Tirumala: తిరుమలకు వెళుతున్న కారులో అలిపిరి వద్ద భారీగా నగదు స్వాధీనం.

0
211

అలిపిరి వద్ద సాధారణ తనిఖీల్లో రూ.60 లక్షల నగదును గుర్తించిన విజిలెన్స్ సిబ్బంది

నాణేల మార్పిడి కోసం నగదును తీసుకెళుతున్నట్టు చెప్పిన వ్యక్తి

సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల రద్దీ కొనసాగుతున్న వేళ, అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద భారీ మొత్తంలో నగదు పట్టుబడటం కలకలం రేపింది. టీటీడీ విజిలెన్స్ విభాగం నిర్వహించిన సాధారణ తనిఖీల్లో ఒక కారులో అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.60 లక్షల నగదును అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

 

 

 

ఈ ఉదయం ఒక వ్యక్తి తన కారులో తిరుమల కొండపైకి వెళుతుండగా, అలిపిరి వద్ద విజిలెన్స్ సిబ్బంది వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. ఈ క్రమంలో కారులో దాచి ఉంచిన కరెన్సీ కట్టలు బయటపడ్డాయి. దీనిపై విజిలెన్స్ అధికారులు సదరు వ్యక్తిని నిలదీయగా, తిరుమలలో నాణేల మార్పిడి కోసం ఈ నగదును తీసుకెళుతున్నట్టు పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది.

 

 

అంత భారీ మొత్తానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేదా బ్యాంకు పత్రాలు చూపకపోవడంతో, విజిలెన్స్ అధికారులు నగదుతో పాటు సదరు వ్యక్తిని అలిపిరి పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చింది? దీని అసలు యజమాని ఎవరు? నిజంగానే నాణేల కోసమా లేక ఇతర రాజకీయ లేదా వ్యాపార లావాదేవీల కోసమా? అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే తిరుమలలో పలు ఘటనలు చర్చనీయాంశంగా మారిన తరుణంలో, ఈ భారీ నగదు పట్టుబడటం మరిన్ని ప్రశ్నలకు దారితీస్తోంది.

Search
Categories
Read More
Andhra Pradesh
చీరాల అన్నా క్యాంటీన్‌కు రెండవ స్థానం – ప్రతిష్ఠాత్మక విజయం
చీరాల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న అన్నా క్యాంటీన్ పథకం ద్వారా...
By Gadiyapudi Narendra 2026-02-18 16:37:52 0 161
Andhra Pradesh
Chandrababu Naidu: రేపు నెల్లూరు, కడప జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన.
ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు (ఏప్రిల్ 1) నెల్లూరు, కడప జిల్లాల్లో పర్యటించనున్నారు. ఒకే రోజు రెండు...
By Pagadala Venkateswar 2026-03-31 10:47:35 0 126
Andhra Pradesh
Chandrababu Naidu: పొగాకు ముడి ఉత్పత్తులపై పన్ను సున్నా.. కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించిన ఏపీ!
అన్ బ్రాండెడ్ ముడి పొగాకుపై సున్నా శాతం సుంకం బ్రాండెడ్ ఉత్పత్తులకు 18 శాతం ఎక్సైజ్ డ్యూటీ...
By Pagadala Venkateswar 2026-02-04 07:48:31 0 124
Andhra Pradesh
పామూరు మండలంలో హుండీ చోరీ
#పామూరు: ఆలయాల్లో దొంగతనం   పామూరు మండలం తూర్పు కట్టకింద పల్లిలోని శిర్డీ సాయిబాబా,...
By Balaji Reddy 2025-12-19 04:38:51 1 518
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com