అసెంబ్లీని కొడవలివారిపాలెం విద్యార్థులు పర్చూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఏలూరితో ముచ్చట్లు...

0
539

పర్చూరు: బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని కొడవలివారిపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్‌కు చెందిన 8వ తరగతి విద్యార్థులు గురువారం ఆంధ్రప్రదేశ్ శాసనసభను సందర్శించారు. శాసనసభ సమావేశాలను ప్రత్యక్షంగా వీక్షించిన విద్యార్థులు సభ నిర్వహణ, చట్టసభ కార్యకలాపాల గురించి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా విద్యార్థులు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, హోంమంత్రి వంగలపూడి అనిత, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. వారు విద్యార్థులతో మాట్లాడి శాసనసభ ప్రాధాన్యత, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధుల పాత్ర గురించి వివరించారు.
అనంతరం ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే రాజకీయ చైతన్యం, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడం ఎంతో అవసరమన్నారు. శాసనసభ వంటి ప్రజాస్వామ్య వ్యవస్థలను ప్రత్యక్షంగా చూసే అవకాశం విద్యార్థులకు మంచి అనుభవాన్ని అందిస్తుందని తెలిపారు. చట్టసభలు ఎలా పనిచేస్తాయి, ప్రజా సమస్యలపై ఎలా చర్చలు జరుగుతాయి అన్న విషయాలు తెలుసుకోవడం ద్వారా విద్యార్థులకు విస్తృతమైన అవగాహన కలుగుతుందని పేర్కొన్నారు.
శాసనసభ సందర్శనపై విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో కలిసి ఫోటోలు దిగారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
కార్యకర్తలకు అండగా నూరి ఫాతిమా గారు – ధైర్యం కోల్పోవద్దు, పార్టీ మీకు తోడుంటుంది.
మాజీ మంత్రి వర్యులు శ్రీ అంబటి రాంబాబు గారి నివాసం వద్ద జరిగిన దురదృష్టకర ఘటనలో గాయపడిన మున్సిపల్...
By John Baji 2026-02-03 07:09:37 0 160
Telangana
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల (2BHK) ప్రాజెక్టులకు ఇసుక రవాణా చేసిన కాంట్రాక్టర్లపై విచారణ జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక విజ్ఞప్తి
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణంలో ఇసుక సరఫరాపై తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్...
By Ponnala Srinivasrao 2026-03-27 11:01:57 0 193
SURAKSHA
Ila Tripathi IAS: Inspiring Governance Through Excellence
A Young Telangana IAS Officer Driving Inclusive Development, Transparent Administration, and...
By Lokeshwari Panthadi 2026-07-14 11:27:51 0 158
Andhra Pradesh
మదనపల్లెలో బెల్ట్ షాపు నిర్వాహకుడి అరెస్ట్.
మదనపల్లె పట్టణంలోని చంద్రకాలనీలో అక్రమంగా బెల్ట్ షాపు నిర్వహిస్తున్న గంగయ్యను ఎక్సైజ్ అధికారులు...
By Pagadala Venkateswar 2026-06-23 06:01:23 0 55
Andhra Pradesh
పుంగనూరులో HPV టీకా కార్యక్రమం ప్రారంభం
పుంగనూరులో బుధవారం గర్భాశయ క్యాన్సర్ నివారణకు HPV టీకా కార్యక్రమం ప్రారంభమైంది. ఈ టీకా హ్యూమన్...
By Kothuru Murali 2026-03-11 11:11:34 0 144
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com