సూర్యోదయ సంస్థకు మదర్ థెరిస్సా జాతీయ అవార్డు

0
360

మార్కాపురం:

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్కాపురం పట్టణంలోని గోశ సత్యనారాయణ కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో సూర్యోదయ సంస్థకు మదర్ థెరిస్సా జాతీయ అవార్డు ప్రదానం చేశారు.

గ్లోబల్ హెల్త్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ గోట్టి ముక్కల చెన్నకేశవులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో విశిష్ట సామాజిక సేవలు అందిస్తున్న స్వచ్ఛంద సంస్థలను సన్మానించారు. రక్తదాన శిబిరాల నిర్వహణ, థలసేమియా పిల్లలకు రక్తం అందించడం, వృద్ధాశ్రమాల్లో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం, పేదలకు ఆహారం అందించడం వంటి సేవలను గుర్తించి సూర్యోదయ సంస్థకు ఈ అవార్డును అందజేశారు.

ఈ అవార్డును గ్లోబల్ హెల్త్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చెన్నకేశవులు, ప్రముఖులు పి.వి.సి. అంజనీ కుమారి (హైకోర్టు సూపరింటెండెంట్, హైదరాబాద్), జి. గోవింద్ (టీచర్, రైటర్, యాక్టర్), జి. చెన్నకేశవులు (ఇన్ఫోటెక్ సీఈవో, బెంగళూరు), రాధా (స్టేట్ మెంబర్, వాసవి క్లబ్), మాజీ గవర్నర్ కిరణ్ కుమార్ గంగిశెట్టి, ఎం. నాగిరెడ్డి చేతుల మీదుగా డి. గోవిందరెడ్డి స్వీకరించారు.

ఈ సందర్భంగా సూర్యోదయ సంస్థ ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజంలో అవసరమైన వారికి సహాయం అందించాలని సంకల్పం వ్యక్తం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
జారి పడుతున్న బండ రాళ్లు ప్రమాద భరితంగా పానకాల స్వామి ఘాట్ రోడ్డు
*జారిపడుతోన్న బండరాళ్లు*   *-ప్రమాద భరితంగా పానకాల స్వామి ఘాట్ రోడ్డు మార్గం*  ...
By Rajini Kumari 2025-12-24 07:54:24 0 186
Telangana
పేద విద్యార్థుల స్కూల్ ఫీజులను చెల్లించి తన 'ఉదారత' ను చాటుకున్న బిజెపి నాయకురాలు.|
మేడ్చల్ మల్కాజ్గిరిజిల్లా : కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి మరియు బండి సంజయ్ ల ను అనుసరిస్తూ మచ్చ...
By Sidhu Maroju 2025-11-18 09:12:14 0 156
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com