అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కొండయ్య*

0
518

తెలుగు ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు, ప్రత్యేక రాష్ట్రం కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా, చీరాల పట్టణం నందు కామధేను కాంప్లెక్స్ దగ్గర ఆయన విగ్రహానికి శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగు ప్రజలందరికీ ప్రత్యేక రాష్ట్రం ఉండాలనే ఏకైక ధృఢ నిశ్చయంతో పొట్టి శ్రీరాములు సుదీర్ఘ పోరాటం చేశారని కొనియాడారు. "పొట్టి శ్రీరాములు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా చేసిన త్యాగం మనందరిలో దేశభక్తిని, నిస్వార్థ సేవను నింపాలని,ఆయన కేవలం ఆంధ్ర రాష్ట్రం కోసం మాత్రమే పోరాడలేదని,దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు తన ఆత్మార్పణతోనే నాంది పలికారన్నారు. భారతదేశ చరిత్రలోనే ఒక భాషా సమూహం కోసం ప్రాణత్యాగం చేసిన మొట్టమొదటి వ్యక్తిని శ్రీరాములు దీక్ష మరియు త్యాగ ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి, తెలుగు మాట్లాడే ప్రజల కోసం మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చిందని గుర్తు చేశారు. ఈ చారిత్రక ఘట్టం దేశంలోని ఇతర భాషా సమూహాలకూ స్ఫూర్తినిచ్చి, భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్విభజనకు దారి తీసిందని ఆయన పేర్కొన్నారు. తెలుగు భాష, సంస్కృతి, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడటానికి వారి ఆశయాలకు అనుగుణంగా,మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు.

Search
Categories
Read More
Andhra Pradesh
తిరుమల లడ్డుపై అసత్య ప్రచారాలకు వ్యతిరేకంగా కొత్తపేట పోలీస్ స్టేషన్‌లో YSRCP ఫిర్యాదు.
గుంటూరు: పవిత్రమైన తిరుమల లడ్డు ప్రసాదంపై అసత్య ఆరోపణలు చేస్తూ, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా...
By John Baji 2026-02-03 01:32:28 0 205
Telangana
ములుగు వరుస తవ్వకాల్లో పురాతన ఆలయ ఆనవాళ్లు భూగర్భం నుంచి ఆకస్మాత్తుగా వచ్చిన నాగుపాములు......
ములుగు వర్సిటీ తవ్వకాల్లో పురాతన ఆలయ ఆనవాళ్లు... భూగర్భం నుంచి అకస్మాత్తుగా వచ్చిన నాగుపాములు......
By Gujile Ramu 2026-05-15 08:34:06 0 51
Andhra Pradesh
Pawan Kalyan: అమరావతిలో తొలిసారి నిర్వహించిన గణతంత్ర వేడుకలు అద్భుతం: పవన్ కల్యాణ్.
ఈ వేడుకలు రాష్ట్ర భవిష్యత్ లక్ష్యాలకు అద్దం పట్టాయన్న పవన్ సీఎం చంద్రబాబు నేతృత్వంలో అమరావతి...
By Pagadala Venkateswar 2026-01-26 11:16:46 0 136
Andhra Pradesh
మదనపల్లె పోలీసులు అన్యాయంగా కొట్టారు – వెంకటరమణ ఆరోపణ.
మదనపల్లె–2 టౌన్ పోలీసులు తనను విచక్షణారహితంగా కొట్టారని కలకడ మండలం గొల్లపల్లికి చెందిన...
By Pagadala Venkateswar 2026-02-08 11:00:12 0 135
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com