జి ఆర్ పి పోలీసుల ప్రతిభకు ఏబిసిడి అవార్డు

0
721

పోలీస్ కేసుల ఛేదనలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అందజేసే ప్రతిష్టాత్మక ఏ బి సి డి అవార్డులను శుక్రవారం ఘనంగా ప్రదానం చేశారు. 2025 సంవత్సరం 4వ త్రైమాసికానికి సంబంధించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరీష్ కుమార్ గుప్తా ఈ అవార్డులను అందజేశారు.

మూడు రోజుల్లోనే కేసు ఛేదన రికార్డు స్థాయి రికవరీ

ఒంగోలు జీఆర్‌పీఎస్ పరిధిలో నమోదైన ఒక భారీ చోరీ కేసును అత్యంత వేగంగా ఛేదించినందుకు గాను ఈ గుర్తింపు లభించింది. క్రైమ్ నెంబర్.126/2025 యు/ఎస్ 303(2) బి.ఎన్.ఎస్ కింద నమోదైన ఈ కేసులో, నిందితుడిని కేవలం 3 రోజులలోపే అరెస్ట్ చేయడమే కాకుండా, బాధితుల నుండి దొంగిలించబడిన 341 గ్రాముల బంగారు ఆభరణాలను మరియు ఇతర విలువైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన ఆస్తిని వెంటనే బాధితులకు అప్పగించి వారి ముఖాల్లో చిరునవ్వు నింపారు.

విజయవంతమైన బృందం పర్యవేక్షణ విజయవాడ ఎస్.ఆర్.పి రాహుల్ దేవ్ సింగ్ సమర్థవంతమైన పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ నిర్వహించబడింది. కేసు ఛేదనలో చురుకైన పాత్ర పోషించిన ఈ క్రింది అధికారులను డీజీపీ ప్రత్యేకంగా అభినందించారు. ఎం . మురళీధర్ డి ఎస్ ఆర్ పి నెల్లూరు, ఒంగోలు జి ఆర్ పి ఎస్.కె మౌలా షరీఫ్ సి.ఐ అఫ్ పోలీసులు

 సిహెచ్.కొండయ్య చీరాల జి ఆర్ పి ఎస్సై అఫ్ పోలీస్,

 కె. భాస్కర్ హెడ్ కానిస్టేబుల్

 బి. రాము పోలీస్ కానిస్టేబుల్,రాజు,సతీష్,లక్ష్మీ నారాయణ.

ఈ ఆపరేషన్‌లో చీరాల ఒంగోలు పోలీస్ సిబ్బంది చూపిన సమన్వయం, చురుకైన దర్యాప్తు మరియు వేగవంతమైన చర్యలే ఈ విజయానికి కారణమని పోలీస్ ఉన్నతాధికారులు కొనియాడారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని నేరస్తులను పట్టుకోవడంలో మన పోలీసులు చూపుతున్న చొరవ అభినందనీయమని డీజీపీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిసెంబర్ నెలలో మద్యం అమ్మకాలు కిక్కెక్కించాయి. నూతన సంవత్సర.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిసెంబర్ నెలలో మద్యం అమ్మకాలు కిక్కెక్కించాయి. నూతన సంవత్సర వేడుకలతో...
By John Baji 2026-01-02 12:46:13 0 126
Andhra Pradesh
నిమ్మనపల్లి మండలంలో కోడిపందేలు: 8 మంది అరెస్ట్
చిత్తూరు జిల్లా నిమ్మనపల్లి మండలంలోని బండ్లపై ప్రాంతంలో కోడిపందేలు ఆడుతున్న ఎనిమిది మందిని...
By Pagadala Venkateswar 2026-01-15 07:10:09 0 103
Andhra Pradesh
రాష్ట్రంలో జాతీయ రహదారుల ప్రాజెక్టుపై సీఎం సమీక్ష
*for scrolls*   *అమరావతి*    *రాష్ట్రంలో జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సీఎం...
By Rajini Kumari 2026-01-29 13:38:48 0 141
Andhra Pradesh
గుర్తుతెలియని వాహనం ఢీకొని డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
మంగళవారం రాత్రి పుంగనూరు మండలం మొరంపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రైవేట్ బస్సు డ్రైవర్...
By Kothuru Murali 2026-02-25 11:11:57 0 126
Andhra Pradesh
లబ్ధిదారులకు చెక్కుల అందజేసిన కోడుమూరు ఎమ్మెల్యే
కర్నూలు : కోడుమూరు :  కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గానికి చెందిన ...
By Hari Krishna 2026-01-07 09:13:14 0 145
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com