రేపు వేమూరు నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటన... వివరాలు ఇవిగో!

0
136

ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. 'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమంలో భాగంగా ఆయన రైతన్నలకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను అందజేయనున్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన భూముల రీ సర్వే ప్రక్రియ అనేక తప్పులతో గందరగోళంగా మారిందన్న నేపథ్యంలో, కూటమి ప్రభుత్వం ఆ తప్పులను సరిదిద్దే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టింది. ఈ క్రమంలోనే రైతులకు ఎలాంటి అపోహలు, ఆందోళనలు లేకుండా స్పష్టమైన హక్కు పత్రాలు అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

 

గత ప్రభుత్వ హయాంలో పొలాల హద్దు రాళ్లపై, రైతులకు ఇచ్చే పట్టాదారు పాసు పుస్తకాలపై నాటి ముఖ్యమంత్రి ఫొటోలు ముద్రించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. వీటన్నింటినీ ప్రక్షాళన చేస్తున్న కూటమి ప్రభుత్వం, రాజముద్రతో కూడిన కొత్త పాసు పుస్తకాలను రైతులకు అందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 16,816 గ్రామాల్లో రీ సర్వే చేపట్టాల్సి ఉండగా, ఇప్పటివరకు 6,976 గ్రామాల్లో ఈ ప్రక్రియ పూర్తయింది. ఈ ఏడాది చివరికల్లా మిగిలిన గ్రామాల్లోనూ సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 5,717 గ్రామాల్లో సుమారు 22.79 లక్షల పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు పంపిణీ చేసింది.

 

భవిష్యత్తులో భూ రికార్డుల తారుమారుకు ఆస్కారం లేకుండా ప్రభుత్వం పటిష్ఠమైన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా భూ రికార్డుల భద్రత కోసం అత్యంత అధునాతనమైన బ్లాక్‌చైన్ టెక్నాలజీని వినియోగంలోకి తీసుకురానుంది. ఈ విధానం అమలైతే రికార్డులను ట్యాంపర్ చేయడం దాదాపు అసాధ్యం. గురువారం జరిగే కార్యక్రమంలో భాగంగా బాపట్ల జిల్లాలోని 8 మండలాల పరిధిలో 3,658, ప్రత్యేకంగా వేమూరు నియోజకవర్గంలో 1,795 పాసు పుస్తకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పంపిణీ చేయనున్నారు.

 

ముఖ్యమంత్రి పర్యటన వివరాలు

 

ఉదయం 10:50 గంటలకు భట్టిప్రోలు మండలం సూరేపల్లి గ్రామానికి చేరుకుంటారు. 11 గంటలకు అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం 1:35 గంటలకు వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించి, రైతులతో ముఖాముఖిగా మాట్లాడతారు. మధ్యాహ్నం 2:10 గంటలకు టీడీపీ శ్రేణులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. పర్యటన ముగించుకుని సాయంత్రం 4:05 గంటలకు తిరిగి అమరావతికి బయలుదేరుతారు.

Search
Categories
Read More
SURAKSHA
Hargobinder Singh Dhaliwal, IPS: Leading with Courage & Vision
An accomplished AGMUT cadre IPS officer, Shri Hargobinder Singh Dhaliwal has built a...
By Lokeshwari Panthadi 2026-07-18 08:17:56 0 49
Andhra Pradesh
మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కంభం పట్టణంలో NTR మెమోరియల్ టోర్నమెంట్ 2026 ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్
మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కంభం పట్టణంలో NTR మెమోరియల్ టోర్నమెంట్ 2026 ఆధ్వర్యంలో...
By Chennaiah Kati 2026-01-19 16:31:31 0 339
Andhra Pradesh
విందుకు వచ్చి మృతి చెందిన ముగ్గురు స్నేహితులు.
అన్నమయ్య జిల్లా, కురబలకోట మండలం, సర్కారుతోపు వద్ద గురువారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో...
By Pagadala Venkateswar 2026-03-20 03:38:41 0 161
Andhra Pradesh
ఒకరోజు ముందే పింఛన్ల పంపిణీ డాక్టర్ జి లక్ష్మీశ
*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌* *ఎన్‌టీఆర్ జిల్లా, డిసెంబ‌ర్ 31, 2025*...
By Rajini Kumari 2025-12-31 11:03:09 0 238
SADHANA
The NEET 2026 Heist: Is Your Doctor a Student or a Customer?
The OMR sheet used to be a symbol of equality; in 2026, it became a receipt for a ₹50 lakh...
By Hazu MD. 2026-05-14 09:28:44 0 160
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com