రూ.32,52,064 సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ. - కావలి నియోజకవర్గం పారిశ్రామికంగా అభివృద్ధి చెందబోతుంది. - కొండ బిట్రగుంట బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. - కార్యకర్తలకు ప్రశంసా పత్రం అందజేసిన ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి

0
367

31 మంది లబ్ధిదారులకు సంబందించిన రూ.32,52,064 చెక్కులను కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి  మంగళవారం కావలి టీడీపీ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటివరకు మొత్తం 1433 మంది దరఖాస్తు చేసుకోగా 1049 మందికి రూ.8,53,78,180 అందివ్వడం జరిగిందన్నారు. మరో 384 మంది లబ్దిదారుల దరఖాస్తులు ప్రాసెస్ లో ఉన్నవని, వెరిఫికేషన్ అనంతరం వారికి కూడా చెక్కులు అందజేయబడతాయని తెలిపారు. కొండ బిట్రగుంట బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగిందని, గుడి అభివృద్ధికి ముందుకు వచ్చిన దాతలను ఈ సందర్భంగా అభినందించారు.  కావలి నియోజకవర్గం పారిశ్రామికంగా అభివృద్ధి చెందబోతున్నదని, రామాయపట్నం పోర్టు పూర్తవుతుందని, బిపిసిఎల్ కు ప్రధాని నరేంద్ర మోడీ  శంకుస్థాపన చేయనున్నారని, దగదర్తి ఎయిర్ పోర్టు కు ఏప్రిల్ లో భూమి పూజ జరగనుందని తెలిపారు. మై టీడీపీ యాప్ చక్కగా వినియోగించిన కార్యకర్తలకు ఎమ్మెల్యే గారు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, రూరల్ మండల అధ్యక్షులు ఆవుల రామకృష్ణ, బోగోలు మండల అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరరావు, అల్లూరు మండల అధ్యక్షులు బండి శ్రీనివాసులు రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Himachal Pradesh
Himachal Launches QR-Based Food Grain Distribution System
The Himachal Pradesh Food, Civil Supplies and Consumer Affairs Department has introduced a QR...
By Navya Sree 2026-06-26 08:42:24 0 85
Andhra Pradesh
సీఎం చంద్రబాబుతో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ భేటీ.. ఏపీకి పూర్తి సహకారం అందిస్తామని హామీ.
  సీఎం చంద్రబాబుతో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ భేటీ.. ఏపీకి పూర్తి సహకారం...
By Pagadala Venkateswar 2026-05-30 05:21:51 0 77
Andhra Pradesh
షాకింగ్... ఆన్‌లైన్‌లో చిరంజీవి కొత్త సినిమా HD ప్రింట్
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో విడుదలైన ‘మన శంకరవరప్రసాద్...
By Pagadala Venkateswar 2026-01-13 07:27:12 0 197
Lakshdweep
Lakshadweep Boosts Women’s Livelihood and Empowerment
Lakshadweep continues to strengthen women’s empowerment through livelihood promotion, skill...
By Fathima Safa 2026-06-29 07:56:51 0 108
Andhra Pradesh
సంక్రాంతికి 16 ప్రత్యేక రైళ్లు ఎస్ సి ఆర్
*సంక్రాంతికి 16 ప్రత్యేక రైళ్లు: SCR*   సంక్రాంతి సందర్భంగా 16 అదనపు ప్రత్యేక రైళ్లను...
By Rajini Kumari 2025-12-17 09:25:03 0 223
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com