అల్వాల్‌లో ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రోటోకాల్ వివాదం.. ఎంఆర్ఓకు కాంగ్రెస్ నేత ఫిర్యాదు. |

0
121

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండలంలో జరుగుతున్న ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించడంలేదని “ఎ బ్లాక్ కాంగ్రెస్ కమిటీ – అల్వాల్ సర్కిల్” అధ్యక్షుడు నిమ్మా అశోక్ రెడ్డి మండల రెవెన్యూ అధికారి (ఎంఆర్ఓ)కు ఫిర్యాదు చేశారు.

ఇటీవల అల్వాల్ మండల పరిధిలో నిర్వహించిన కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. 

ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు సంబంధించినవిగా ఉండటంతో అన్ని పార్టీల ప్రజాప్రతినిధులకు ముందస్తుగా సమాచారం ఇవ్వడం, ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానించడం అవసరమని లేఖలో తెలిపారు.

కొన్ని సందర్భాల్లో ఇతర పార్టీల నాయకులను మాత్రమే ఆహ్వానించి కార్యక్రమాలు నిర్వహించడం సరైన విధానం కాదని, ఇది ప్రజాస్వామ్య పరంగా కూడా తగదని అశోక్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 

ఇకపై అల్వాల్ మండలంలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్‌ను కచ్చితంగా పాటించి, స్థానిక ప్రజాప్రతినిధులకు ముందస్తుగా సమాచారం ఇవ్వాలని ఆయన ఎంఆర్ఓను కోరారు.

ఈ విషయంపై తగిన చర్యలు తీసుకుని ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. 

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు ఎస్సైగా ఆన్సర్ భాష సోమవారం బాధ్యతలు స్వీకరించారు.
పుంగనూరు ఎస్సైగా ఆన్సర్ భాష సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అన్నమయ్య జిల్లా డిఎస్బి వన్ నుంచి...
By Kothuru Murali 2026-01-12 08:27:14 0 102
Telangana
ఆల్వాల్ పోలీస్, వైద్యశాఖ, సంయుక్త దాడులు : నకిలీ డాక్టర్ ల అరెస్ట్.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ, ఎటువంటి వైద్య...
By Sidhu Maroju 2026-02-06 16:54:26 0 131
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com