డాక్టర్ వేషంలో దొంగతనం - యశోద హాస్పిటల్ లో సంచలనం.|

0
101

 

సికింద్రాబాద్ : ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిలో భద్రతా వైఫల్యం బయటపడింది. డాక్టర్ కోటు వేసుకుని వచ్చిన ఓ కిలాడీ మహిళ.. చికిత్స పేరుతో రోగికి మత్తు మందు ఇచ్చి, ఒంటిపై ఉన్న పది తులాల బంగారు ఆభరణాలతో ఉడాయించింది. ఈ సంచలన ఘటన సికింద్రాబాద్‌లోని యశోద హాస్పిటల్‌లో చోటుచేసుకుంది.

పాత బోయిన్‌పల్లికి చెందిన సుధారాణి అనే మహిళ అనారోగ్యంతో గత కొన్ని రోజులుగా యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆమె కోలుకోవడంతో మార్చి 12 (గురువారం) నాడు డిశ్చార్జ్ కావాల్సి ఉంది.

సరిగ్గా అదే సమయంలో తెల్లకోటు ధరించి, స్టెతస్కోప్‌తో డాక్టర్‌లా నటించిన ఒక గుర్తు తెలియని మహిళ సుధారాణి ఉన్న గదిలోకి ప్రవేశించింది.

పరీక్షలు చేయాలని చెప్పి గదిలో ఉన్న బాధితురాలి బంధువులను సదరు మహిళ బయటకు పంపించింది. అనంతరం సుధారాణికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది.

 బాధితురాలు స్పృహ కోల్పోగానే, ఆమె ఒంటిపై ఉన్న సుమారు 10 తులాల బంగారు ఆభరణాలను దొంగిలించి అత్యంత చాకచక్యంగా అక్కడి నుంచి పారిపోయింది.

కొంతసేపటి తర్వాత బంధువులు గదిలోకి వెళ్లి చూడగా సుధారాణి స్పృహ లేకుండా పడి ఉంది. ఒంటిపై నగలు మాయమవ్వడంతో ఆందోళన చెందిన బంధువులు ఆసుపత్రి సిబ్బందిని నిలదీశారు. అయితే ఆ మహిళ తమ ఆసుపత్రి వైద్యురాలు కాదని యాజమాన్యం సమాధానమివ్వడంతో బాధితులు షాక్‌కు గురయ్యారు.

బాధితుల ఫిర్యాదుతో మార్కెట్ పోలీసులు రంగంలోకి దిగారు.

ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా, నిందితురాలు నర్సింగ్ స్టాఫ్ గదిలోకి వెళ్లి రావడం రికార్డైంది. ఇంత పెద్ద ఆసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తి డాక్టర్ వేషంలో తిరుగుతున్నా ఎవరూ గమనించకపోవడంపై బాధితులు మండిపడుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితురాలి కోసం గాలిస్తున్నారు.

#sidhumaroju

Alwal 

Search
Categories
Read More
Andhra Pradesh
జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు.
బాపట్ల: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించిన...
By Gadiyapudi Narendra 2026-01-19 14:51:05 0 134
Andhra Pradesh
*జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ ఆవరణలో "ఓపెన్ హౌస్" కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా పోలీస్ అధికారులు*
సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని సీసీఎస్ డీఎస్పీ పి.జగదీష్ నాయక్ తెలిపారు. అంతర్జాతీయ...
By Vadlamudi NagaVenkat 2026-03-06 12:08:59 0 338
Kerala
Thiruvananthapuram:Kerala’s capital was on high alert Monday after bomb threats
Thiruvananthapuram:Kerala’s capital was on high alert Monday after bomb threats were issued...
By BMA ADMIN 2025-05-20 05:18:29 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com