చీరాలలో స్టాక్ మార్కెట్ పేరిట భారీ మోసం

0
728

స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్న సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి, ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భారీగా నగదు కోల్పోయిన ఘటన చీరాలలో వెలుగుచూసింది. ఈ విషయమై చీరాల I టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ వివరాలను వెల్లడించారు. చెన్నైలోని బ్యాంకింగ్ రంగానికి చెందిన ఒక ప్రముఖ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న అనుమకొండ గోపి అనే వ్యక్తి ఈ మోసానికి గురయ్యారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన స్టాక్ మార్కెట్ అడ్వైజరీ ప్రకటనలకు ఆకర్షితుడైన గోపి, అనంతరం వారి వాట్సాప్ గ్రూపులో చేరారు.

నేరగాళ్లు 'క్యాప్‌స్టోన్' అనే మొబైల్ యాప్‌ ద్వారా తక్కువ సమయంలోనే అధిక లాభాలు వస్తాయని అతడిని నమ్మించారు. తొలుత కొన్ని ఐపీఓల లో పెట్టుబడి పెట్టించి, లాభాలు వస్తున్నట్లు నకిలీ గణాంకాలను చూపించారు. దీంతో వారిని పూర్తిగా నమ్మిన గోపి, తన క్రెడిట్ కార్డులు మరియు వివిధ బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని సుమారు రూ.24,16,000 వరకు పెట్టుబడి పెట్టారు. అయితే, తన నగదును విత్‌డ్రా చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు, మరిన్ని ఛార్జీల పేరిట నేరగాళ్లు ఇంకా నగదు డిమాండ్ చేయడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. ఈ సందర్భంగా సీఐ ప్రజలకు పలు సూచనలు చేశారు. అపరిచిత లింకులు సోషల్ మీడియాలో వచ్చే స్టాక్ మార్కెట్ పెట్టుబడులు, పార్ట్-టైమ్ జాబ్ ఆఫర్ల లింకులను క్లిక్ చేయవద్దని సీఐ సుబ్బారావు తెలిపారు.డిజిటల్ అరెస్ట్ గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి సిబిఐ, ఎసిబి లేదా ముంబై పోలీసులమని చెప్పి 'డిజిటల్ అరెస్ట్' చేస్తున్నామని బెదిరిస్తే భయపడవద్దని అలా వచ్చిన వెంటనే సమాచారం అందించాలని సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయండి లేదా సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి అని తెలిపారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించి, వాట్సాప్ ఇన్‌స్టాగ్రామ్ సంస్థలకు లేఖలు రాసినట్లు తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని అమరావతి
ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని గా రాజ్యసభలో  బిల్లు ఆమోదం పొందిన సందర్భం గా #తాడిపత్రి...
By Gitta Raju 2026-04-03 01:35:04 0 62
Telangana
NZB: ఎసి బాలూర కళాశాల హాస్టల్ (బి)వార్డెన్ సస్పెండ్
నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని నమ్దేవాడ అ ఏసి కళాశాల  బలూరా హాస్పిటల్ (బీ) వార్డెన్ యo...
By Sadaq Sadaq 2026-02-09 10:13:43 0 119
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్: గిరిజన గ్రామాలకు రోడ్లు – 'అడవి తల్లి బాట' పథకం ప్రారంభం
సరికొత్త పథకం: ఆంధ్రప్రదేశ్లోని మారుమూల గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు 'అడవి తల్లి...
By Triveni Yarragadda 2025-08-11 13:48:40 0 1K
Andhra Pradesh
ముగతి గ్రామంలో వరుసగా ముగ్గురు అన్నదమ్ములు మృతి చెందడం చాలా బాధాకరం.
ముగ్గురు అన్నదమ్ముల వరుస మరణాలు… ముగతి గ్రామం శోకసంద్రం నందవరం మండలం ముగతి గ్రామంలో ఒకే...
By Boya Dasthagiri 2026-03-29 13:42:42 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com