ప్రజా దర్బారు వినతలు పత్రాలు గొల్లపూడిలో 50 అర్జీలు

0
165

ప్రజాస్వామ్య పాలనకు దర్పణం పడుతున్న 'ప్రజాదర్బారు' 

 

-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.

 

గొల్లపూడిలో 50 అర్జీలు సమర్పణ.

 

ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్, 13.03.2026.

 

ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ప్రజాస్వామ్య పాలనకు 'ప్రజాదర్బారు' కార్యక్రమ నిర్వహణ దర్పణం పడుతోందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు పేర్కొన్నారు.

 

విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో శుక్రవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (ప్రజాదర్బారు) నిర్వహించారు. మొత్తం 50 మంది ఆర్జీలు సమర్పించారు.

 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించి, వారి సమస్యలను ఓపిగ్గా విన్నారు. ఆయా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

 

ఇళ్లు, ఇళ్ల స్థ‌లాలు, ఇళ్లస్థలాల క్రమబద్ధీకరణ, రైస్ కార్డులు, ఉపాధి, పెన్ష‌న్లు, దివ్యంగుల సర్టిఫికెట్లు మంజూరు, వివిధ రెవెన్యూ సేవ‌లు, పోలీసు సేవలకు సంబంధించి అర్జీలు వ‌చ్చాయి.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ ప్రజల నుంచి స్వీకరించిన ఆర్జీలను పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సెల్ సిస్టం (పి.జి.ఆర్.ఎస్) ద్వారా ఆన్ లైన్ లో నమోదు చేసి జవాబుదారీతనంతో పరిష్కరిస్తున్నట్లు వెల్లడించారు.

 

ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందన్నారు. ప్రభుత్వ అధికార యంత్రాంగం, సిబ్బంది బాధ్యతతో వ్యవహరించాలన్నారు. ప్రజలకు నాణ్యతతో కూడిన సేవలు అందించి ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలన్నారు.

 

రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని కూటమి ప్రభుత్వం నిలబెడుతుందన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు, రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్‌ కల్యాణ్‌ గారు, మంత్రి నారా లోకేష్ గారు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. హామీలు ఒక్కోక్కటిగా అమలు చేస్తున్నారని అన్నారు. 

 

ప్రజదర్బార్‌ వేదికలో అన్నిశాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు అందుబాటులో ఉంటారన్నారు. ఇక్కడ వచ్చే సమస్యలను నెల రోజుల వ్యవధిలో పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) గారు, అధికారులు, ఎన్డీఏ కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
21 ఆదివారం కర్నూలు లో సాహిత్య సమ్మేళనం !!
కర్నూలు : కేంద్ర సాహిత్య అకాడమీ మరియు అభ్యుదయ రచయితల సంఘం ఆదివారములో ఈ నెల డిసెంబర్ 21న కర్నూలు...
By Hari Krishna 2025-12-15 03:24:44 0 294
Telangana
Chinthala Manikya Reddy's 50th birthday celebrations: MP Etela participated.|
      Medchal malkajgiri. Dist.  Alwal. On auccation of Chintala Manikya...
By Sidhu Maroju 2025-12-04 08:56:05 0 488
Andhra Pradesh
పూర్వ విద్యార్థుల సమ్మేళనం
పెద్దపంజాణి మండలం రాయల్‌పేట జెడ్పిహెచ్‌ఎస్ ప్రభుత్వ పాఠశాలలో 2003-2004 విద్యా...
By Kothuru Murali 2026-05-04 13:18:29 0 104
Andhra Pradesh
రాయలసీమలో రైతుల ఇబ్బందులు: వర్షం తక్కువ, ధరలు కుదిరలేక |
రాయలసీమలో రైతుల ఇబ్బందులు: వర్షం తక్కువ, ధరలు కుదిరలేక రాయలసీమ ప్రాంతంలో వర్షాలు తక్కువగా పడటంతో...
By Bharat Aawaz 2025-09-20 10:43:35 0 1K
Andhra Pradesh
కరెంటు షాక్ తో రెండు ఏనుగులు మృతి
తిరుపతి ఎర్ర వారి పాలెం మండలం నెరబైలు పంచాయతీలో విషాదం నెలకొంది ఉదయం ఫారెస్ట్ బంగ్లా సమీపంలోని...
By Benguluri Madhubabu 2026-03-09 09:50:31 0 194
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com