ఖాకీల "సైబర్ వసూళ్లు" ఎల్బీనగర్ చౌరస్తాలో ఏసీబీ అధికారుల మెరుపు దాడి -ఇద్దరు పోలీసుల అరెస్టు .|

0
133

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : (ఎల్బీనగర్) లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ఇద్దరు రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్లు (RSIs) ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. 

మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఆర్‌ఎస్‌ఐలు ప్రమోద్ కుమార్ గౌడ్, జటావత్ బాబు నాయక్ ఒక సైబర్ క్రైమ్ కేసులో నిందితుడిని అరెస్ట్ చేయకుండా ఉండేందుకు (నోటీసు ఇచ్చేందుకు) లక్ష రూపాయలు డిమాండ్ చేశారు.

బాధితుడు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన ఏసీబీ రేంజ్-2 అధికారులు పథకం ప్రకారం ఎల్బీనగర్ చౌరస్తాలో మాటు వేశారు.

లంచం డబ్బులు తీసుకుంటుండగా ఇద్దరు అధికారులను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి వద్ద నుండి లంచం సొమ్మును స్వాధీనం చేసుకుని, అదుపులోకి తీసుకున్నారు. 

ఈ ఘటన స్థానికంగా పోలీసు వర్గాల్లో సంచలనం సృష్టించింది. నిందితులను ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు.

 

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
చిత్తరయ్య అండ్ రెడ్డి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ 25వ సంవత్సర వేడుకలు. కాలనీ టూల్ రూంను ప్రారంభించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  వెంకటాపురం డివిజన్లోని చిత్తరయ్య అండ్ రెడ్డి కాలనీ వెల్ఫేర్...
By Sidhu Maroju 2025-08-24 15:58:26 0 522
Andhra Pradesh
పారాది వంతెన నిర్మాణ పనులు పూర్తి చేయాలి
పారాది వంతెన నిర్మాణ పనులు వేగవంతం చేసి పూర్తి చేయాలని ఆర్అండ్బి అధికారులను ఎమ్మెల్యే బేబినాయన...
By Boiena Rajesh 2026-03-18 14:50:28 0 206
Andhra Pradesh
నల్లమోతువారిపాలెం గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన సంతోష దాయకం..... ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు*
బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన...
By Vadlamudi NagaVenkat 2026-03-09 14:49:05 0 694
Telangana
Saraswathi antya puskharalu
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పవిత్ర త్రివేణీ సంగమ క్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి...
By G k Nookala 2026-05-18 18:02:43 0 41
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com