రూ.32,52,064 సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ. - కావలి నియోజకవర్గం పారిశ్రామికంగా అభివృద్ధి చెందబోతుంది. - కొండ బిట్రగుంట బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. - కార్యకర్తలకు ప్రశంసా పత్రం అందజేసిన ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి

0
372

31 మంది లబ్ధిదారులకు సంబందించిన రూ.32,52,064 చెక్కులను కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి  మంగళవారం కావలి టీడీపీ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటివరకు మొత్తం 1433 మంది దరఖాస్తు చేసుకోగా 1049 మందికి రూ.8,53,78,180 అందివ్వడం జరిగిందన్నారు. మరో 384 మంది లబ్దిదారుల దరఖాస్తులు ప్రాసెస్ లో ఉన్నవని, వెరిఫికేషన్ అనంతరం వారికి కూడా చెక్కులు అందజేయబడతాయని తెలిపారు. కొండ బిట్రగుంట బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగిందని, గుడి అభివృద్ధికి ముందుకు వచ్చిన దాతలను ఈ సందర్భంగా అభినందించారు.  కావలి నియోజకవర్గం పారిశ్రామికంగా అభివృద్ధి చెందబోతున్నదని, రామాయపట్నం పోర్టు పూర్తవుతుందని, బిపిసిఎల్ కు ప్రధాని నరేంద్ర మోడీ  శంకుస్థాపన చేయనున్నారని, దగదర్తి ఎయిర్ పోర్టు కు ఏప్రిల్ లో భూమి పూజ జరగనుందని తెలిపారు. మై టీడీపీ యాప్ చక్కగా వినియోగించిన కార్యకర్తలకు ఎమ్మెల్యే గారు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, రూరల్ మండల అధ్యక్షులు ఆవుల రామకృష్ణ, బోగోలు మండల అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరరావు, అల్లూరు మండల అధ్యక్షులు బండి శ్రీనివాసులు రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు - అదనపు జిల్లా సమన్యయా ధికారి
విశాఖ ప్రజలకు అదనపు జిల్లా సమన్వయ అధికారి గొబ్బి ల్ల విద్యా దరీ గారు. తెలుగు వారి ఉగాది పండుగ...
By Mobbu Venkatramana 2026-03-19 08:01:01 0 428
Andhra Pradesh
*నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై పొగమంచు.. పదుల సంఖ్యలో వాహనాలు ఢీ*
ఉత్తరాదిలో వాయు కాలుష్యం (Air pollution) తీవ్రత కొనసాగుతోంది. గాలి నాణ్యతా సూచీ (AQI) ప్రమాదకర...
By SivaNagendra Annapareddy 2025-12-13 07:59:39 0 439
Andhra Pradesh
APSET 2025: ఏపీ సెట్ నోటిఫికేషన్ విడుదల.. పరీక్ష తేదీలు, దరఖాస్తు, ఫీజు వివరాలు చూడండి
APSET 2025: డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీల్లో లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకాలు,...
By Siva Bhaskar 2025-12-31 04:25:42 0 525
Tamilnadu
CPI(M) Demands CB-CID Probe into Isha Yoga Center Deaths
The Communist Party of India (Marxist) Tamil Nadu State Committee has formally called upon the...
By Lokeshwari Panthadi 2026-06-27 10:38:10 0 106
Andhra Pradesh
మార్కాపురం జిల్లా ప్రజలకు విజ్ఞప్తి
మార్కాపురం జిల్లా ప్రజలకు విజ్ఞప్తి Chief Commissioner of Land Administration Smt....
By Chennaiah Kati 2026-07-15 13:13:28 0 55
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com