కౌకూరు లో నిన్నంటిన మహిళ దినోత్సవం సంబరాలు.|

0
140

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అల్వాల్ సర్కిల్ పరిధిలోని కౌకూర్ శిలాయం ఆలయ ప్రాంగణంలో మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. 

స్థానిక నాయకులు లక్ష్మణ్ యాదవ్ (బండారి లావణ్య లక్ష్మణ్ యాదవ్) మరియు వారి బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి.. మాట్లాడుతూ, సమాజంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, వారు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. 

మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి.. మాట్లాడుతూ, ప్రతి మహిళా తన శక్తిని గుర్తించి అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. 

అనంతరం వేడుకల్లో భాగంగా వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన మహిళలను మరియు ఆశా వర్కర్లను అతిథులు శాలువాలతో ఘనంగా సన్మానించి, జ్ఞాపికలను అందజేశారు. నిర్వాహకులు లక్ష్మణ్ యాదవ్ బృందం మహిళలకు చీరల పంపిణీ చేశారు. 

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో స్థానిక మహిళలు పాల్గొన్నారు. 

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఓపెన్ నాలా పనుల ప్రారంభోత్సవంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా:  బోయిన్ పల్లి వార్డు 6 అరవెల్లి ఎన్క్లేవ్, రాయల్ ఎన్క్లేవ్...
By Sidhu Maroju 2025-08-17 07:39:47 0 575
Telangana
కాంగ్రెస్ పార్టీ లో చేరిన బిఆర్ఎస్ నాయకులు
నస్పూర్ కార్పొరేషన్ పరిధిలో 37వ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ ఇక్బాల్ ...
By Avunoori Mahesh 2026-04-26 12:56:07 0 141
Andhra Pradesh
సీఎం సమీక్షకు హాజరైన అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీ.
అమరావతిలో సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అన్నమయ్య జిల్లా అభివృద్ధిపై...
By Pagadala Venkateswar 2026-02-17 05:25:18 0 133
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com