సూర్యోదయ సంస్థకు మదర్ థెరిస్సా జాతీయ అవార్డు

0
996

మార్కాపురం:

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్కాపురం పట్టణంలోని గోశ సత్యనారాయణ కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో సూర్యోదయ సంస్థకు మదర్ థెరిస్సా జాతీయ అవార్డు ప్రదానం చేశారు.

గ్లోబల్ హెల్త్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ గోట్టి ముక్కల చెన్నకేశవులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో విశిష్ట సామాజిక సేవలు అందిస్తున్న స్వచ్ఛంద సంస్థలను సన్మానించారు. రక్తదాన శిబిరాల నిర్వహణ, థలసేమియా పిల్లలకు రక్తం అందించడం, వృద్ధాశ్రమాల్లో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం, పేదలకు ఆహారం అందించడం వంటి సేవలను గుర్తించి సూర్యోదయ సంస్థకు ఈ అవార్డును అందజేశారు.

ఈ అవార్డును గ్లోబల్ హెల్త్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చెన్నకేశవులు, ప్రముఖులు పి.వి.సి. అంజనీ కుమారి (హైకోర్టు సూపరింటెండెంట్, హైదరాబాద్), జి. గోవింద్ (టీచర్, రైటర్, యాక్టర్), జి. చెన్నకేశవులు (ఇన్ఫోటెక్ సీఈవో, బెంగళూరు), రాధా (స్టేట్ మెంబర్, వాసవి క్లబ్), మాజీ గవర్నర్ కిరణ్ కుమార్ గంగిశెట్టి, ఎం. నాగిరెడ్డి చేతుల మీదుగా డి. గోవిందరెడ్డి స్వీకరించారు.

ఈ సందర్భంగా సూర్యోదయ సంస్థ ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజంలో అవసరమైన వారికి సహాయం అందించాలని సంకల్పం వ్యక్తం చేశారు.

Search
Categories
Read More
Telangana
జూన్ 2 నుంచి రైళ్లలో పురుషులకు ఉచిత ప్రయాణ
హైదరాబాద్ మహానగరం లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం...
By Pinnehasan Odela 2026-04-19 06:51:02 0 295
Karnataka
Karnataka Strengthens Police and Cyber Security Systems
Karnataka is enhancing its policing capabilities through modernization initiatives and stronger...
By Fathima Safa 2026-06-27 12:48:23 0 124
Maharashtra
Maharashtra Advances Governance Reforms Through Review
The Maharashtra government is undertaking a comprehensive review of administrative procedures...
By Navya Sree 2026-06-26 06:48:11 0 45
Telangana
దీర్ఘ కాల సమస్యలకు శాశ్వత పరిష్కారం
దీర్ఘ కాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించించిన యూత్ ఐకాన్ పొన్నం సునీత అనీల్ గౌడ్ గారు...
By Bouth Arun 2026-01-17 18:38:43 0 513
Andhra Pradesh
మదనపల్లెలో కిలో టమాటా రూ. 34
మదనపల్లె టమాటా మార్కెట్లో బుధవారం టమాటా ధరలు నిలకడగా కొనసాగాయి. రైతులు 1,440 మెట్రిక్ టన్నుల...
By Pagadala Venkateswar 2026-06-11 05:24:18 0 74
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com