రేపు వేమూరు నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటన... వివరాలు ఇవిగో!

0
108

ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. 'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమంలో భాగంగా ఆయన రైతన్నలకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను అందజేయనున్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన భూముల రీ సర్వే ప్రక్రియ అనేక తప్పులతో గందరగోళంగా మారిందన్న నేపథ్యంలో, కూటమి ప్రభుత్వం ఆ తప్పులను సరిదిద్దే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టింది. ఈ క్రమంలోనే రైతులకు ఎలాంటి అపోహలు, ఆందోళనలు లేకుండా స్పష్టమైన హక్కు పత్రాలు అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

 

గత ప్రభుత్వ హయాంలో పొలాల హద్దు రాళ్లపై, రైతులకు ఇచ్చే పట్టాదారు పాసు పుస్తకాలపై నాటి ముఖ్యమంత్రి ఫొటోలు ముద్రించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. వీటన్నింటినీ ప్రక్షాళన చేస్తున్న కూటమి ప్రభుత్వం, రాజముద్రతో కూడిన కొత్త పాసు పుస్తకాలను రైతులకు అందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 16,816 గ్రామాల్లో రీ సర్వే చేపట్టాల్సి ఉండగా, ఇప్పటివరకు 6,976 గ్రామాల్లో ఈ ప్రక్రియ పూర్తయింది. ఈ ఏడాది చివరికల్లా మిగిలిన గ్రామాల్లోనూ సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 5,717 గ్రామాల్లో సుమారు 22.79 లక్షల పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు పంపిణీ చేసింది.

 

భవిష్యత్తులో భూ రికార్డుల తారుమారుకు ఆస్కారం లేకుండా ప్రభుత్వం పటిష్ఠమైన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా భూ రికార్డుల భద్రత కోసం అత్యంత అధునాతనమైన బ్లాక్‌చైన్ టెక్నాలజీని వినియోగంలోకి తీసుకురానుంది. ఈ విధానం అమలైతే రికార్డులను ట్యాంపర్ చేయడం దాదాపు అసాధ్యం. గురువారం జరిగే కార్యక్రమంలో భాగంగా బాపట్ల జిల్లాలోని 8 మండలాల పరిధిలో 3,658, ప్రత్యేకంగా వేమూరు నియోజకవర్గంలో 1,795 పాసు పుస్తకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పంపిణీ చేయనున్నారు.

 

ముఖ్యమంత్రి పర్యటన వివరాలు

 

ఉదయం 10:50 గంటలకు భట్టిప్రోలు మండలం సూరేపల్లి గ్రామానికి చేరుకుంటారు. 11 గంటలకు అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం 1:35 గంటలకు వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించి, రైతులతో ముఖాముఖిగా మాట్లాడతారు. మధ్యాహ్నం 2:10 గంటలకు టీడీపీ శ్రేణులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. పర్యటన ముగించుకుని సాయంత్రం 4:05 గంటలకు తిరిగి అమరావతికి బయలుదేరుతారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: పెద్ద మనసు చాటుకున్న జర్నలిస్టులు.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం సోమలకు చెందిన జర్నలిస్ట్ కృష్ణమూర్తి శనివారం మృతి చెందారు....
By Kothuru Murali 2026-01-24 12:11:37 0 155
Andhra Pradesh
పుంగనూరులో ఆ పనులు పూర్తి చేయకుంటే నిరాహార దీక్ష: బీజేపీ
పుంగనూరు-బెంగళూరు మార్గంలో పుంగమ్మ చెరువు కట్టపై రోడ్డు మరమ్మతులకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది....
By Kothuru Murali 2026-04-29 11:33:33 0 65
Andhra Pradesh
మదనపల్లి లో దినసరి మార్కెట్ టెండర్లు వాయిదా.
మదనపల్లె మున్సిపాలిటీలో 2026–27 ఏడాదికి గాను వారపు సంత, జంతు వధశాల వేలం పాటలు బుధవారం...
By Pagadala Venkateswar 2026-03-12 05:42:02 0 126
Andhra Pradesh
BITS Pilani: ఏపీ రాజధాని అమరావతిలో బిట్స్ పిలానీ... సీఆర్డీఏతో కీలక ఒప్పందం.
బిట్స్ పిలానీ ఏర్పాటుకు తుళ్లూరు మండలంలోని మందడం, వెంకటపాలెం గ్రామాల పరిధిలో 70 ఎకరాలు కేటాయించిన...
By Pagadala Venkateswar 2026-01-31 06:10:24 0 124
Andhra Pradesh
అర్హత కలిగిన పేద విద్యార్థుల విద్య
శ్రీకాకుళం: ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాల పిల్లలకు...
By Manda Ramkumar 2026-03-27 04:45:43 0 150
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com