Kadapa RTC bus fire: కడప జిల్లాలో కాలి బూడిదైన ఆర్టీసీ బస్సు... తప్పిన పెను ప్రమాదం.

0
354

Kadapa RTC bus fire: కడప జిల్లాలో కాలి బూడిదైన ఆర్టీసీ బస్సు... తప్పిన పెను ప్రమాదం

05-04-2026 Sun 19:43 | Andhra

RTC Bus Fire in Kadapa District All Passengers Safe

 

వైఎస్ఆర్ కడప జిల్లాలో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. ఓ ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగగా, డ్రైవర్ వేగంగా స్పందించడంతో అందులో ఉన్న 21 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన వేంపల్లి మండలం వీరన్నగట్టుపల్లి సమీపంలో చోటుచేసుకుంది.

 

వివరాల్లోకి వెళితే, కదిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 21 మంది ప్రయాణికులతో వేంపల్లి నుంచి కదిరికి బయలుదేరింది. వీరన్నగట్టుపల్లి వద్దకు రాగానే, రోడ్డుకు అడ్డంగా తక్కువ ఎత్తులో వేలాడుతున్న 11 కేవీ విద్యుత్ తీగలు బస్సు పైభాగానికి తగిలాయి. దీంతో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ అయి మంటలు చెలరేగాయి. బస్సు లోపల పొగలు, మంటలు గమనించిన ప్రయాణికులు భయంతో కేకలు వేశారు.

 

వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన నిలిపివేశారు. ప్రయాణికులందరినీ హుటాహుటిన కిందకు దించారు. వారు దిగిన కొద్దిసేపటికే మంటలు బస్సు మొత్తానికి వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అయితే, అప్పటికే బస్సు కాలి బూడిదైంది.

 

విద్యుత్ తీగలు ప్రమాదకరంగా కిందకు వేలాడటమే ఈ దుర్ఘటనకు కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనపై వేంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Search
Categories
Read More
Telangana
వన్ నేషన్- వన్ ఎలక్షన్ తోనే దేశాభివృద్ధి సాధ్యం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగాలన్న వన్ నేషన్ – వన్...
By Sidhu Maroju 2026-01-06 09:48:58 0 192
Andhra Pradesh
విశాఖ లో కూటమి నాయకుల మధ్య విబేధాలు
విశాఖ జిల్లాల్లో కూటమి విభేదాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి అధికార పార్టీ ఐన టిడిపి నాయకులు...
By Mobbu Venkatramana 2026-03-22 09:26:13 0 370
Telangana
"మారేడ్‌పల్లి పీఎస్‌లో ‘Arrive Alive’.. డీసీపీ శ్రీధర్ గోల్డెన్ అవర్ ప్రాధాన్యం”
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలను కాపాడటంలో ‘గోల్డెన్ అవర్’...
By Sidhu Maroju 2026-04-17 09:00:40 0 229
Andhra Pradesh
శ్రీ బాల ఆర్యటమ్మ తల్లి తిరునాళ్ళు మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్
శ్రీ బాల ఆరేటమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.  ...
By Rajini Kumari 2026-02-28 12:54:32 0 153
Andhra Pradesh
53 డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో రూ.5.30 లక్షల జరిమానా: VZM ఎస్పీ
మద్యం తాగి వాహనాలు నడిపిన 53 మంది వాహనదారులపై కేసులు నమోదు చేసి, ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున...
By Boiena Rajesh 2026-02-26 15:29:36 0 194
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com