వేటపాలెం మండలంలో రేషన్ దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు...

0
139

చీరాల: వేటపాలెం మండల పరిధిలోని రేషన్ దుకాణాలపై బుధవారం రెవెన్యూ డివిజనల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మొత్తం ఎనిమిది రేషన్ దుకాణాలను పరిశీలించగా, ఆరు దుకాణాల్లో నిర్దేశిత పరిమితిని మించిన నిల్వలు ఉన్నట్లు గుర్తించారు.
నిబంధనలకు విరుద్ధంగా అదనపు స్టాక్ నిల్వ ఉంచిన ఆరు దుకాణాలపై కేసులు నమోదు చేసి, సంబంధిత దుకాణాలను సీజ్ చేశారు. ప్రజలకు సరఫరా చేయాల్సిన నిత్యావసర వస్తువుల విషయంలో ఎలాంటి అక్రమాలు సహించబోమని అధికారులు స్పష్టం చేశారు.
ఈ తనిఖీలలో ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు, వేటపాలెం తహసీల్దార్ గీతారాణి, సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ మరియు రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు. చీరాల మండల గ్రామ రెవెన్యూ అధికారులు కూడా తనిఖీలకు సహకరించారు.
ప్రజల హక్కులను పరిరక్షించేందుకు అధికారులు చేపట్టిన ఈ చర్యలపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Telangana
నగరవాసుల ప్లేట్లలో 'విషం': భారీగా పట్టుబడ్డ కల్తీ పన్నీరు నిల్వలు.|
హైదరాబాద్ : సికింద్రాబాద్‌లో భారీ కల్తీ పన్నీరు గుట్టురట్టు: 3,000 కిలోలు సీజ్.. ఆరు షాపులపై...
By Sidhu Maroju 2026-03-18 16:47:49 0 145
Andhra Pradesh
మదనపల్లె: వృద్ధురాలిపై దంపతుల పైశాచిక దాడి.
మదనపల్లె కురవంకలో మంగళవారం ఉదయం భాగ్యమ్మ (60) అనే వృద్ధురాలిపై అదే ప్రాంతానికి చెందిన ప్రకాశ్,...
By Pagadala Venkateswar 2026-03-03 08:55:05 0 93
Andhra Pradesh
నందవరంలో శ్రీమాతా బంగారం అవ్వ దేవాలయమును దర్శించుకున్న ఎర్రకోట రాజీవ్ రెడ్డి
నందవరం మండలం, గ్రామం నేడు ఆధ్యాత్మికోత్సాహంతో కళకళలాడింది. భక్తి పరవశంలో మునిగిపోయిన గ్రామ ప్రజల...
By Boya Dasthagiri 2026-04-02 10:03:20 0 142
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com