ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ మంత్రి బెల్లంపల్లి శ్రీనివాసరావు

0
135

విజయవాడ

09-03-2026

 

ప్రచురణార్ధం

 

భవానీపురం రజ మసీద్ లో ఇఫ్తార్ విందు

 

పాల్గొన్న మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, శాసనమండలి సభ్యులు ఎండి రుహుల్లా 

 

స్థానిక భవానీపురంలోని స్వాతి ధియేటర్ వద్ద గల రజ మసీద్ నందు సోమవారం నాడు ముస్లిం సోదరుల పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని స్థానిక 41వ డివిజన్ కార్పొరేటర్ మొహమ్మద్ ఇర్ఫాన్ మరియు మసీద్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఇఫ్తార్ ఘనంగా నిర్వహించబడింది.

 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మాజీ మంత్రివర్యులు మరియు విజయవాడ పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు, శాసనమండలి సభ్యులు ఎండి రుహుల్లా హాజరయ్యారు. ముందుగా వారు ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, ఐకమత్యంతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా వెలంపల్లి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసం క్రమశిక్షణకు, దాతృత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు 

 

ఈ కార్యక్రమంలో మసీద్ కమిటీ సభ్యులు రఫీ, జి ఎంసి బాషా, రసూల్, గౌస్, బక్షు, సాదిక్, ఖలీం, ఉస్మాన్, పార్టీ నాయకులు షేక్ హయత్, రెహమాన్, ఇషాక్, బడేమియ మరియు తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లెలో భర్త ఇంటి ముందర భార్య ధర్నా
మదనపల్లెలోని ప్రశాంత్ నగర్ లో ఆదివారం భర్త కృష్ణ ఇంటి ముందు భార్య రోజా రాణి ధర్నాకు దిగింది. భర్త...
By Pagadala Venkateswar 2026-01-25 12:33:40 0 132
Andhra Pradesh
చొల్లంగి వద్ద గుర్తుతెలియని మృతదేహం లభ్యం
పోలీసుల దర్యాప్తు ప్రారంభం తాళ్లరేవు, తాళ్లరేవు మండలం చొల్లంగి రోడ్డుపక్కన బుధవారం రాత్రి...
By Ratna Sekhar 2026-02-19 18:42:45 0 101
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పోలీస్ సర్కిల్ పరిధిలో ఏడు బ్లాక్ స్పాట్లను గుర్తించినట్లు సీఐ సుబ్బారాయుడు ఆదివారం తెలిపారు.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పోలీస్ సర్కిల్ పరిధిలో ఏడు బ్లాక్ స్పాట్లను గుర్తించినట్లు సీఐ...
By Kothuru Murali 2026-01-11 11:27:17 0 129
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com