Chandrababu: పాలనలో మార్పు రావాలి.. పరిశుభ్రతపై దృష్టి పెట్టండి: కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.

0
91

స్వచ్ఛాంధ్రపై సీరియస్‌గా ఉండాలని, పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని సూచన

సచివాలయ సిబ్బంది బదిలీలపై కలెక్టర్లకు పూర్తి అధికారాలు

 

కౌలు రైతులకు రుణాల మంజూరులో అడ్డంకులు తొలగించాలని ఆదేశం

పాలనలో డీప్ టెక్ వినియోగం పెంచాలని దిశానిర్దేశం

ఆరు జిల్లాల కలెక్టర్లతో సీఎం చంద్రబాబు నిర్వహిస్తున్న కాన్ఫరెన్స్ సమావేశం కొనసాగుతోంది. ఈ సందర్భంగా పలు శాఖల ఉన్నతాధికారులు తమ నివేదికలను ప్రజెంటేషన్ల రూపంలో సమర్పించారు. ఈ సమావేశంలో స్వచ్ఛాంధ్ర, పాలనలో సాంకేతికత వినియోగం, సచివాలయ సిబ్బంది సర్దుబాటు, కౌలు రైతుల సమస్యలపై సీఎం చంద్రబాబు పలు కీలక ఆదేశాలు, సూచనలు జారీ చేశారు.

 

ఇటీవల తాను కాకినాడ, సామర్లకోటలో పర్యటించినప్పుడు రోడ్ల పక్కన చెత్త కనిపించిందని, కొన్ని ప్రాంతాల్లో స్వచ్ఛాంధ్రపై సీరియస్‌నెస్ కొరవడిందని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్లు పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల కోసం నగరాలు, పట్టణాలు ఒకదానికొకటి పోటీ పడాలని సూచించారు. పరిశుభ్రత మన సంస్కృతిలో భాగమని, ఆరోగ్యానికి ఇది చాలా కీలకమని గుర్తుచేశారు.

Search
Categories
Read More
Bharat Aawaz
🌟 HANA Honorary Awards – Celebrating Silent Champions of Change
In a world where genuine efforts often go unnoticed, the HANA Honorary Awards emerge as a...
By Bharat Aawaz 2025-06-28 12:13:28 0 2K
Telangana
రేపటి నుంచి స్కూళ్లకు సెలవులు
తెలుగు రాష్ట్రాల్లోని స్కూలు విద్యార్థులకు గుడ్స్యూస్. పాఠశాలలకు నేడే చివరి వర్కింగ్ డే. రేపటి...
By Mitappaly Shiavji 2026-01-09 06:56:01 0 252
Andhra Pradesh
రాజకీయ పార్టీల తో ఆర్డీవో సమావేశం
చీరాల: చీరాల ఎమ్మార్వో ఆఫీసులో పలు రాజకీయ పార్టీల తో ఆర్డీవో  సమావేశం ఏర్పాటు...
By Gadiyapudi Narendra 2026-01-27 16:02:16 0 171
Education
మన భారత విద్యా వ్యవస్థ – ప్రపంచంలో మనం ఎందుకు వెనుకబడుతున్నాం?
"విద్య అంటే కుండ నింపడం కాదు, నిప్పును రాజేయడం." – విలియం బట్లర్ యీట్స్ విద్య ఒక దేశ...
By Bharat Aawaz 2025-07-25 07:41:33 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com