తూరంగిలో పీ.టి. స్కూల్ గోల్డెన్ జూబిలీ వేడుకలు ఘనంగా

0
873

కాకినాడ సమీపంలోని తూరంగి గ్రామంలో ఉన్న పీ.టి. స్కూల్ (Preachers Training School) స్థాపనకు 50 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహించిన గోల్డెన్ జూబిలీ వేడుకలు మూడు రోజులపాటు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగాయి.

ఈ సందర్భంగా మార్చి 3, 4 తేదీలలో నిర్వహించిన లెక్చర్‌షిప్ కార్యక్రమాల్లో దేవుని వాక్యంపై ఆత్మీయ బోధనలు జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సువార్తికులు, పూర్వ విద్యార్థులు, సంఘ నాయకులు పాల్గొని దేవుని వాక్యాన్ని వివరించారు. సమావేశాలు ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని కలిగించాయి.

మార్చి 5న జరిగిన గోల్డెన్ జూబిలీ ప్రధాన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా పీ.టి. స్కూల్ ప్రారంభ దశ నుండి ఇప్పటి వరకు జరిగిన సేవలను వివరించారు. దేవుని మహాకృపతో గత 50 సంవత్సరాలుగా ఈ సంస్థ ద్వారా అనేకమంది విద్యార్థులు శిక్షణ పొంది వివిధ ప్రాంతాల్లో సువార్త సేవలో కొనసాగుతున్నారని పేర్కొన్నారు.

కార్యక్రమంలో డా. కె.జి. కుమార్ గారిని పలువురు పూలమాలలు, దండలు, కవితలు మరియు ప్రశంసలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా మహిళలకు చీరలు, పురుషులకు బట్టలు, సువార్తికులకు ప్రత్యేక వస్త్రాలు పంపిణీ చేశారు. పాల్గొన్న వారందరికీ విందు కూడా ఏర్పాటు చేశారు.

అదే సమయంలో కొంతమంది సువార్తికులకు సంఘ భవనాల నిర్మాణం కోసం ఆర్థిక సహాయం అందజేశారు. ఐదుగురికి ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున, మరికొందరికి రూ.50 వేల చొప్పున సహాయం అందించారు.

భవిష్యత్తులో కూడా ఈ సేవలు నిరంతరం కొనసాగేందుకు అందరి సహకారం అవసరమని డా. కె.జి. కుమార్ కోరారు. మూడు రోజులపాటు జరిగిన గోల్డెన్ జూబిలీ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య ముగిశాయి.

Search
Categories
Read More
Andhra Pradesh
అమరావతి చట్టబద్ధత బిల్లుపై హర్షం వ్యక్తం చేసిన ముస్లిం సోదరులు
*ప్రచురణార్థం* 02.04.26   _------------------------------   అమరావతికి చట్టబద్ధత...
By Rajini Kumari 2026-04-02 16:23:36 0 199
Telangana
చట్టాలపై అవగాహన పెంచుకోవాలి :జిల్లా రెవెన్యు అదనపు కలెక్టర్ కె.అనిల్ కుమార్
మహబూబాబాద్, డిసెంబర్.24(భారత్ అవాజ్): వినియోగ దారులు తమ హక్కులు, బాధ్యతలపై అవగాహన పెంచుకోవాలని...
By Bheeshman King 2025-12-24 10:45:29 0 325
Telangana
ప్రజా సమస్యల పరిష్కారం కోసమే "కంటోన్మెంట్ వాణి" ఎమ్మెల్యే శ్రీ గణేష్
సికింద్రాబాద్ :  ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు మెరుగైన సేవలను అందించేందుకు కంటోన్మెంట్ వాణి...
By Sidhu Maroju 2025-09-10 11:40:45 0 295
Telangana
Telangana Accelerates IT and Digital Economy Growth
Telangana continues to strengthen its position as one of India's leading technology hubs, with...
By Fathima Safa 2026-07-06 05:59:05 0 59
SURAKSHA
Syed Ali Murtaza Rizvi IAS: A Vision for Good Governance
A distinguished Telangana IAS officer whose administrative excellence, visionary leadership, and...
By Lokeshwari Panthadi 2026-07-10 10:23:00 0 107
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com