రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం

0
120

*ప్ర‌చుర‌ణార్థం* *05-03-2026*

 

రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దటమే సీఎం చంద్రబాబు లక్ష్యం : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)

 

` ఐదుగురు లబ్ధిదారులకు రూ.12,24,110 విలువైన ఎల్.వో.సి పత్రాలు అందజేత

 

 విజయవాడ : రాష్ట్రంను ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని జయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. పేద ప్రజలు ఆరోగ్య విషయంలో ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎంఆర్ఎఫ్ ద్వారా వారిని ఆదుకుంటున్నారని చెప్పారు. సీఎం చంద్రబాబు ఎపిని అభివృద్ది పథం వైపు నడిపించటంతోపాటు, రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దటమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఎంపీ శివనాథ్ వివరించారు.

 

గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ లో గురువారం సీఎంఆర్ ఎఫ్ కింద మంజూరైన రూ.12,24,110 విలువైన ఎల్.వో.సి పత్రాలను ఎంపి కేశినేని శివనాథ్ ఐదుగురు లబ్ధిదారులకు రాష్ట్ర సాంఘీక సంక్షేమ బోర్డు ఛైర్మన్ పోతుల బాలకోటయ్య, తిరువూరు నియోజకవర్గ పరిశీలకులు సుకాసి శ్రీనివాస్‌లతో కలసి అందజేశారు.

 

 తిరువూరు నియోజకవర్గం ఎ.కొండూరు మండలం చీమలపాడు గ్రామానికి చెందిన బండి శ్రీలక్ష్మీ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండగా ఆమెకు వైద్య చికిత్స కోసం సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.6 లక్షల రూపాయల ఎల్.వో.సి పత్రాన్ని ఆమె కుటుంబసభ్యులకు ఎంపి కేశినేని శివనాథ్ అందజేశారు.

 

అదే విధంగా రోడ్డు ప్రమాదంకు గురై తీవ్ర గాయాల పాలైన తిరువూరు నియోజకవర్గం ఎ కొండూరు మండలం చీమలపాడుకు చెందిన భూక్యా లోకేష్‌కు రూ.1,77,044, అదే గ్రామానికి చెందిన భూక్యా ఉపేంద్ర కు రూ.2,13,916 చొప్పున వైద్య చికిత్స కోసం సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన ఎల్.వో.సి పత్రాలను ఎంపీ శివనాథ్ అందజేశారు.

 

అదే రీతిలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మల్లిఖార్జునపేటకు చెందిన కలవకొల్లు దుర్గాభవానీ మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా ఆమెకు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ1,60,225 విలువైన ఎల్.వో.సి పత్రాన్ని ఎంపీ శివనాథ్ ఆమె కుటుంబసభ్యులకు అందజేశారు. విజయవాడకు చెందిన మేకా శేషగిరిరావు హెర్నీయా సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండగా వైద్య చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.72,925 విలువైన ఎల్ఓసి పత్రాన్ని శేషగిరిరావుకు ఎంపీ అందజేశారు. తమకి సీఎంఆర్ఎఫ్ కింద ఎల్.వో.సిలు మంజూరు అయ్యే విధంగా సాయం చేసిన ఎంపి కేశినేని శివనాథ్ కి లబ్ధిదారులు, లబ్ధిదారుల కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

 

ఈ కార్యక్రమంలో ఎ.కొండూరు మండలం టిడిపి అధ్యక్షులు పీక్లా నాయక్, విజయవాడ మార్కెట్ యార్డు కమిటీ డైరెక్టర్ మైలపల్లి రాజు, ఐటిడిపి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షులు చైతన్యలతో పాటు తిరువూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
అగ్నివీర్ దరఖాస్తుల గడువు పెంపు
హైదరాబాద్/ హైదరాబాద్   నిరుద్యోగులకు మరోసారి శుభవార్త తెలిపింది కేంద్ర ప్రభుత్వం....
By Sidhu Maroju 2025-08-02 18:37:23 0 933
Telangana
స్విమ్మింగ్ పూల్స్‌లో సరదా… భద్రతలో శూన్యం! ప్రాణాలకు ముప్పుగా మారుతున్న నిర్లక్ష్యం”|
హైదరాబాద్ : వేసవి సెలవులు ప్రారంభం కావడంతో నగరంలోని స్విమ్మింగ్ పూల్స్ పిల్లల కేరింతలతో...
By Sidhu Maroju 2026-03-22 08:36:52 0 148
Telangana
భద్రాచలం లో ఉత్తరా ద్వారా దర్శనం
భద్రాచలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైకుంఠ ఏకాదశి సందర్భంగా. ఉత్తర ద్వారా దర్శనం నిర్వహిస్తోంది....
By Karapati Gopi 2025-12-30 01:19:10 0 245
Andhra Pradesh
ఎమ్మెల్యే సారు మన ఎమ్మార్వో ఆఫీస్ ఒక్కసారి చూడు... అంటూ నగర పంచాయతీ ప్రజల ఆవేదన
గూడూరు ఎమ్మార్వో కార్యాలయ నిర్మాణం జరిగేనా,,, మండలం లోని ఎమ్మార్వో కార్యాలయం శిథిలమై దాదాపు 13...
By mahaboob basha 2025-07-23 14:26:13 0 901
Andhra Pradesh
నారాయణ స్కూల్ నూతన భవన ప్రారంభ ఉత్సవంలో పాల్గొన్న రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు
రాయచోటి పట్టణం మాసాపేట వరిగ రోడ్డులో ఈరోజు ఉదయం నూతన భవన ప్రవేశ మహోత్సవం లో పాల్గొన్న రాజంపేట...
By Benguluri Madhubabu 2026-03-08 12:51:03 0 145
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com