రూ.32,52,064 సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ. - కావలి నియోజకవర్గం పారిశ్రామికంగా అభివృద్ధి చెందబోతుంది. - కొండ బిట్రగుంట బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. - కార్యకర్తలకు ప్రశంసా పత్రం అందజేసిన ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి

0
369

31 మంది లబ్ధిదారులకు సంబందించిన రూ.32,52,064 చెక్కులను కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి  మంగళవారం కావలి టీడీపీ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటివరకు మొత్తం 1433 మంది దరఖాస్తు చేసుకోగా 1049 మందికి రూ.8,53,78,180 అందివ్వడం జరిగిందన్నారు. మరో 384 మంది లబ్దిదారుల దరఖాస్తులు ప్రాసెస్ లో ఉన్నవని, వెరిఫికేషన్ అనంతరం వారికి కూడా చెక్కులు అందజేయబడతాయని తెలిపారు. కొండ బిట్రగుంట బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగిందని, గుడి అభివృద్ధికి ముందుకు వచ్చిన దాతలను ఈ సందర్భంగా అభినందించారు.  కావలి నియోజకవర్గం పారిశ్రామికంగా అభివృద్ధి చెందబోతున్నదని, రామాయపట్నం పోర్టు పూర్తవుతుందని, బిపిసిఎల్ కు ప్రధాని నరేంద్ర మోడీ  శంకుస్థాపన చేయనున్నారని, దగదర్తి ఎయిర్ పోర్టు కు ఏప్రిల్ లో భూమి పూజ జరగనుందని తెలిపారు. మై టీడీపీ యాప్ చక్కగా వినియోగించిన కార్యకర్తలకు ఎమ్మెల్యే గారు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, రూరల్ మండల అధ్యక్షులు ఆవుల రామకృష్ణ, బోగోలు మండల అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరరావు, అల్లూరు మండల అధ్యక్షులు బండి శ్రీనివాసులు రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అకాల వర్షం గాలులు దాటికి దెబ్బతిన్న అరటిపంటను పరిశీలించిన రాజంపేట ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన రాజు
రాజంపేట నియోజకవర్గం పరిధిలోని రాజంపేట మండలంలో ఈనెల 18వ తేదీన ఆకాల వర్షాలకు భారీగా అరటిపంట నష్టం...
By Benguluri Madhubabu 2026-03-23 03:53:11 0 224
Andhra Pradesh
నిర్మల సీతారామన్ గారిని అడ్డుపెట్టుకొని సోషల్ మీడియా సైబర్ మోసాలు తస్మాత్ జాగ్రత్త
బ్యాంకులో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు మీ ఏరియా బ్యాంకులకు వెళ్లి వారిని సంపాదించి మాత్రమే మ్యూచువల్...
By Rajini Kumari 2025-12-26 05:51:46 0 234
Andhra Pradesh
భగవంతుడు శాశ్వతం భగవంతుడికి సేవ చేసి సేవకులు శాశ్వతం కాదు
భగవంతుడు శాశ్వతం-భగవంతుడికి సేవ చేసే సేవకులు శాశ్వతం కాదు. భగవంతుడికి సేవ చేసే సేవకులు మారుతూ...
By Rajini Kumari 2026-06-06 11:20:50 0 225
Andhra Pradesh
పోలవరం నిర్వాసిత గిరిజనేతరులు ఆప్షన్ ఫారంలు త్వరగా ఇవ్వాలి!
పోలవరం ప్రాజెక్టు గిరిజనేతర నిర్వాసితుల పునరావాస ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. పునరావాసం కోసం...
By Shyamala Yadagiri 2026-05-14 16:38:37 0 184
Andhra Pradesh
నూతన సంవత్సర శుభాకాంక్షలు
భారత్ ఆవాజ్  మీడియా మిత్రులకు, ప్రతినిధులకు  మరియు ఆంధ్ర రాష్ట్ర, తెలంగాణ రాష్ట్ర...
By Karapati Gopi 2026-01-01 00:40:13 0 715
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com