కౌకూరు లో నిన్నంటిన మహిళ దినోత్సవం సంబరాలు.|

0
139

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అల్వాల్ సర్కిల్ పరిధిలోని కౌకూర్ శిలాయం ఆలయ ప్రాంగణంలో మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. 

స్థానిక నాయకులు లక్ష్మణ్ యాదవ్ (బండారి లావణ్య లక్ష్మణ్ యాదవ్) మరియు వారి బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి.. మాట్లాడుతూ, సమాజంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, వారు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. 

మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి.. మాట్లాడుతూ, ప్రతి మహిళా తన శక్తిని గుర్తించి అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. 

అనంతరం వేడుకల్లో భాగంగా వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన మహిళలను మరియు ఆశా వర్కర్లను అతిథులు శాలువాలతో ఘనంగా సన్మానించి, జ్ఞాపికలను అందజేశారు. నిర్వాహకులు లక్ష్మణ్ యాదవ్ బృందం మహిళలకు చీరల పంపిణీ చేశారు. 

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో స్థానిక మహిళలు పాల్గొన్నారు. 

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
కాలనీలను అభివృద్ధి చేసే బాధ్యత నాది: కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్
సికింద్రాబాద్ :   కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గురువారం వార్డు 7 పరిధిలోని IOB...
By Sidhu Maroju 2025-09-11 16:14:07 0 285
Andhra Pradesh
నిజాయితీ చాటుకున్న ఆటో *డ్రైవర్
చీరాల: బాపట్ల జిల్లా చీరాల మండలంలోని సాల్మన్ సెంటర్ సమీపంలోని హైమ ఆసుపత్రి వద్ద నుండి ఒక మహిళ...
By Gadiyapudi Narendra 2026-02-21 07:14:22 0 156
Andhra Pradesh
మదనపల్లి కిడ్నీ రాకెట్ కేసులో మరో నిందితుడు అరెస్ట్: డీఎస్పీ.
మదనపల్లిలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు మరో నిందితుడిని అరెస్టు చేశారు....
By Pagadala Venkateswar 2026-02-15 05:43:51 0 128
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com