గంగయ్య బస్తీలో త్వరలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం - ఎమ్మెల్యే శ్రీ గణేష్ హామీ.|

0
178

 

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 7వ వార్డు పరిధిలో ఉన్న గంగయ్య బస్తీ వాసుల దశాబ్దాల కలను నెరవేరుస్తూ, అక్కడ త్వరలోనే నూతనంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడతామని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ప్రకటించారు. 

35 ఏళ్ల క్రితం ప్రభుత్వం నిర్మించిన ఈ ఇళ్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారడంతో, బస్తీ వాసుల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే సోమవారం అక్కడ పర్యటించారు.

తిరుమలగిరి తహసీల్దార్ భిక్షపతితో కలిసి బస్తీలోని శిథిలమైన ఇళ్లను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బస్తీ వాసులందరూ ఏకగ్రీవంగా అంగీకరిస్తే, పాత ఇళ్లను కూల్చివేసి ఆధునిక వసతులతో ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వంతో చర్చించి, అధికారుల సమన్వయంతో త్వరలోనే భూమి పూజ చేసి, నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

ఎమ్మెల్యే స్వయంగా వచ్చి తమ సమస్యను గుర్తించడమే కాకుండా, కొత్త ఇళ్లు నిర్మిస్తామని చెప్పడంతో బస్తీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ పర్యటనలో ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ నాయకులు సరిత, మురళీ ముదిరాజ్, జూలియస్ పాస్టర్ మరియు ఇతర ముఖ్య నాయకులు ఉన్నారు.

#sidhumaroju

Alwal 

 

 

 

Search
Categories
Read More
SURAKSHA
Dial 112 Upgrade Helps West Bengal Police Reach You in Minutes
Content 90 words: West Bengal Police modernized Dial 112 emergency service for instant help. When...
By Kalaga Sailaja 2026-07-01 12:52:40 0 61
Telangana
జనసేవకుడు పెద్దపురం నరసింహకు డాక్టరేట్ పురస్కారం.
గత 15 సంవత్సరాలుగా పుట్టిన బిడ్డ నుండి పండు ముసలి వాళ్ల వరకు నిరంతరం సేవ చేస్తూ.. ముందు వరసలో...
By Sidhu Maroju 2025-06-16 18:12:46 2 2K
Jammu & Kashmir
Amarnath Yatra Security: Routes Declared "No-Fly Zone" Ahead of Key Meet
The Jammu and Kashmir administration has declared all Amarnath Yatra pilgrimage corridors as...
By Tejaswini Komanduru 2026-06-05 06:25:57 0 69
Andhra Pradesh
టిడిపి ఎమ్మెల్యే తామస్ సంచలన వ్యాఖ్యలు
టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వాఖ్యలు   ఎస్సీ ఎమ్మెల్యేలపై వివక్షత.. గెలిపించేటప్పుడు...
By Rajini Kumari 2026-04-24 13:22:29 0 167
Andhra Pradesh
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ.. 9 మందికి రూ.4.95 లక్షల ఆర్థిక సాయం అందజేసిన డా. గొట్టిపాటి లక్ష్మీ
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ.. 9 మందికి రూ.4.95 లక్షల ఆర్థిక సాయం అందజేసిన డా. గొట్టిపాటి...
By Chennaiah Kati 2026-07-02 03:30:28 0 42
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com