ఎంపీ శివనాద్ కార్యాలయంలో రెటంపల్లి శ్యామ్ కి సన్మానం

0
143

*ప్ర‌చుర‌ణార్థం* *05-03-2026*

 

*కష్టపడి పనిచేసే వారికి టిడిపిలో గుర్తింపు తధ్యం*

 

*టిఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పాల మాధవ్*

 

*ఎంపీ కేశినేని శివ‌నాథ్ క్యాంపు కార్యాల‌యంలో రెంట‌ప‌ల్లి శ్యామ్ కి స‌న్మానం*

 

*ఇటీవ‌ల ఏపీ మినియం వేజేస్ అడ్వయిజరీ బోర్డు డైరెక్టర్ నియామ‌కం*

 

విజ‌య‌వాడ : కష్టపడి పనిచేసే వారికి తెలుగుదేశం పార్టీలో గుర్తింపు తధ్యం అని టిఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, విజయవాడ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు పాల మాధవ్ అన్నారు. టిడిపి అనుబంధ టిఎన్‌టీయూసీలో క్రియాశీలకంగా పనిచేస్తూ ఇటీవల ఏపీ మినియం వేజేస్ అడ్వయిజరీ బోర్డు డైరెక్టర్‌గా నియమితులైన రెంటపల్లి శ్యామ్‌కు టిఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు.

 

 పశ్చిమ నియోజకర్గంలో ఉన్న విజయవాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాల మాధవ్ ముందుగా నూతనంగా రాష్ట్ర స్థాయిలో డైరెక్టర్‌గా నియమితులైన శ్యామ్‌ను సత్కరించి అభినందనలు తెలిపారు. కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు టిడిపి పార్టీలోనే సాధ్యమన్నారు. టిఎన్‌టీయూసీలో బాధ్యతాయుంతంగా పనిచేస్తూ కార్మికుల సంక్షేమం దిశగా కష్టపడి పనిచేసిన శ్యామ్‌కు పార్టీ నాయకత్వం పదవిని అప్పగించడం జరిగిందని వివరించారు.

 

తనకు పదవి వచ్చేందుకు సహకరించిన ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)కు, టీఎన్‌టీయూసీ రాష్ట్ర నాయకత్వంకు శ్యామ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు కొట్టేటి హనుమంతరావు, కామా దేవరాజ్, టీఎన్‌టీయూసీ పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షులు బాస్కర్, పశ్చిమ నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు పైడిమాల సుభాషిణి, విజ‌య‌వాడ అర్బ‌న్ ఎస్సీ సెల్ మాజీ అధ్య‌క్షుడు జీవీ న‌ర‌సింహారావు, విజ‌య‌వాడ మార్కెట్ యార్డ్ డైరెక్ట‌ర్ మైల‌ప‌ల్లి రాజు, నాయకులు చిల్లా వెంకటేష్, పద్మ, రాజు, సీతారామయ్య, విజ‌య్ ల‌తో పాట‌ తదితరులు పాల్గొన్నారు.

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లెలో రోడ్డు ప్రమాదం – ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు.
ఆటో రిపేర్ కోసం మదనపల్లెకు వచ్చిన ఆటో డ్రైవర్ వెంకటరమణ (60) శుక్రవారం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా...
By Pagadala Venkateswar 2026-04-03 12:52:33 0 126
Andhra Pradesh
ఏపీలో మరో ఘోర ప్రమాదం.. పూర్తిగా కాలిపోయిన కావేరి ట్రావెల్స్ బస్సు.
హైదరాబాద్ నుంచి తిరుపతి వెళుతున్న కావేరి ట్రావెల్స్ బస్సు ప్రకాశం జిల్లా రాజుపాలెం వద్ద...
By Pagadala Venkateswar 2026-05-15 06:03:08 0 49
Andhra Pradesh
పుంగనూరు: మాసమ్మ జాతరకు159 ఏళ్ల చరిత్ర.. రేపే జాతర.
పుంగనూరు మండలం కొండచర్ల గ్రామంలో ప్రతిష్టాత్మకంగా జరిగే మసెమ్మ జాతరకు గ్రామస్థులు ముమ్మరంగా...
By Kothuru Murali 2026-01-30 09:16:16 0 133
Telangana
మెదక్ జిల్లాలోని చర్చలలో పిస్ట్ సెలబ్రేషన్స్కు 34 లక్షల మంజూరు... జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్ జిల్లా రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ పండగను పురస్కరించుకొని మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్...
By Gangaram Rangagowni 2025-12-25 02:18:06 0 212
Andhra Pradesh
మదనపల్లి లో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు ప్రజలు సహకరించాలి.
మదనపల్లిలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు మంగళవారం పోలీసులు ప్రత్యేక...
By Pagadala Venkateswar 2026-01-20 11:03:54 0 161
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com