విజ్ఞాన భారతి పాఠశాలలో ఘనంగా ‘జాతీయ సైన్స్ డే’ వేడుకలు

0
604

చీరాలలోని విజ్ఞాన భారతి హైస్కూల్‌లో శుక్రవారం జాతీయ సైన్స్ డే వేడుకలను పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా, అద్భుతంగా నిర్వహించారు. విద్యార్థుల మేధస్సును ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ఈ సైన్స్ ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది.

సృజనాత్మకతకు నిదర్శనం రోబోటిక్స్ ఎలక్ట్రానిక్ ప్రాజెక్టులు

ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ కరీముల్లా మాట్లాడుతూ, ప్రతి ఏటా నిర్వహించే సైన్స్ డే కంటే ఈసారి విద్యార్థులు ఎంతో వినూత్నంగా తమ ప్రాజెక్టులను రూపొందించారని ప్రశంసించారు. రోబోటిక్,ఎలక్ట్రానిక్ రిలేటెడ్ ఆధునిక సాంకేతికతతో కూడిన రోబోటిక్ నమూనాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను విద్యార్థులు ప్రదర్శించారు. సమాజానికి మేలు చేసే, సందేశాత్మకమైన అంశాలపై విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు అందరినీ ఆలోచింపజేశాయి.

సర్వతోముఖాభివృద్ధికి ప్రాధాన్యం

ప్రిన్సిపాల్ కరీముల్లా విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఉద్దేశించి మాట్లాడుతూ.. "విద్యార్థులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకూడదు. పాఠశాల యాజమాన్యాలు వారికి చదువుతో పాటు స్పోర్ట్స్, సైన్స్ ఇతర సాంకేతిక కృత్యాలలో తగిన శిక్షణనిచ్చి ప్రోత్సహించాలి" అని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత బయటకు వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థుల ప్రతిభను అభినందించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శుగవాసి ప్రసాద్ బాబు కలిసిన మదనపల్లి మైనార్టీ నాయకులు
రాయచోటి రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు ను మర్యాదపూర్వకంగా కలిసిన మదనపల్లి...
By Benguluri Madhubabu 2026-02-24 05:36:47 0 140
Andhra Pradesh
ఉచిత సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ 9 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల పిల్లల వరకు సద్వినియోగం చేసుకోండి డాక్టర్ సుధ డిసెంబర్ 31 సాయంత్రం లోపు నమోదు చేసుకోండి రామకృష్ణ వివేకానంద రెడ్డి
*తాడేపల్లి*   *ఉచిత సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ ని 9 నుంచి 15 సంవత్సరాల లోపు బాలికలు...
By Rajini Kumari 2025-12-30 10:14:46 0 153
Andhra Pradesh
అనంతపురం గంగమ్మ తల్లికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి గారి సోదరుడు
ఈరోజు మొదలైన రాయలసీమకే తలమానికమైన అనంతపురం గంగమ్మ అమ్మవారి కి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు...
By Benguluri Madhubabu 2026-02-18 14:21:01 0 182
Business
From EMIs to Easy Repayment: 5 Common Loan Mistakes Indians Make — and How to Avoid Them
From EMIs to Easy Repayment: Common Loan Mistakes Indians Make — and How to Avoid Them...
By BMA ADMIN 2025-05-21 10:07:28 0 2K
Telangana
తెలంగాణ రైతులకు శుభవార్త..మూడు విడతల్లో రైతు భరోసా తొలి విడత ఈనెల 22న
తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొన్ని రోజుల నుంచి రైతు భరోసా...
By Ponnala Srinivasrao 2026-03-15 17:16:42 0 195
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com