కేంద్ర సాహిత్య అకాడమీఅవార్డు -2025' ప్రముఖ తెలంగాణ కవి, రచయిత,నందిని సిధారెడ్డి గారిని అభినందిస్తూకేసీఆర్ గారు శుభాకాంక్షలు తెలిపారు.

0
253

కేంద్ర ప్రభుత్వం ప్రతి యేటా అందించే, అత్యున్నత సాహిత్య పురస్కారం 'కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు -2025' ప్రముఖ తెలంగాణ కవి, రచయిత, నందిని సిధారెడ్డి గారికి దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేసిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు.  

‎ఈ సందర్బంగా నందిని సిధారెడ్డి గారిని అభినందిస్తూ కేసీఆర్ గారు శుభాకాంక్షలు తెలిపారు. 

‎కరోనా సందర్భంగా ప్రపంచం ఎదుర్కున్న సంక్షోభాన్ని, ముఖ్యంగా మానవ సంబంధాల విచ్చిన్నతలను కవిత్వం ద్వారా హృద్యంగా చిత్రీకరించిన, దీర్ఘ కవితా సంపుటి 'అనిమేష'కు ఈ అవార్డు రావడం గొప్ప విషయం అని అన్నారు.

‎తెలంగాణ మట్టివాసన తెలిసిన కవిగా, తన సాహిత్యం ద్వారా తెలంగాణ జీవితాన్ని అక్షరబద్ధం చేసిన, తెలంగాణ గర్వించదగ్గ కవి నందిని సిధారెడ్డి అని అన్నారు.

‎మెదక్ జిల్లా కేంద్రంగా మంజీరా రచయితల సంఘం ఏర్పాటుచేసి, అన్ని వర్గాల ప్రజా సమస్యలు, సామాజిక సమానత్వం కోసం రచనలు చేస్తూ తమ కలాన్ని గళాన్ని విప్పారని తెలిపారు.

‎తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో తన పాట సాహిత్యం ద్వారా ప్రజలను ఆలోచింపజేస్తూ ఉద్యమ కవిగా తెలంగాణ ప్రజల అభిమానాన్ని సిధారెడ్డి చూరగొన్నారని తెలిపారు.

Search
Categories
Read More
Business & Finance
West Bengal Intensifies Efforts to Attract Fresh Investments
West Bengal Intensifies Efforts to Attract Fresh Investments West Bengal has stepped up its...
By Navya Sree 2026-07-04 06:34:53 0 27
Andhra Pradesh
మదనపల్లెలో ఘర్షణ.. 15 మందిపై కేసు నమోదు.
మదనపల్లె మండలంలోని కోళ్లబైలు గ్రామం జగనన్న కాలనీలో ఆదివారం రాత్రి జరిగిన ఘర్షణపై ఇరువర్గాలకు...
By Pagadala Venkateswar 2026-03-24 03:28:09 0 177
Andhra Pradesh
మరో బి ఆర్ టి ఎస్ ఉద్యమం తప్పదు యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జాబీర్
రాయచోటి ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్యం వహించి రాజ్యాంగబద్ధంగా అమలు చేయాల్సిన పన్నెండవ పిఆర్సి...
By Benguluri Madhubabu 2026-03-24 11:49:05 0 210
Andhra Pradesh
Vizag international fleet 2026
విశాఖ తీరంలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో, నేవీ సిబ్బంది గౌరవ వందనం స్వీకరించిన...
By G k Nookala 2026-02-18 10:01:24 0 283
Telangana
చట్టాలపై అవగాహన పెంచుకోవాలి :జిల్లా రెవెన్యు అదనపు కలెక్టర్ కె.అనిల్ కుమార్
మహబూబాబాద్, డిసెంబర్.24(భారత్ అవాజ్): వినియోగ దారులు తమ హక్కులు, బాధ్యతలపై అవగాహన పెంచుకోవాలని...
By Bheeshman King 2025-12-24 10:45:29 0 321
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com