కౌకూరు లో నిన్నంటిన మహిళ దినోత్సవం సంబరాలు.|

0
109

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అల్వాల్ సర్కిల్ పరిధిలోని కౌకూర్ శిలాయం ఆలయ ప్రాంగణంలో మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. 

స్థానిక నాయకులు లక్ష్మణ్ యాదవ్ (బండారి లావణ్య లక్ష్మణ్ యాదవ్) మరియు వారి బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి.. మాట్లాడుతూ, సమాజంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, వారు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. 

మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి.. మాట్లాడుతూ, ప్రతి మహిళా తన శక్తిని గుర్తించి అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. 

అనంతరం వేడుకల్లో భాగంగా వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన మహిళలను మరియు ఆశా వర్కర్లను అతిథులు శాలువాలతో ఘనంగా సన్మానించి, జ్ఞాపికలను అందజేశారు. నిర్వాహకులు లక్ష్మణ్ యాదవ్ బృందం మహిళలకు చీరల పంపిణీ చేశారు. 

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో స్థానిక మహిళలు పాల్గొన్నారు. 

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
ఎన్టీఆర్ కి ఘనంగా నివాళులర్పించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు
ఈరోజు రాయచోటి పట్టణంలో పలుచోట్ల ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రముఖులు ...
By Benguluri Madhubabu 2026-01-18 07:17:01 0 263
Telangana
అయ్యప్పల పాదయాత్ర- ప్రారంభించిన ఎమ్మెల్యే తలసాని
సికింద్రాబాద్ : అయ్యప్ప స్వామి మాలధారణ ఎన్నో జన్మల పుణ్యఫలం అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే...
By Sidhu Maroju 2025-10-17 11:05:03 0 221
Andhra Pradesh
తిరుపతి జీల్లాలో గూడూరు ఔట్, రైల్వే కోడూరు ఇన్
జిల్లాల పునర్విభజన పై సిఎం చంద్రబాబు నాయుడు చర్చించి నట్లు తెలుస్తోంది.ఈసమావేశంలో మంత్రులు...
By Karapati Gopi 2025-12-27 14:53:57 0 399
Andhra Pradesh
మాజీ సీఎం ని కలిసిన రహుల్ల గారు
మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా గారు ...
By Rajini Kumari 2026-01-09 10:19:46 0 114
Andhra Pradesh
విజయవాడ ఎమ్మెల్సీ ఎండి రహుల్ల కార్యాలయం వద్ద గణతంత్ర వేడుకలు
విజయవాడ ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా గారి కార్యాలయం నందు 77 వ గణతంత్ర దినోత్సవం వేడుకలు 59 వ డివిజన్...
By Rajini Kumari 2026-01-26 08:00:33 0 180
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com