రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం

0
150

*ప్ర‌చుర‌ణార్థం* *05-03-2026*

 

రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దటమే సీఎం చంద్రబాబు లక్ష్యం : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)

 

` ఐదుగురు లబ్ధిదారులకు రూ.12,24,110 విలువైన ఎల్.వో.సి పత్రాలు అందజేత

 

 విజయవాడ : రాష్ట్రంను ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని జయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. పేద ప్రజలు ఆరోగ్య విషయంలో ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎంఆర్ఎఫ్ ద్వారా వారిని ఆదుకుంటున్నారని చెప్పారు. సీఎం చంద్రబాబు ఎపిని అభివృద్ది పథం వైపు నడిపించటంతోపాటు, రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దటమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఎంపీ శివనాథ్ వివరించారు.

 

గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ లో గురువారం సీఎంఆర్ ఎఫ్ కింద మంజూరైన రూ.12,24,110 విలువైన ఎల్.వో.సి పత్రాలను ఎంపి కేశినేని శివనాథ్ ఐదుగురు లబ్ధిదారులకు రాష్ట్ర సాంఘీక సంక్షేమ బోర్డు ఛైర్మన్ పోతుల బాలకోటయ్య, తిరువూరు నియోజకవర్గ పరిశీలకులు సుకాసి శ్రీనివాస్‌లతో కలసి అందజేశారు.

 

 తిరువూరు నియోజకవర్గం ఎ.కొండూరు మండలం చీమలపాడు గ్రామానికి చెందిన బండి శ్రీలక్ష్మీ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండగా ఆమెకు వైద్య చికిత్స కోసం సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.6 లక్షల రూపాయల ఎల్.వో.సి పత్రాన్ని ఆమె కుటుంబసభ్యులకు ఎంపి కేశినేని శివనాథ్ అందజేశారు.

 

అదే విధంగా రోడ్డు ప్రమాదంకు గురై తీవ్ర గాయాల పాలైన తిరువూరు నియోజకవర్గం ఎ కొండూరు మండలం చీమలపాడుకు చెందిన భూక్యా లోకేష్‌కు రూ.1,77,044, అదే గ్రామానికి చెందిన భూక్యా ఉపేంద్ర కు రూ.2,13,916 చొప్పున వైద్య చికిత్స కోసం సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన ఎల్.వో.సి పత్రాలను ఎంపీ శివనాథ్ అందజేశారు.

 

అదే రీతిలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మల్లిఖార్జునపేటకు చెందిన కలవకొల్లు దుర్గాభవానీ మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా ఆమెకు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ1,60,225 విలువైన ఎల్.వో.సి పత్రాన్ని ఎంపీ శివనాథ్ ఆమె కుటుంబసభ్యులకు అందజేశారు. విజయవాడకు చెందిన మేకా శేషగిరిరావు హెర్నీయా సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండగా వైద్య చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.72,925 విలువైన ఎల్ఓసి పత్రాన్ని శేషగిరిరావుకు ఎంపీ అందజేశారు. తమకి సీఎంఆర్ఎఫ్ కింద ఎల్.వో.సిలు మంజూరు అయ్యే విధంగా సాయం చేసిన ఎంపి కేశినేని శివనాథ్ కి లబ్ధిదారులు, లబ్ధిదారుల కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

 

ఈ కార్యక్రమంలో ఎ.కొండూరు మండలం టిడిపి అధ్యక్షులు పీక్లా నాయక్, విజయవాడ మార్కెట్ యార్డు కమిటీ డైరెక్టర్ మైలపల్లి రాజు, ఐటిడిపి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షులు చైతన్యలతో పాటు తిరువూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Goa
Goa Monsoon: Orange Alert Issued Amid 34% Rain Deficit
Goa is facing a stark weather paradox as the India Meteorological Department issues an Orange...
By Tejaswini Komanduru 2026-07-01 08:11:10 0 102
Business & Finance
J&K Job Outsourcing Debate Raises Employment Concerns
The outsourcing of more than 22,000 government-related jobs in Jammu and Kashmir has triggered...
By Navya Sree 2026-06-30 05:09:30 0 54
Business & Finance
Monsoon Rainfall to Boost Bihar's Kharif Farming
The India Meteorological Department (IMD) has forecast widespread rainfall and thunderstorms...
By Navya Sree 2026-07-01 07:17:48 0 55
Andhra Pradesh
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వర్థంతి సందర్భంగా గురువారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవనం కమీటీ...
By Rajini Kumari 2026-05-07 08:16:30 0 116
Telangana
"మైనంపల్లి ఆదేశాలతో రంగంలోకి తోట లక్ష్మీకాంత్ రెడ్డి.. కనాజిగూడలో పెండింగ్ పనులపై పాదయాత్ర!"
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా : అల్వాల్ సర్కిల్ 135వ (old) డివిజన్ కనాజిగూడ ఇంద్రనగర్ కాలనీ...
By Sidhu Maroju 2026-05-21 08:22:06 0 127
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com