చీరాల అభివృద్ధి పై పవన్‌కు ఎమ్మెల్యే కొండయ్య వినతి నియోజకవర్గంలో రోడ్ల మరమ్మతులకు నిధులు కోరిన ఎమ్మెల్యే, నిధుల మంజూరుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ.

0
143

చీరాల: చీరాల ఎమ్మెల్యే MMకొండయ్య,ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ను గురువారం అయన ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిశారు .ఈసందర్భంగా నియెజకవర్గంలోని అభివృధి ఫై సుదీర్ఘంగా చర్చించారు .ముఖ్యంగా చీరాల నియోజకవర్గం ఎదుర్కొంటున్న శాఖాపరమైన  ప్రధాన సమస్యలను ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి  తీసుకెళ్లినట్టు స్థానిక ఎమ్మెల్యే MMకొండయ్య  వెల్లడించారు. మరమ్మతులకు నోచుకోని రహదారులతో  పాటు, కీలకమైన తాగునీటి ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని అయన  విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రం  అందజేశారు.ఈసందర్భంగా  చీరాల  నియోజకవర్గంలోని చీరాల, వేటపాలెం మండలంలోని గ్రామాలలో  రోడ్ల మరమ్మతులకు, కొత్త రోడ్లు ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే MMకొండయ్య ,ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కి  విన్నవించారు . గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గ పరిధిలోని చాలా రోడ్లు అభివృద్ధికి నోచుకోక, నిర్లక్ష్యానికి గురియ్యాయన్నారు . ముఖ్యంగా  రోడ్ల మరమ్మతు పనులు కూడా చేపట్టకపోవడంతో అనేక గ్రామాలలో రోడ్లు చాలా అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయన్నారు.ఇటీవల్ల తుపాన్ ప్రభావంతో   నియోజవర్గంలోని సముద్రతీర ప్రాంతాలలోని ప్రధాన కల్వర్టులు రోడ్లు , గ్రామీణ ప్రాంతాల రోడ్లు దేబతిన్న విషయాన్ని ఎమ్మెల్యే కొండయ్య ఉప ముఖ్యమంత్రి పవన్ దృష్టికి తీసుకెళ్ళేరు .ఇదే క్రమంలో  జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాలలో చేపట్టిన నీటి ప్రాజెక్టులు, ఇంకను గ్రామీణ ప్రాంతాలలో చేపట్టాల్సిన నీటి ప్రాజెక్ట్ గూర్చి  క్షుణంగా విచారించినట్లు చెప్పేరు. ఇక ఎమ్మెల్యే కొండయ్య , ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లిన చీరాల అభివృద్ధి  అంశాల ఫై  సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు .అంతేకాకుండా నిధుల మంజూరుకు భరోసా ఇచ్చారన్నారు .ఈక్రమంలోనే  పర్యాటకరంగంగా అభివృద్ధి చెందుతున్న చీరాల ప్రాంతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించాలని , ఆహ్వానించినట్లు  ఎమ్మెల్యే కొండయ్య తెలిపారు .ఇదే క్రమంలో ఎమ్మెల్యే MMకొండయ్య ఆహ్వానం పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సానుకూలంగా  స్పందించినట్లు తెలిపారు .

Search
Categories
Read More
Andhra Pradesh
న్యూ ఇయర్ వేళ ఏపీలోని మద్యం దుకాణాల పని వేళల్లో మార్పులు.
కొత్త సంవత్సరానికి వెల్ కమ్ చెప్పేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ సిద్దమవుతున్నారు. ఇప్పటికే...
By John Baji 2025-12-30 05:17:55 0 129
Telangana
దూలపల్లి PACS కు ISO & HYM సర్టిఫికేషన్. అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్
దూలపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) ISO & HYM సర్టిఫికేషన్ అందుకున్న సందర్భంగా...
By Sidhu Maroju 2025-07-02 09:32:27 0 1K
Nagaland
Tribes Resume Sit-In Protest Over 48-Year-Old Reservation Policy
The Nagaland Cabinet has approved the Nagaland Youth Policy 2025, aiming to empower the...
By Bharat Aawaz 2025-07-17 11:06:31 0 1K
Andhra Pradesh
శ్రీకాకుళం: 'టీడీపీ నాయకుడిపై చర్యలు తీసుకోవాలి'
శ్రీకాకుళం నగరంలో జర్నలిస్టుపై జరిగిన దాడికి నిరసనగా జర్నలిస్టు నాయకులు ఆందోళన చేపట్టారు. ఆ...
By Manda Ramkumar 2026-03-28 09:00:03 0 131
Andhra Pradesh
అయేషా మీరా తల్లిదండ్రుల వినతి పత్రం
తమ కుమార్తె ఆయేషా మీరా పేరుతో విద్యా సంస్థను నెలకొల్పి డిసెంబర్ 27వ తేదీన సంస్మరణ దినోత్సవం...
By Rajini Kumari 2025-12-27 11:06:49 0 149
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com