భారత ఆర్థిక మార్కెట్లపై ఒకరోజు వర్క్షాప్. - స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, సెక్యూరిటీస్ మార్కెట్ వంటి రంగాల్లో ఉన్న కెరీర్ అవకాశాలపై విద్యార్థులకు అవగాహన - డాక్టర్ మూర్తి.
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో భారత ఆర్థిక మార్కెట్లపై ఒకరోజు వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బెంగళూరుకు చెందిన సెబి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా డా. మూర్తి మాట్లాడుతూ భారత ఆర్థిక మార్కెట్ల నిర్మాణం, వాటి పనితీరు, పెట్టుబడి అవకాశాలు వంటి అంశాలను వివరించారు. అలాగే స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, సెక్యూరిటీస్ మార్కెట్ వంటి రంగాల్లో ఉన్న కెరీర్ అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ వర్క్షాప్ ద్వారా విద్యార్థులు భారత ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక మార్కెట్ల పాత్ర, వాటిలో ఉన్న ఉపాధి అవకాశాల గురించి విలువైన సమాచారం పొందారని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ బిజినెస్ మేనేజ్మెంట్ డా జి సాయి స్రవంతి, ఆచార్య సుజా ఎస్ నాయర్ అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz