విజ్ఞాన భారతి పాఠశాలలో ఘనంగా ‘జాతీయ సైన్స్ డే’ వేడుకలు

0
657

చీరాలలోని విజ్ఞాన భారతి హైస్కూల్‌లో శుక్రవారం జాతీయ సైన్స్ డే వేడుకలను పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా, అద్భుతంగా నిర్వహించారు. విద్యార్థుల మేధస్సును ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ఈ సైన్స్ ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది.

సృజనాత్మకతకు నిదర్శనం రోబోటిక్స్ ఎలక్ట్రానిక్ ప్రాజెక్టులు

ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ కరీముల్లా మాట్లాడుతూ, ప్రతి ఏటా నిర్వహించే సైన్స్ డే కంటే ఈసారి విద్యార్థులు ఎంతో వినూత్నంగా తమ ప్రాజెక్టులను రూపొందించారని ప్రశంసించారు. రోబోటిక్,ఎలక్ట్రానిక్ రిలేటెడ్ ఆధునిక సాంకేతికతతో కూడిన రోబోటిక్ నమూనాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను విద్యార్థులు ప్రదర్శించారు. సమాజానికి మేలు చేసే, సందేశాత్మకమైన అంశాలపై విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు అందరినీ ఆలోచింపజేశాయి.

సర్వతోముఖాభివృద్ధికి ప్రాధాన్యం

ప్రిన్సిపాల్ కరీముల్లా విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఉద్దేశించి మాట్లాడుతూ.. "విద్యార్థులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకూడదు. పాఠశాల యాజమాన్యాలు వారికి చదువుతో పాటు స్పోర్ట్స్, సైన్స్ ఇతర సాంకేతిక కృత్యాలలో తగిన శిక్షణనిచ్చి ప్రోత్సహించాలి" అని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత బయటకు వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థుల ప్రతిభను అభినందించారు.

Search
Categories
Read More
SURAKSHA
AP పోలీసు పదవీ విరమణ విధానం: సేవకు గౌరవం
ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఈరోజు కొత్త పదవీ విరమణ విధానాన్ని ప్రకటించింది. పదవీ విరమణ పొందే...
By Kalaga Sailaja 2026-07-06 04:46:31 0 131
Andhra Pradesh
నిజాయితీ చాటుకున్న ఆటో *డ్రైవర్
చీరాల: బాపట్ల జిల్లా చీరాల మండలంలోని సాల్మన్ సెంటర్ సమీపంలోని హైమ ఆసుపత్రి వద్ద నుండి ఒక మహిళ...
By Gadiyapudi Narendra 2026-02-21 07:14:22 0 174
Andhra Pradesh
పుంగనూరు: 200 కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్లు పంపిణీ టూరు మురళి
పుంగనూరు పట్టణంలో నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి చల్లా బాబు ఆదేశాల మేరకు 200 పేద కుటుంబాలకు రంజాన్...
By Kothuru Murali 2026-03-20 06:02:48 0 148
Andhra Pradesh
రెండో రోజు నిలిచిన బిఎస్ఎన్ఎల్ సేవలు
కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాల్లో శుక్రవారం నుంచి బిఎస్ఎన్ఎల్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి....
By Boiena Rajesh 2026-03-14 09:40:39 0 206
Andhra Pradesh
మదనపల్లి లో శ్రీవారి బస్సు ఢీకొని రైతుకు తీవ్ర గాయాలు.
మదనపల్లె పట్టణంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వాల్మీకి వీధికి చెందిన రైతు లక్ష్మీనారాయణ...
By Pagadala Venkateswar 2026-02-27 07:12:00 0 153
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com