తెలుగు పద్యాల పోటీల్లో మెరిసిన విద్యార్థులు

0
416

​మహబూబాబాద్/కొత్తగూడ, ఫిబ్రవరి 21(భారత్ ఆవాజ్):

మాతృభాష మనిషికి ప్రాణం వంటిదని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని దొరవారివేంపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (MPPS) ప్రధానోపాధ్యాయులు సువర్ణపాక కృష్ణ అన్నారు. శనివారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలో విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. వారు మాట్లాడుతూ..... మాతృభాషలో విద్యాభ్యాసం చేయడం వల్ల సృజనాత్మకత పెరుగుతుందని, తెలుగు భాషా గొప్పతనాన్ని చాటిచెప్పారు.

​"మన సంస్కృతికి, మూలాలకు ప్రాణం పోసేది మన మాతృభాష మాత్రమే. ఇలాంటి పోటీలు పిల్లల్లో భాషా పటిమను పెంచుతాయి."విద్యార్థులలో తెలుగు భాషపై మక్కువ పెంచేందుకు "తెలుగు పద్యాల పోటీలు" నిర్వహించారు. విద్యార్థులు శతక పద్యాలను అనర్గళంగా ఆలపించి అందరినీ ఆకట్టుకున్నారు.పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.​ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కృష్ణా రెడ్డి, భారతి, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అమరావతిలో తొలిసారి నిర్వహించిన గణతంత్ర వేడుకలు అద్భుతం •
అమరావతిలో తొలిసారి నిర్వహించిన గణతంత్ర వేడుకలు అద్భుతం   • రాజ్యాంగ స్ఫూర్తిని...
By Chennaiah Kati 2026-01-26 16:20:31 0 172
Andhra Pradesh
పుంగనూరు: 'అంబులెన్స్‌కు ఫోన్ చెయ్యలేదు.. ఆ వార్త అవాస్తవం'
పుంగనూరు మండలం మేళందొడ్డి గ్రామానికి చెందిన నారాయణమ్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమె భర్త రామయ్య...
By Kothuru Murali 2026-02-25 11:08:34 0 105
Andhra Pradesh
మంగళం లో రాజముద్ర తో కూడిన పాస్ పుస్తకాలు పంపిణీ
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, మంగళం గ్రామపంచాయతీలో శుక్రవారం మధ్యాహ్నం రైతులకు రాష్ట్ర...
By Kothuru Murali 2026-01-02 13:06:01 0 153
Prop News
Be Seen. Be Trusted. Be a PropMate.
Personal Branding for Real Estate: How to Position Yourself Authentically In today’s real...
By Bharat Aawaz 2025-06-26 05:56:59 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com