చీరాల అభివృద్ధి పై పవన్‌కు ఎమ్మెల్యే కొండయ్య వినతి నియోజకవర్గంలో రోడ్ల మరమ్మతులకు నిధులు కోరిన ఎమ్మెల్యే, నిధుల మంజూరుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ.

0
224

చీరాల: చీరాల ఎమ్మెల్యే MMకొండయ్య,ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ను గురువారం అయన ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిశారు .ఈసందర్భంగా నియెజకవర్గంలోని అభివృధి ఫై సుదీర్ఘంగా చర్చించారు .ముఖ్యంగా చీరాల నియోజకవర్గం ఎదుర్కొంటున్న శాఖాపరమైన  ప్రధాన సమస్యలను ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి  తీసుకెళ్లినట్టు స్థానిక ఎమ్మెల్యే MMకొండయ్య  వెల్లడించారు. మరమ్మతులకు నోచుకోని రహదారులతో  పాటు, కీలకమైన తాగునీటి ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని అయన  విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రం  అందజేశారు.ఈసందర్భంగా  చీరాల  నియోజకవర్గంలోని చీరాల, వేటపాలెం మండలంలోని గ్రామాలలో  రోడ్ల మరమ్మతులకు, కొత్త రోడ్లు ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే MMకొండయ్య ,ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కి  విన్నవించారు . గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గ పరిధిలోని చాలా రోడ్లు అభివృద్ధికి నోచుకోక, నిర్లక్ష్యానికి గురియ్యాయన్నారు . ముఖ్యంగా  రోడ్ల మరమ్మతు పనులు కూడా చేపట్టకపోవడంతో అనేక గ్రామాలలో రోడ్లు చాలా అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయన్నారు.ఇటీవల్ల తుపాన్ ప్రభావంతో   నియోజవర్గంలోని సముద్రతీర ప్రాంతాలలోని ప్రధాన కల్వర్టులు రోడ్లు , గ్రామీణ ప్రాంతాల రోడ్లు దేబతిన్న విషయాన్ని ఎమ్మెల్యే కొండయ్య ఉప ముఖ్యమంత్రి పవన్ దృష్టికి తీసుకెళ్ళేరు .ఇదే క్రమంలో  జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాలలో చేపట్టిన నీటి ప్రాజెక్టులు, ఇంకను గ్రామీణ ప్రాంతాలలో చేపట్టాల్సిన నీటి ప్రాజెక్ట్ గూర్చి  క్షుణంగా విచారించినట్లు చెప్పేరు. ఇక ఎమ్మెల్యే కొండయ్య , ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లిన చీరాల అభివృద్ధి  అంశాల ఫై  సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు .అంతేకాకుండా నిధుల మంజూరుకు భరోసా ఇచ్చారన్నారు .ఈక్రమంలోనే  పర్యాటకరంగంగా అభివృద్ధి చెందుతున్న చీరాల ప్రాంతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించాలని , ఆహ్వానించినట్లు  ఎమ్మెల్యే కొండయ్య తెలిపారు .ఇదే క్రమంలో ఎమ్మెల్యే MMకొండయ్య ఆహ్వానం పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సానుకూలంగా  స్పందించినట్లు తెలిపారు .

Search
Categories
Read More
Andhra Pradesh
నగర అభివృద్ధిని అడ్డుకున్న వైసిపి
*ప్ర‌చుర‌ణార్థం* *18-02-2026*   *న‌గ‌రాభివృద్ధిని అడ్డుకున్న వైసిపి...
By Rajini Kumari 2026-02-19 07:10:45 0 134
Andhra Pradesh
నూతన సంవత్సర శుభాకాంక్షలు
భారత్ ఆవాజ్  మీడియా మిత్రులకు, ప్రతినిధులకు  మరియు ఆంధ్ర రాష్ట్ర, తెలంగాణ రాష్ట్ర...
By Karapati Gopi 2026-01-01 00:40:13 0 462
Andhra Pradesh
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం ఉదయం 09.00 గంటల నుండి మధ్యాహ్నం 01.00 గంటల వరకు క్రింది కార్యాలయాల్లో నిర్వహించబడుతుందని శ్రీయుత జిల్లా కలెక్టర్ డా ||వి. వినోద్ కుమార్,ఐ.ఏ.ఎస్ గారు తెలియజేసి ఉన్నారు.
రేపు అనగా సోమవారం(29-12-2025)ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమంఉదయం 09.00 గంటల నుండి...
By Gadiyapudi Narendra 2025-12-28 16:34:39 0 227
Andhra Pradesh
అంగరంగ వైభవంగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం
*వైభవంగా మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం*   *సతీసమేతంగా పాల్గొన్న...
By Rajini Kumari 2026-03-03 11:54:53 0 125
Andhra Pradesh
Ayyanna Patrudu: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు... కీలక నిర్ణయం తీసుకున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు!
ఇకపై డిజిటల్ విధానంలోనే ఎమ్మెల్యేల హాజరు నమోదు చేయాలని నిర్ణయించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు...
By Pagadala Venkateswar 2026-02-11 07:43:54 0 109
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com