్రంలో కలిసే ముఖద్వారాల వద్ద ఎక్కువగా జీవిస్తాయి. మే నుంచి అక్టోబర్ మధ్య గుడ్లు పెట్టేందుకు తీరానికి వస్తుంటాయి. ఇక్కడి వ్యాపారులు ఈ చేపలను కొనుగోలు చేసి పశ్చిమ బెంగాల్‌తో పాటు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. విదేశాల్లో మంచి గిరాకీ ఉండటంతోనే వ్యాపారులు ఎంత ధర వెచ్చించైనా కొనేందుకు ఆసక్తి చూపుతారు.

Search
Categories
Read More
Bharat Aawaz
Our Mission: From Silence to Strength. .
In a world of noise, the stories that matter most often go unheard. They are lost in remote...
By Bharat Aawaz 2025-07-08 18:42:24 0 1K
Andhra Pradesh
స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు బడ్జెట్ 2026-27 పటిష్ట పునాది.
అన్నమయ్య జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన బడ్జెట్ 2026-27 అవగాహన కార్యక్రమంలో మంత్రి బి....
By Pagadala Venkateswar 2026-03-31 03:25:14 0 111
Andhra Pradesh
పోలవరం నిర్వాసిత గిరిజనేతరులు ఆప్షన్ ఫారంలు త్వరగా ఇవ్వాలి!
పోలవరం ప్రాజెక్టు గిరిజనేతర నిర్వాసితుల పునరావాస ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. పునరావాసం కోసం...
By Shyamala Yadagiri 2026-05-14 16:38:37 0 75
Andhra Pradesh
ఉరవకొండ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం
క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి "ఇన్చార్జ్ గౌతమ్ కుమార్"    (భారత్...
By BOYA MADHU 2026-01-23 11:27:46 0 372
Telangana
భైరవునిపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలో లక్ష్మణరావు విజయం...
భైరవునిపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలో టీడీపీ, సీపీఐ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్ధి గుండపనేని...
By Krishna Balina 2025-12-14 14:16:17 0 259
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com