గంగ అవెన్యూ వాసుల గోస.. రంగంలోకి దిగిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి!

0
177

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : గంగ అవెన్యూ మరియు దాని చుట్టుపక్కల కాలనీల నివాసితుల విజ్ఞప్తి మేరకు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బుధవారం ప్రభుత్వ అధికారులతో కలిసి ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. 

గంగ అవెన్యూ, ఎంఈఎస్ కాలనీ, కాశీపురం, శ్రీనివాసిక కాలనీల్లో నెలకొన్న నీటి నిల్వ మరియు డ్రైనేజీ సమస్యలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా స్థానిక కాలనీ సంక్షేమ సంఘాల (RWA) ప్రతినిధులు తమ బాధలను మైనంపల్లి దృష్టికి తీసుకెళ్లారు.

కాలనీల్లో సరైన వర్షపు నీటి కాలువలు (Storm Water Drains), బాక్స్ డ్రైన్లు లేకపోవడం వల్ల వర్షం పడితే లోతట్టు ప్రాంతాలు, ముఖ్యంగా గంగ అవెన్యూలోని క్వారీ గుంతలు జలమయమవుతున్నాయని వివరించారు. పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ పైప్‌లైన్ పనులను వెంటనే పూర్తి చేయాలని వారు కోరారు.

సమస్య తీవ్రతను గమనించిన మైనంపల్లి హనుమంతరావు అక్కడి నుండే ఎంఎంసీ కమిషనర్ విజయ కృష్ణారెడ్డి (IAS), మల్కాజిగిరి జడ్సీ సంచిత్ గంగ్వార్ (IAS)లతో ఫోన్లో మాట్లాడారు. 

పెండింగ్ పనులకు సంబంధించి తక్షణమే అనుమతులు మంజూరు చేసి, సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

ఈ పర్యటనలో వాటర్ బోర్డ్ జీఎం సునీల్, డిసి భోగేశ్వర్లు, జీహెచ్‌ఎంసీ ఈఈ వెంకటేశ్వర్లు, ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి, డీఈ ప్రశాంత్, డీజీఎం సాంబయ్య తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

కాలనీ ప్రతినిధులు జోసెఫ్ రెడ్డి, రెహ్మాన్,  అంజనేయులు, మరియు కాంగ్రెస్ నేతలు సురేందర్ రెడ్డి, శ్రీశైలం యాదవ్, లడ్డు రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.

#sidhumaroju

Alwal

Like
1
Search
Categories
Read More
Telangana
కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు కూతలు
కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వకున్నా ‎కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి వరి ధాన్యం...
By Ponnala Srinivasrao 2026-04-02 16:12:05 0 173
Andhra Pradesh
మదనపల్లి మున్సిపల్‌ సమావేశంలో YCP కౌన్సిలర్ల నిరసన.
మదనపల్లి మున్సిపల్ కౌన్సిల్ హాలులో గురువారం జరిగిన సమావేశంలో వైసీపీ కౌన్సిలర్లు ఛైర్మన్ పోడియం...
By Pagadala Venkateswar 2026-01-23 07:30:08 0 141
Andhra Pradesh
ఇజ్రాయిల్ మరియు అమెరికా స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్
ఇజ్రాయిల్ మరియు అమెరికా స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులు...
By Thokala Sivaji 2026-03-23 15:43:34 0 656
Andhra Pradesh
జోరుగా హుషారుగా మంగళగిరి ప్రీమియర్ లీగ్ 4 పోటీలు
*జోరుగా.. హుషారుగా మంగళగిరి ప్రీమియర్ లీగ్ -4 పోటీలు*   *3వ రోజు 10 జట్ల మధ్య 5...
By Rajini Kumari 2025-12-24 08:08:18 0 162
Telangana
"శ్రీగణేష్ ప్రారంభించిన ఇందిరా మహిళా శక్తి క్యాంటిన్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మహిళల ఆర్థిక స్వావలంబనకు మరో ముందడుగు పడింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే...
By Sidhu Maroju 2026-05-05 11:13:23 0 133
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com