సీతారామస్వామి కోవెలలో మహాకుంభాభిషేక మహోత్సవాలు

0
151

*శ్రీ సీతారామ కోవెలలో మహా కుంభాభిషేక మహోత్సవాలు...*

  ***************************

పాత మంగళగిరి శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానం (సీతారామ కోవెల) లో ఈనెల 12వ తేదీ నుండి 14 వరకు జరుగుతున్న శ్రీ సీతారామస్వామి వారి ద్వితీయ పుష్కరోత్సవ ప్రయుక్త మహాకుంభాభిషేక మహోత్సవాలలో భాగంగా శనివారం శ్రీరామచంద్రుని కళ్యాణోత్సవ మండపం, నిర్మాణం పూర్తి చేసుకున్న వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా పాతఃకాల ఆరాధన, చతుద్వార పూజ, చతుర్థానార్చన, విశేష మంత్ర హోమాదులు, మహా పూర్ణాహుతి, సంప్రోక్షణ ప్రయుక్త మహా కుంభాభిషేకం, మహా నివేదన, వేద ఆశీర్వచన, ఆచార్య రుత్విక్ సన్మానం, తీర్థ ప్రసాద గోష్టి, శ్రీ సీతారాముల శాంతి కళ్యాణ మహోత్సవం జరిగింది. దాతలు సూర్య దేవర సుధీర్, శ్రీమతి సుధశ్రీ దంపతులు పూజలలో పాల్గొన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త వీఆర్ శ్రీనివాస్ హాజరై స్వామివారిని దర్శించుకుని పూజలు జరిపారు. ఆలయ అర్చక స్వామి నంబూరి సీతారామానుజాచార్యులు, అర్చక బృందం కళ్యాణం, పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి జేవీ నారాయణ పర్యవేక్షించారు. 

*- బాపనపల్లి శ్రీనివాస్, జర్నలిస్ట్.*

Search
Categories
Read More
Kerala
Kerala HC Demands Government Revive Dog-Bite Compensation Panel
The Kerala High Court has directed the state government to decide on reactivating the Siri Jagan...
By Bharat Aawaz 2025-07-17 06:57:37 0 2K
Telangana
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు
    ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీ.    శాసనసభ, శాసన మండలిలో...
By Ellandula Sandeep 2025-12-29 04:32:03 0 427
Telangana
శ్రీ దర్పన్ స్కూల్ దశాబ్ది వేడుకలు: ముఖ్య అతిథిగా శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ డివిజన్ వేణుగోపాల్ నగర్‌లోని శ్రీ దర్పన్ స్కూల్ 10వ...
By Sidhu Maroju 2026-03-14 18:24:45 0 126
Andhra Pradesh
ఏపీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం.. దేశంలోనే తొలిసారి.. ఆ రంగానికి ప్రత్యేక బడ్జెట్.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి ఏటా నీటి బడ్జెట్ ప్రవేశపెట్టాలని...
By John Baji 2026-01-11 06:23:27 0 164
Andhra Pradesh
YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల.
ఐదేళ్లు నిద్రపోయి ఇప్పుడు వైసీపీ ఉద్యమాలు చేయడమేంటని షర్మిల ప్రశ్న   సంగమేశ్వరం బదులు...
By Pagadala Venkateswar 2026-02-07 09:45:16 0 133
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com