డాక్టర్ వేషంలో దొంగతనం - యశోద హాస్పిటల్ లో సంచలనం.|

0
166

 

సికింద్రాబాద్ : ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిలో భద్రతా వైఫల్యం బయటపడింది. డాక్టర్ కోటు వేసుకుని వచ్చిన ఓ కిలాడీ మహిళ.. చికిత్స పేరుతో రోగికి మత్తు మందు ఇచ్చి, ఒంటిపై ఉన్న పది తులాల బంగారు ఆభరణాలతో ఉడాయించింది. ఈ సంచలన ఘటన సికింద్రాబాద్‌లోని యశోద హాస్పిటల్‌లో చోటుచేసుకుంది.

పాత బోయిన్‌పల్లికి చెందిన సుధారాణి అనే మహిళ అనారోగ్యంతో గత కొన్ని రోజులుగా యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆమె కోలుకోవడంతో మార్చి 12 (గురువారం) నాడు డిశ్చార్జ్ కావాల్సి ఉంది.

సరిగ్గా అదే సమయంలో తెల్లకోటు ధరించి, స్టెతస్కోప్‌తో డాక్టర్‌లా నటించిన ఒక గుర్తు తెలియని మహిళ సుధారాణి ఉన్న గదిలోకి ప్రవేశించింది.

పరీక్షలు చేయాలని చెప్పి గదిలో ఉన్న బాధితురాలి బంధువులను సదరు మహిళ బయటకు పంపించింది. అనంతరం సుధారాణికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది.

 బాధితురాలు స్పృహ కోల్పోగానే, ఆమె ఒంటిపై ఉన్న సుమారు 10 తులాల బంగారు ఆభరణాలను దొంగిలించి అత్యంత చాకచక్యంగా అక్కడి నుంచి పారిపోయింది.

కొంతసేపటి తర్వాత బంధువులు గదిలోకి వెళ్లి చూడగా సుధారాణి స్పృహ లేకుండా పడి ఉంది. ఒంటిపై నగలు మాయమవ్వడంతో ఆందోళన చెందిన బంధువులు ఆసుపత్రి సిబ్బందిని నిలదీశారు. అయితే ఆ మహిళ తమ ఆసుపత్రి వైద్యురాలు కాదని యాజమాన్యం సమాధానమివ్వడంతో బాధితులు షాక్‌కు గురయ్యారు.

బాధితుల ఫిర్యాదుతో మార్కెట్ పోలీసులు రంగంలోకి దిగారు.

ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా, నిందితురాలు నర్సింగ్ స్టాఫ్ గదిలోకి వెళ్లి రావడం రికార్డైంది. ఇంత పెద్ద ఆసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తి డాక్టర్ వేషంలో తిరుగుతున్నా ఎవరూ గమనించకపోవడంపై బాధితులు మండిపడుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితురాలి కోసం గాలిస్తున్నారు.

#sidhumaroju

Alwal 

Search
Categories
Read More
Andhra Pradesh
గుంటూరులో మున్సిపల్ కార్మికుల ధర్నా
మునిసిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర కార్యదర్శి...
By John Baji 2025-12-29 10:06:10 0 190
Telangana
కరువు వచ్చినప్పుడు కరెన్సీ కట్టలు కంచంలో పెట్టుకుని తిని బతుకుతారా..సాకేత్ శర్మ
కాలేశ్వరం పేరు వినగానే కాస్ట్–బెనిఫిట్ రేషియో అంటూ కారుకూతలు కూసే వాళ్లను నేను అడుగుతున్నా,...
By Ponnala Srinivasrao 2026-07-08 00:58:21 0 113
Telangana
MARK OF REPUBLIC DAY
Republic Day marks the day India chose law over power and institutions over individuals. The...
By Terli Ashok 2026-01-26 07:06:31 0 300
Andhra Pradesh
మదనపల్లి: హత్య జరిగిన ప్రదేశంలో ఉద్రిక్త వాతావరణం.
మదనపల్లెలో రిషిక ప్రియా అనే వ్యక్తి దారుణ హత్య మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో...
By Pagadala Venkateswar 2026-02-17 05:10:45 0 164
International
Women's Reservation Bill: The Political Game and the Hidden Reality
The implementation of the 2023 'Nari Shakti Vandan Adhiniyam' has sparked a fresh political row....
By Hazu MD. 2026-05-18 09:35:16 0 281
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com