TTD: మార్చి 17న తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.

0
84

ఈ నెల 19న ఉగాది పర్వదినం

ఉగాదిని పురస్కరించుకుని ఈ నెల 17న ఆలయ శుద్ధి కార్యక్రమం

17న బ్రేక్ దర్శనాలు, అష్టదళ పాదపద్మారాధన సేవలు రద్దు

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో త్వరలో జరగబోయే 'ఉగాది ఆస్థానం' వేడుకలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక ఏర్పాట్లు చేస్తోంది. మార్చి 19న తెలుగు నూతన సంవత్సరం ఉగాదిని పురస్కరించుకుని నిర్వహించే ఈ ప్రత్యేక పర్వదినం కోసం ఆలయాన్ని శుద్ధి చేసేందుకు మార్చి 17న (మంగళవారం) 'కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం' కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఉగాది, ఆణివార ఆస్థానం, వార్షిక బ్రహ్మోత్సవాలు మరియు వైకుంఠ ఏకాదశి వంటి ప్రధాన పండుగలకు ముందు వచ్చే మంగళవారాల్లో ఈ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించడం టీటీడీలో అనాదిగా వస్తున్న ఆచారం.

 

 

 

ఈ నేపథ్యంలో మార్చి 17న వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళ పాదపద్మారాధన సేవలను టీటీడీ రద్దు చేసింది. దీని కారణంగా మార్చి 16న ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా మిగిలిన వారికి వీఐపీ బ్రేక్ దర్శనాల కోసం సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ఉగాది పర్వదినం సందర్భంగా కూడా ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా సాధారణ వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. కావున మార్చి 18న సిఫార్సు లేఖలు సమర్పించే అవకాశం ఉండదు.

Search
Categories
Read More
Andhra Pradesh
చీరాల వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా పి. వెంకటేశ్వర రెడ్డి బాధ్యతల స్వీకారం
చీరాల: చీరాల వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు నూతన ఎస్సైగా పి. వెంకటేశ్వర రెడ్డి బాధ్యతలు...
By Gadiyapudi Narendra 2026-02-04 16:35:59 0 133
Andhra Pradesh
పోలేరమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠలో కాంగ్రెస్ నాయకులు ఎస్. రెడ్డీ సాహెబ్.
మదనపల్లె సీటీఎం రోడ్ శివాజీ నగర్‌లో ఆదివారం శ్రీ పోలేరమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం...
By Pagadala Venkateswar 2026-03-09 05:42:58 0 76
Andhra Pradesh
సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి
ఈవీఎం భద్రతా గిడ్డంగి వద్ద ఉన్న సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి...
By Boiena Rajesh 2026-03-26 14:26:18 0 113
Andhra Pradesh
రహదారుల రూపకల్పనకు నిర్మాణాత్మకమైన కృషి.-బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు వెల్లడి
బాపట్ల నియోజకవర్గంలోని తీర ప్రాంత గ్రామాలకు మహర్దశ కలిగింది. శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు...
By John Baji 2026-02-04 12:49:11 0 229
Andhra Pradesh
రేపల్లె మండలం పెనుమూడి చెకపోస్ట్ దగ్గర వేమూరు నుండి కృష్ణ జిల్లా వెళ్తున్న లారిలో 25 టన్నుల అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుకున్న పోలీసులు...ఇంకా పూర్తి వివరాలు తెలియలిసి ఉంది...
రేపల్లె మండలం పెనుమూడి చెకపోస్ట్ దగ్గర వేమూరు నుండి కృష్ణ జిల్లా వెళ్తున్న లారిలో 25 టన్నుల...
By Gadiyapudi Narendra 2026-01-04 16:07:54 0 177
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com