షాలోమ్ చర్చి సేవలు అభినందనీయం - అనిల్ కిషోర్ గౌడ్.|

0
168

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : భూదేవినగర్: స్థానిక షాలోమ్ హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చి ఆధ్వర్యంలో ఆనంద్ పర్యవేక్షణలో భారీ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సుమారు 200 మందికి పైగా స్థానికులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిఆర్ఎస్ (BRS) నాయకులు అనిల్ కిషోర్ గౌడ్ హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ వహించి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని కొనియాడారు.

శిబిరంలో డాక్టర్ మైఖేల్, డాక్టర్ సుప్రియ, డాక్టర్ రూహీ, ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాకేష్ శేఖర్ గౌడ్, డైటీషియన్ ఎం. షిర్లీ లిలియన్ తదితర వైద్య బృందం రోగులను పరీక్షించి తగు సూచనలు చేశారు. 

ఈ కార్యక్రమంలో విజయ్ శేఖర్, వెంకటేష్ మరియు ఇతర ముఖ్యులు పాల్గొని శిబిరాన్ని విజయవంతం చేశారు.

#sidhumaroju 

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తో ముఖ్యమంత్రి భేటీ
*ఢిల్లీ*   *కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...
By Rajini Kumari 2026-02-10 10:33:07 0 293
Telangana
"అతి శబ్దం చేస్తే అంతే సంగతులు: ఒక్క రోజే 182 కేసులు, రూ. 2.44 లక్షల జరిమానా.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : నగర రోడ్లపై అతి శబ్దంతో ప్రయాణిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న...
By Sidhu Maroju 2026-04-20 16:52:40 0 277
Telangana
SI's charity for children who lost their mother!
MAHABUBABAD/KOTHAGUDA::Manemma, a resident of Kothaguda Mandal Center, recently passed away due...
By Bheeshman King 2026-07-03 07:55:18 0 269
Business & Finance
Arunachal Boosts Tourism Infrastructure Development
Arunachal Pradesh is strengthening its tourism infrastructure through investments in improved...
By Navya Sree 2026-07-02 13:07:08 0 115
Ladakh
Breakthrough in Ladakh Democratic Talks
A significant development unfolded as the Centre and Ladakh representatives reached an...
By Dunna Jessicaruth 2026-05-25 05:49:14 0 67
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com