వేటపాలెం మండలంలో రేషన్ దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు...

0
177

చీరాల: వేటపాలెం మండల పరిధిలోని రేషన్ దుకాణాలపై బుధవారం రెవెన్యూ డివిజనల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మొత్తం ఎనిమిది రేషన్ దుకాణాలను పరిశీలించగా, ఆరు దుకాణాల్లో నిర్దేశిత పరిమితిని మించిన నిల్వలు ఉన్నట్లు గుర్తించారు.
నిబంధనలకు విరుద్ధంగా అదనపు స్టాక్ నిల్వ ఉంచిన ఆరు దుకాణాలపై కేసులు నమోదు చేసి, సంబంధిత దుకాణాలను సీజ్ చేశారు. ప్రజలకు సరఫరా చేయాల్సిన నిత్యావసర వస్తువుల విషయంలో ఎలాంటి అక్రమాలు సహించబోమని అధికారులు స్పష్టం చేశారు.
ఈ తనిఖీలలో ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు, వేటపాలెం తహసీల్దార్ గీతారాణి, సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ మరియు రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు. చీరాల మండల గ్రామ రెవెన్యూ అధికారులు కూడా తనిఖీలకు సహకరించారు.
ప్రజల హక్కులను పరిరక్షించేందుకు అధికారులు చేపట్టిన ఈ చర్యలపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
మీ వివరాలే దేశ ప్రగతికి మెట్లు 2027 జనాభా గణనకు సహకరించండి..!
దేశ భవిష్యత్తును నిర్ణయించే కీలక అడుగు పడబోతోంది. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకగా చేపట్టిన 2027...
By Shyamala Yadagiri 2026-05-08 04:57:13 0 105
Andhra Pradesh
పుంగనూరు: మద్యం మత్తులో డ్రైవ్ చేయడంతో ప్రమాదం.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని యుఎన్ఆర్ సర్కిల్ 42వ జాతీయ రహదారిపై చిత్తూరు నుంచి అనంతపురం...
By Kothuru Murali 2026-01-28 09:10:02 0 119
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి వేగం.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మంగళవారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా పరిశ్రమలు,...
By Pagadala Venkateswar 2026-04-29 04:50:53 0 56
Andhra Pradesh
AP SSC: ఏపీలో నేటి నుంచి పదో తరగతి హాల్ టికెట్ల జారీ.
AP SSC: ఏపీలో నేటి నుంచి పదో తరగతి హాల్ టికెట్ల జారీ 05-03-2026 Thu 14:58 | Andhra   AP...
By Pagadala Venkateswar 2026-03-05 09:43:59 0 106
Andhra Pradesh
మల్లన్న సన్నిధిలో భక్తుల తాకిడి !!
కర్నూలు : శని, ఆదివారాలు సెలవులు కావడంతో శ్రీశైలంలో భక్తుల రద్దీ అమాంతంగా పెరిగింది. వేలాది మంది...
By Hari Krishna 2025-12-22 02:01:21 0 191
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com