మల్కాజిగిరి ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.|

0
177

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలకు మరియు రాష్ట్ర ప్రజలందరికీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి 'పరాభవ' నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. 

ఈ పండగ ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 

ప్రకృతితో ముడిపడి ఉన్న ఉగాది పర్వదినం, సబ్బండ వర్ణాల శ్రామిక, సాంస్కృతిక జీవనంలో ఎంతో ప్రత్యేకమైనదన్నారు. ప్రకృతి మాత నూతనోత్సాహాన్ని సంతరించుకున్నట్లే, ప్రజలందరి జీవితాల్లో కూడా కొత్త ఉత్సాహం వెల్లివిరియాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

జీవితంలోని కష్టసుఖాలను ఉగాది పచ్చడిలోని షడ్రుచుల వలె సమానంగా స్వీకరిస్తూ, వివేచనతో ముందుకు సాగినప్పుడే పరిపూర్ణమైన జీవితం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. 

ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆకాంక్షించారు.

#sidhumaroju

Alwal

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
తిరుమలలో పెద్దిరెడ్డి ఫ్యామిలీ
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,...
By Kothuru Murali 2025-12-30 12:44:14 0 154
Andhra Pradesh
ముగతి గ్రామంలో బడి పిలుస్తుంది కార్యక్రమం
నందవరం మండల కేంద్రం ముగతి గ్రామంలో జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్ ఆధ్వర్యంలో బడి పిలుస్తుంది కార్యక్రమం...
By Boya Dasthagiri 2026-04-22 11:05:29 0 134
Andhra Pradesh
అబ్బా.. రెండు కళ్ళు చాలవు.. ఆంధ్రా ఊటీ అరకు అందాలు!!!!!!!!!!!
శీతాకాలం వచ్చిందంటే చాలు.. ఆంధ్ర ఊటి అరకు అందాలు పర్యాటకుల మనసు దోచేస్తాయి. మంచు దుప్పటి...
By SivaNagendra Annapareddy 2025-12-21 14:28:35 0 185
Andhra Pradesh
చీరాలలో భారీ మెగా జాబ్ మేళా * 1,400 ఉద్యోగ ఖాళీలతో నిరుద్యోగులకు సువర్ణావకాశం * పోస్టర్ లాంచ్ చేసిన ఎమ్మెల్యే మాలకొండయ్య
రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర...
By Vadlamudi NagaVenkat 2026-03-12 14:21:10 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com