ఎంపీ శివనాద్ కార్యాలయంలో రెటంపల్లి శ్యామ్ కి సన్మానం

0
112

*ప్ర‌చుర‌ణార్థం* *05-03-2026*

 

*కష్టపడి పనిచేసే వారికి టిడిపిలో గుర్తింపు తధ్యం*

 

*టిఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పాల మాధవ్*

 

*ఎంపీ కేశినేని శివ‌నాథ్ క్యాంపు కార్యాల‌యంలో రెంట‌ప‌ల్లి శ్యామ్ కి స‌న్మానం*

 

*ఇటీవ‌ల ఏపీ మినియం వేజేస్ అడ్వయిజరీ బోర్డు డైరెక్టర్ నియామ‌కం*

 

విజ‌య‌వాడ : కష్టపడి పనిచేసే వారికి తెలుగుదేశం పార్టీలో గుర్తింపు తధ్యం అని టిఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, విజయవాడ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు పాల మాధవ్ అన్నారు. టిడిపి అనుబంధ టిఎన్‌టీయూసీలో క్రియాశీలకంగా పనిచేస్తూ ఇటీవల ఏపీ మినియం వేజేస్ అడ్వయిజరీ బోర్డు డైరెక్టర్‌గా నియమితులైన రెంటపల్లి శ్యామ్‌కు టిఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు.

 

 పశ్చిమ నియోజకర్గంలో ఉన్న విజయవాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాల మాధవ్ ముందుగా నూతనంగా రాష్ట్ర స్థాయిలో డైరెక్టర్‌గా నియమితులైన శ్యామ్‌ను సత్కరించి అభినందనలు తెలిపారు. కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు టిడిపి పార్టీలోనే సాధ్యమన్నారు. టిఎన్‌టీయూసీలో బాధ్యతాయుంతంగా పనిచేస్తూ కార్మికుల సంక్షేమం దిశగా కష్టపడి పనిచేసిన శ్యామ్‌కు పార్టీ నాయకత్వం పదవిని అప్పగించడం జరిగిందని వివరించారు.

 

తనకు పదవి వచ్చేందుకు సహకరించిన ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)కు, టీఎన్‌టీయూసీ రాష్ట్ర నాయకత్వంకు శ్యామ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు కొట్టేటి హనుమంతరావు, కామా దేవరాజ్, టీఎన్‌టీయూసీ పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షులు బాస్కర్, పశ్చిమ నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు పైడిమాల సుభాషిణి, విజ‌య‌వాడ అర్బ‌న్ ఎస్సీ సెల్ మాజీ అధ్య‌క్షుడు జీవీ న‌ర‌సింహారావు, విజ‌య‌వాడ మార్కెట్ యార్డ్ డైరెక్ట‌ర్ మైల‌ప‌ల్లి రాజు, నాయకులు చిల్లా వెంకటేష్, పద్మ, రాజు, సీతారామయ్య, విజ‌య్ ల‌తో పాట‌ తదితరులు పాల్గొన్నారు.

Like
1
Search
Categories
Read More
Telangana
క్యాబా.. కోర్టా..? మా డాడీ ఎవరో తెలుసా అంటే కుదరదు.. మందుబాబులకు సీపీ సజ్జనార్ మాస్ వార్నింగ్
వాస్తవానికి కొత్త సంవత్సరం వస్తోందంటే చాలు.. నగరంలో జోష్ ఎంత ఉంటుందో, పోలీసుల పహారా అంతకు మించి...
By SivaNagendra Annapareddy 2025-12-29 05:39:47 0 353
Andhra Pradesh
Chandrababu Naidu: ఏపీలో గ్యాస్ కొరత లేదు, ప్రజలు ఆందోళన చెందవద్దు: సీఎం చంద్రబాబు.
ఇరాన్ యుద్ధం నేపథ్యంలో, రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ నిల్వలు, సరఫరాపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత...
By Pagadala Venkateswar 2026-03-17 11:42:36 0 87
Telangana
సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న కేసీఆర్
సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న కేసీఆర్ తెలంగాణ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సనకరాయాంటీ వేడుకల్లో...
By Pinnehasan Odela 2026-01-15 14:19:08 0 171
Andhra Pradesh
కష్టపడి పని చేసే కార్యకర్తలకు గుర్తింపు: బొబ్బిలి ఎమ్మెల్యే
టీడీపీ కోసం కస్టపడి పనిచేసే కార్యకర్తలకు మంచి గుర్తింపు వస్తుందని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు....
By Boiena Rajesh 2026-03-29 23:16:42 0 97
Andhra Pradesh
సోమలలో వైద్యానికి వచ్చి వ్యక్తి మృతి
వైద్యం కోసం వచ్చి అదుపుతప్పి కిందపడి వ్యక్తి మృతిచెందిన ఘటన మండల కేంద్రంలో జరి గింది. ఆవులపల్లె...
By Pagadala Venkateswar 2026-01-15 07:17:41 0 115
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com