పండుగల పూట పాకెట్ ఖాళీ… ఆర్టీసీకి ప్రయాణికులే బలి?

0
190

హైదరాబాద్ : తెలంగాణలో రాబోయే ఉగాది, రంజాన్ పండుగల నేపథ్యంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. అయితే, ఈ ప్రత్యేక బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులపై 50 శాతం వరకు అదనపు ఛార్జీలు విధించాలని తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది.

ఈ నెల 19న ఉగాది, 21న రంజాన్ పండుగలు ఉండటంతో, 17, 18 తేదీల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు తమ స్వగ్రామాలకు వెళ్లే అవకాశం ఉంది. అలాగే పండుగలు ముగిసిన తర్వాత 23న తిరుగు ప్రయాణాలు ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో, ఆ రోజుల్లో కూడా ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ యోచిస్తోంది.

ఈ క్రమంలో, రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తూ, వాటిపై సాధారణ ఛార్జీలకు అదనంగా 50 శాతం వరకు పెంచిన చార్జీలు వసూలు చేయనున్నట్లు సమాచారం.

అయితే, పండుగల సమయంలోనే అదనపు భారం మోపడం సరైంది కాదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ధరల భారంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలపై ఈ నిర్ణయం మరింత ఒత్తిడి తెస్తుందని అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు, పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని సేవలను విస్తరించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి.

#Sidhumaroju

Alwal 

 

 

Like
1
Search
Categories
Read More
SURAKSHA
Praveen Prakash IAS: Driving Excellence in Public Governance
A distinguished 1994-batch Andhra Pradesh cadre IAS officer, Shri Praveen Prakash has played a...
By Lokeshwari Panthadi 2026-07-16 11:34:23 0 45
Andhra Pradesh
పుంగునూరు:సదుం ఎస్సై గా విష్ణు నారాయణ.
పుంగనూరు నియోజకవర్గంలోని సదుం పోలీస్ స్టేషన్ లో బుధవారం నూతన ఎస్సై విష్ణు నారాయణ తన పదవీ బాధ్యతలు...
By Kothuru Murali 2026-01-15 05:52:28 0 195
Telangana
పెద్దపల్లి : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలపై చాటేసిన వర్షాలు...!
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు మొహం చాటేశాయి. గత వారంలో వర్షాలు కురిసిన అవి అంతంత...
By Sunka Santhosh 2026-07-07 17:19:26 0 103
Andhra Pradesh
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సృజనా చౌదరి గారు ఆంధ్రప్రదేశ్ నగరాల సంక్షేమ అభివృద్ధి చైర్మన్ లేటు మరుపిల్ల తిరుమలేష్ గారి కుటుంబం పరామర్శ
ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎలమంచిలి సృజనా చౌదరి గారు ఆంధ్రప్రదేశ్ నగరాల సంక్షేమ...
By Rajini Kumari 2025-12-16 12:14:25 0 214
Andhra Pradesh
శివనామ స్మరణలతో మారుమ్రోగిన మల్లయ్య కొండ.
మదనపల్లి మండలంలోని వేంపల్లి మల్లయ్యకొండలో మహాశివరాత్రి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి....
By Pagadala Venkateswar 2026-02-16 04:49:32 0 161
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com