గంగయ్య బస్తీలో త్వరలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం - ఎమ్మెల్యే శ్రీ గణేష్ హామీ.|

0
139

 

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 7వ వార్డు పరిధిలో ఉన్న గంగయ్య బస్తీ వాసుల దశాబ్దాల కలను నెరవేరుస్తూ, అక్కడ త్వరలోనే నూతనంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడతామని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ప్రకటించారు. 

35 ఏళ్ల క్రితం ప్రభుత్వం నిర్మించిన ఈ ఇళ్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారడంతో, బస్తీ వాసుల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే సోమవారం అక్కడ పర్యటించారు.

తిరుమలగిరి తహసీల్దార్ భిక్షపతితో కలిసి బస్తీలోని శిథిలమైన ఇళ్లను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బస్తీ వాసులందరూ ఏకగ్రీవంగా అంగీకరిస్తే, పాత ఇళ్లను కూల్చివేసి ఆధునిక వసతులతో ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వంతో చర్చించి, అధికారుల సమన్వయంతో త్వరలోనే భూమి పూజ చేసి, నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

ఎమ్మెల్యే స్వయంగా వచ్చి తమ సమస్యను గుర్తించడమే కాకుండా, కొత్త ఇళ్లు నిర్మిస్తామని చెప్పడంతో బస్తీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ పర్యటనలో ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ నాయకులు సరిత, మురళీ ముదిరాజ్, జూలియస్ పాస్టర్ మరియు ఇతర ముఖ్య నాయకులు ఉన్నారు.

#sidhumaroju

Alwal 

 

 

 

Search
Categories
Read More
Andhra Pradesh
ACB Raids At Madanapalle DEO Office |మదనపల్లి డీఈఓ కార్యాలయంలో ఏసీబీ దాడులు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో డీఈఓ కార్యాలయంలో స్కూల్ అప్గ్రేడేషన్ అనుమతుల కోసం లంచం తీసుకుంటుండగా...
By Pagadala Venkateswar 2026-01-22 06:44:00 0 192
Andhra Pradesh
శ్రీ శక్తి అమ్మ స్వామి ఆశీర్వాదాలు పొందిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
తమిళనాడులోని వేలూరు లో ఉన్న శ్రీ లక్ష్మీ నారాయణి గోల్డెన్ టెంపుల్ సృష్టికర్త శ్రీ శక్తి అమ్మ...
By Benguluri Madhubabu 2026-04-18 14:08:27 0 155
Telangana
Heartfelt Congratulations!
Proud moment as Padmini has secured an impressive Rank 4191 in TG LAWCET 2025 (LL.B. 5 Years)...
By Sidhu Maroju 2025-06-26 11:15:39 1 2K
Andhra Pradesh
ఓటర్ల జాబితా సవరణకు సహకరించాలి
రాజకీయ పార్టీ నాయకులు ఓటట్ల జాబితా సవరణకు సహకరించాలని ఎమ్మార్వో ఎం.శ్రీను, ఎన్నికల డీటీ...
By Boiena Rajesh 2026-04-08 01:44:45 0 149
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com